తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ పథకం ద్వారా జూన్ 2 నుంచి కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనుంది.
Cheyutha Pension Scheme: జూన్ 2 నుంచి మీ అకౌంట్లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా
Cheyutha Pension Scheme: తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి కొత్తగా రెండు లక్షల చేయూత పెన్షన్లు పంపిణీ చేయనుంది. చేయూత స్కీమ్ అర్హతలు, దరఖాస్తు ప్రక్రియను తెలుసుకుందాం.

- తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకంతో కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్.
- వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం.
- 57 ఏళ్లు పైబడినవారితో పాటు చేనేత, గీత కార్మికులకు కూడా వర్తింపు.
- ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు; జూన్ 2 నుంచి పంపిణీ.
Cheyutha Pension Scheme: తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి 'చేయూత' పెన్షన్ పథకం ద్వారా కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేయనుంది. సమాజంలోని అణగారిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చేయూత పథకం అండగా నిలుస్తుంది. అర్హులైన వారు ఎలాంటి ఆలస్యం లేకుండా డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, ముందుగానే దరఖాస్తు చేసుకుంటే సకాలంలో పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. గత మూడేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు పెన్షన్లు ఇస్తున్నారు.
ఎవరు అర్హులు?
57 ఏళ్ల వయసు పైబడిన వారికే కాకుండా, చేనేత కార్మికులు, గీత కార్మికులకు కూడా చేయూత పథకం వర్తిస్తుంది. తక్కువ వార్షిక ఆదాయం, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలవారీ పింఛన్ అందిస్తున్నారు. ఈ పథకంతో పాటు, అర్హత గల పేద కుటుంబాలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.
Aslo Read: రూ.50 లక్షల లోన్, రూ.17 లక్షల సబ్సిడీ.. PMEGP Scheme అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇలా
చేయూత పెన్షన్ స్కీమ్ అర్హతలు
చేయూత పథకం కింద నెలవారీ పెన్షన్ పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ నిబంధనలు పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణాల్లో ఉండే వారికి రూ. 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, డిజెబిలిటీ సర్టిఫికెట్(వికలాంగులు), డెత్ సర్టిఫికెట్(వితంతువులు), వైద్య ధ్రువపత్రాలు (వ్యాధిగ్రస్తులు) ఉండాలి. పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేసేందుకు బ్యాంకు అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలి.
Aslo Read: గ్లోబల్ సిటీలో గ్లోబల్ కార్: హైదరాబాద్కు టెస్లా రాక ఖరారు!
దరఖాస్తు ప్రక్రియ
చేయూత పథకానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ, మీసేవ కేంద్రాల్లో అప్లికేషన్లు సబ్మిట్ చేయవచ్చు. 'ప్రజా పాలన' వేదిక ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఫీల్డ్ ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి వివరాలను పరిశీలిస్తారు. మీ జీవన ప్రమాణాలు, ఆదాయ వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారు. వయసుకు సంబంధించిన పత్రాలు తప్పులున్నా.. సమాచారం సరిపోకపోయినా మీ అప్లికేషన్ ను రిజెక్ట్ చేస్తారు. అర్హులై ఉండి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే, జిల్లా కలెక్టరేట్లో అప్పీల్ చేసుకోవచ్చు. అందుకే డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవడం మంచిది. జూన్ 2న అధికారికంగా ఈ కార్యక్రమం స్వీకరించనున్నారు. మరిన్ని వివరాల కోసం cheyutha.telangana.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
Aslo Read: యాదాద్రిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల, పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Frequently Asked Questions
చేయూత పెన్షన్ పథకం కింద ఎంతమందికి కొత్తగా పెన్షన్లు అందనున్నాయి?
చేయూత పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు?
57 ఏళ్లు పైబడిన వారు, చేనేత, గీత కార్మికులు, తక్కువ ఆదాయం, తెల్ల రేషన్ కార్డు కలిగిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు అర్హులు.
చేయూత పెన్షన్ పొందడానికి ఆదాయ పరిమితి ఎంత?
గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు లోపు ఉండాలి.
చేయూత పెన్షన్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో గ్రామ పంచాయతీ, మీసేవ కేంద్రాల్లో లేదా 'ప్రజా పాలన' వేదిక ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు





















