అన్వేషించండి

తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా పోటాపోటీ దర్యాప్తులు ఎవరి కోసం, ఎంత వరకు?

ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్ప ఈ విచారణలతో  సామాన్యులకి ఓరిగేది ఏమీ లేదంటున్నారు. 2G స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కాం, బోఫోర్స్‌ కేసులను గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆరోపణలు, విమర్శలు నిజమేనా? అన్న మాటలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు అధికార అటు కేంద్ర సంస్థలు జరుపుతున్న విచారణలే సమాధానాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలకు ఈడీ, సిట్‌, సీబీఐ, ఐటీ సంస్థల విచారణలో ప్రజలకు తెలియాల్సిందంతా తెలుస్తోందా? ఈ దాడులతో ఎవరికి లబ్ది చేకూరుతోంది? 

ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నువ్వానేనా అన్న రేంజ్‌లో యుద్ధం సాగుతోంది. ఇందులో ఈడీ, సిట్‌, సీబీఐ ప్రధాన అస్త్రాలుగా మారాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలకు ఈ సంస్థలు కేరాఫ్‌గా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 8ఏళ్ల పాలనలో కెసిఆర్‌ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలన్నీ ఆరోపణలు చేశాయి. అంతేకాదు బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య యుద్ధం రోడ్డు మీదకి చేరడంతో ఇప్పుడు ఆయా నేతల గుట్టు బయటపడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించిందో ఇక అప్పటి నుంచి ఈ నోటీసుల ప్రక్రియ స్పీడందుకుంది. గత కొన్నిరోజులుగా టీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేస్తూ ఈడీ, ఐటీ నోటీసులు పంపుతున్నారు. ఫెమా ఉల్లంఘన కేసులో ఎమ్యెల్యే కిషన్‌ రెడ్డి ఈడీ ఎదుట హాజరైతే మైనింగ్‌ కేసుకి సంబంధించి మంత్రి గంగుల ఆయన కుటుంబసభ్యులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. క్యాసినో కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ రమణ ఈడీ ముందు హాజరయ్యారు. మంత్రి తలసాని సోదరులకు, పీఏ, తలసాని కొడుక్కి కూడా ఈడీ నోటీసులు పంపింది. త్వరలోనే ఇంకొంతమందికి ఈడీ, ఐటీ నోటీసులు రానున్నట్లు స్వయంగా కేసీఆరే చెప్పారు. 

బీజేపీ ఆడుతున్న ఆటకు ప్రతిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా సీబీఐ రాకను అడ్డుకుంటూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ వెబ్‌ సైట్లలోనూ, రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద కూడా అవకాశం లేకుండా పకడ్బందీగా వ్యవరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో బీజేపీ నేతలను జైలుకి పంపించి సిట్‌తో దర్యాప్తు చేయిస్తోంది. ఈ కేసులో లింక్‌ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ రాష్ట్ర పెద్దలకు సిట్‌ నోటీసులు ఇచ్చినా వాళ్లు హాజరుకాకపోవడంతో ఏ క్షణానైనా అరెస్ట్‌ ఉండచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు చేసుకోవడమే కాకుండా ఆయా సంస్థలను కూడా రంగంలోకి దింపడంతో ఏఏ పార్టీ.. ఏఏ రాజకీయనాయకుడు... ఏఏ రూపంలో... ఏ విధంగా ఏ రూట్లో అవినీతికి పాల్పడ్డాడన్నది ఆధారాలతో సహా ప్రజలకు తెలిసే టైమ్‌ వచ్చేసిందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు తెర వెనక జరిగిన అవినీతంతా ఇప్పుడు ఆయా సంస్థల ఎంట్రీతో బయటపడుతుందని చెబుతున్నారు. 

దీన్ని రాజకీయకోణంలో ఆలోచించే వాళ్లు మాత్రం ఇదంతా ఓ నాటకమని కొట్టిపారేస్తున్నారు. రాజకీయకక్షసాధింపు చర్యల్లో భాగమే తప్ప ఏ రాజకీయనాయకుడి అవినీతి బయటపడదంటున్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్ప ఈ విచారణలతో సామాన్యులకి ఒరిగేది ఏమీ లేదంటున్నారు. 2G స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కాం, బోఫోర్స్‌ కేసు, రాఫెల్‌ యుద్ద విమానాలతోపాటు పలు స్కాంల్లో కోట్లు ఖర్చు పెట్టి చివరికి ఎవరి తప్పు లేదని ఆ కేసులను ముగించిన విషయాలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈడీ, ఐటీ, సిట్‌ కేసులు కూడా అంతేనని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు 2023 ఎలక్షన్స్ వరకు ఈ దాడులు ఇలానే హీట్ గా ఉంటాయి, ఎలక్షన్స్ అయిపోయాక అంతా సైలెంట్ అనే వారు లేకపోలేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Embed widget