అన్వేషించండి

Manne Krishank : పోలీసుల అదుపులో మన్నె క్రిషాంక్ - తప్పుడు కేసులు పెట్టారని బీఆర్ఎస్ ఆగ్రహం

BRS : ఓయూ హాస్టల్ మూసివేత పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana News :  బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నెక్రిషాంక్ ను   పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడకు తరలించారో తెలియకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ , ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఆయనను బషీర్ బాగ్‌లోని సైబర్ క్రైమ్ ఆఫీసుకు తరలించినట్లుగా తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొన్న తర్వాత క్రిషాంక్ హైదరాబాద్ వస్తున్న సమయంలో ఆయనను చౌటుప్పల్ వద్ద పోలీసులు ఆపారు. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకుని ఆయన కారులోనే నల్లగొండ వైపు తీసుకెళ్లారు.కానీ ఎంత సేపటికి నల్లగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. ఈ అంశంపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తర్వాత నల్లగొండ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. అక్కడకూ ఆయనను తరలించలేదు. 

ఈ క్రమంలో పోలీసు అదుపులో ఉన్న క్రిషాంక్ ఆచూకీ తెలియకపోవడంతో  బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులను ఆయన సంప్రదించారు. చివరికి మన్నె క్రిషాంక్ ను బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు తరలించినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు. 

 

మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా ఉన్నారు.  సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆయనపై ఆరు కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లను మూసివేయంపైనా ఫేక్ ట్వీట్  చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత కారణంగా హాస్టల్ విద్యార్ధులకు సెలవులు ప్రకటించారని ఆయన ఓ ట్వీట్ చేశారు. దాంతో  దుమారం రేగింది. వేసవి సెలవుల కారణంగా ఎప్పుడూ ఇచ్చే సెలవులే ఇచ్చామని ఓయూ తెలిపింది.                           

ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఓయూ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఓయూ పోలీసులు మన్నె క్రిశాంక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అంశంపై కేసీఆర్ కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. తప్పుడు లెటర్లతో.. గోబెల్స్ మళ్లీ పుట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో మన్నె క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు  చేయడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగడానికి కారణం అయింది.                            

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget