అన్వేషించండి

తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా పోటాపోటీ దర్యాప్తులు ఎవరి కోసం, ఎంత వరకు?

ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్ప ఈ విచారణలతో  సామాన్యులకి ఓరిగేది ఏమీ లేదంటున్నారు. 2G స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కాం, బోఫోర్స్‌ కేసులను గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆరోపణలు, విమర్శలు నిజమేనా? అన్న మాటలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు అధికార అటు కేంద్ర సంస్థలు జరుపుతున్న విచారణలే సమాధానాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలకు ఈడీ, సిట్‌, సీబీఐ, ఐటీ సంస్థల విచారణలో ప్రజలకు తెలియాల్సిందంతా తెలుస్తోందా? ఈ దాడులతో ఎవరికి లబ్ది చేకూరుతోంది? 

ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నువ్వానేనా అన్న రేంజ్‌లో యుద్ధం సాగుతోంది. ఇందులో ఈడీ, సిట్‌, సీబీఐ ప్రధాన అస్త్రాలుగా మారాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలకు ఈ సంస్థలు కేరాఫ్‌గా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 8ఏళ్ల పాలనలో కెసిఆర్‌ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలన్నీ ఆరోపణలు చేశాయి. అంతేకాదు బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య యుద్ధం రోడ్డు మీదకి చేరడంతో ఇప్పుడు ఆయా నేతల గుట్టు బయటపడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించిందో ఇక అప్పటి నుంచి ఈ నోటీసుల ప్రక్రియ స్పీడందుకుంది. గత కొన్నిరోజులుగా టీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేస్తూ ఈడీ, ఐటీ నోటీసులు పంపుతున్నారు. ఫెమా ఉల్లంఘన కేసులో ఎమ్యెల్యే కిషన్‌ రెడ్డి ఈడీ ఎదుట హాజరైతే మైనింగ్‌ కేసుకి సంబంధించి మంత్రి గంగుల ఆయన కుటుంబసభ్యులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. క్యాసినో కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ రమణ ఈడీ ముందు హాజరయ్యారు. మంత్రి తలసాని సోదరులకు, పీఏ, తలసాని కొడుక్కి కూడా ఈడీ నోటీసులు పంపింది. త్వరలోనే ఇంకొంతమందికి ఈడీ, ఐటీ నోటీసులు రానున్నట్లు స్వయంగా కేసీఆరే చెప్పారు. 

బీజేపీ ఆడుతున్న ఆటకు ప్రతిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా సీబీఐ రాకను అడ్డుకుంటూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ వెబ్‌ సైట్లలోనూ, రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద కూడా అవకాశం లేకుండా పకడ్బందీగా వ్యవరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో బీజేపీ నేతలను జైలుకి పంపించి సిట్‌తో దర్యాప్తు చేయిస్తోంది. ఈ కేసులో లింక్‌ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ రాష్ట్ర పెద్దలకు సిట్‌ నోటీసులు ఇచ్చినా వాళ్లు హాజరుకాకపోవడంతో ఏ క్షణానైనా అరెస్ట్‌ ఉండచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు చేసుకోవడమే కాకుండా ఆయా సంస్థలను కూడా రంగంలోకి దింపడంతో ఏఏ పార్టీ.. ఏఏ రాజకీయనాయకుడు... ఏఏ రూపంలో... ఏ విధంగా ఏ రూట్లో అవినీతికి పాల్పడ్డాడన్నది ఆధారాలతో సహా ప్రజలకు తెలిసే టైమ్‌ వచ్చేసిందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు తెర వెనక జరిగిన అవినీతంతా ఇప్పుడు ఆయా సంస్థల ఎంట్రీతో బయటపడుతుందని చెబుతున్నారు. 

దీన్ని రాజకీయకోణంలో ఆలోచించే వాళ్లు మాత్రం ఇదంతా ఓ నాటకమని కొట్టిపారేస్తున్నారు. రాజకీయకక్షసాధింపు చర్యల్లో భాగమే తప్ప ఏ రాజకీయనాయకుడి అవినీతి బయటపడదంటున్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్ప ఈ విచారణలతో సామాన్యులకి ఒరిగేది ఏమీ లేదంటున్నారు. 2G స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కాం, బోఫోర్స్‌ కేసు, రాఫెల్‌ యుద్ద విమానాలతోపాటు పలు స్కాంల్లో కోట్లు ఖర్చు పెట్టి చివరికి ఎవరి తప్పు లేదని ఆ కేసులను ముగించిన విషయాలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈడీ, ఐటీ, సిట్‌ కేసులు కూడా అంతేనని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు 2023 ఎలక్షన్స్ వరకు ఈ దాడులు ఇలానే హీట్ గా ఉంటాయి, ఎలక్షన్స్ అయిపోయాక అంతా సైలెంట్ అనే వారు లేకపోలేదు. 

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget