అన్వేషించండి

Delhi Liquor case : మరోసారి ఎమ్మెల్సీ కవితకు షాక్, జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

Excise policy case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. మరో రెండు వారాలు జ్యుడిషియల్ రిమాండ్ పొడగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. రాస్ అవెన్యూ కోర్టులో ఆమె జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు కూడా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడగించింది.  తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది. గడువు ముగియడంతో ఈ ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టుకు హాజరుపరిచారు. మరోవైపు ఈడీ కేసు ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చింది. ఈడీ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 13 వరకు పొడిగించింది. కోర్టు నిర్ణయంపై బీఆర్ఎస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో నేటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. దీంతో అధికారులు వర్చువల్‌గా ఆమెను కోర్టులో హాజరు పర్చారు. కేసు విచారణ కీలక దశలో ఉందని... ఈ సమయంలో కవిత కస్టడీని పొడగించాలని ఈడీ తరుఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు మరో రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
 
 ఇది ఇలా ఉంటే..  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది.  సోమవారం కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై తన తుది ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తదితరులపైనా సీబీఐ గతంలో ప్రధాన చార్జిషీట్, నాలుగు అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. సోమవారం దాఖలు చేసిన ఛార్జిషీట్ ఈ కేసులో చివరి ఛార్జిషీట్ అని ఏజెన్సీ తెలిపింది. 2021 మార్చి 16న ఢిల్లీ సెక్రటేరియట్‌లోని కేజ్రీవాల్‌ని ఆయన ఆఫీసులో టీడీపీ ఎంపీ, మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసలు రెడ్డి కలిశారని, ఢిల్లీలో మద్యం వ్యాపారంలో తనవంతు సహకారం అందించాల్సిందిగా అభ్యర్థించారని కవితపై ఛార్జిషీట్‌లో ఏజెన్సీ పేర్కొంది. ఆ సమయంలో చేసిన ఎక్సైజ్ పాలసీ 2021-22లో మార్పులు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై తన బృందంతో కలిసి పనిచేస్తున్నందున కవితను సంప్రదించాల్సిందిగా కేజ్రీవాల్.. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కోరినట్లు సీబీఐ ఆరోపించింది.

ప్రతిగా, కేజ్రీవాల్ తన రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి నిధులు ఇవ్వాలని శ్రీనివాసులు రెడ్డిని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. 2021-22 ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసేందుకు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, దినేష్ అరోరా ద్వారా దక్షిణ భారతదేశంలో మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న కొందరు సుమారు రూ.90-100 కోట్ల లంచం తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నాయకులు.. ఇతర ప్రభుత్వోద్యోగులకు ఇది ముందుగానే ముట్టజెప్పారు.  నిబంధనలను ఉల్లంఘించి, పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా, మద్యం తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు అనే ముగ్గురు వాటాదారుల మధ్య ఒక కార్టెల్ ఏర్పడిందని సీబీఐ ఆరోపించింది.  అక్రమ లక్ష్యాలను సాధించడంలో కుట్రదారులందరూ క్రియాశీల పాత్ర పోషించారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ ఉద్యోగులు, కుట్రలో పాలుపంచుకున్న ఇతర నిందితులకు అనవసరమైన మేరకు లాభం చేకూరిందని సీబీఐ ఆరోపించింది.

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget