అన్వేషించండి

Delhi Liquor case : మరోసారి ఎమ్మెల్సీ కవితకు షాక్, జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

Excise policy case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. మరో రెండు వారాలు జ్యుడిషియల్ రిమాండ్ పొడగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. రాస్ అవెన్యూ కోర్టులో ఆమె జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు కూడా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడగించింది.  తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది. గడువు ముగియడంతో ఈ ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టుకు హాజరుపరిచారు. మరోవైపు ఈడీ కేసు ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చింది. ఈడీ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 13 వరకు పొడిగించింది. కోర్టు నిర్ణయంపై బీఆర్ఎస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో నేటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. దీంతో అధికారులు వర్చువల్‌గా ఆమెను కోర్టులో హాజరు పర్చారు. కేసు విచారణ కీలక దశలో ఉందని... ఈ సమయంలో కవిత కస్టడీని పొడగించాలని ఈడీ తరుఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు మరో రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
 
 ఇది ఇలా ఉంటే..  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది.  సోమవారం కేజ్రీవాల్‌తో పాటు ఇతరులపై తన తుది ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తదితరులపైనా సీబీఐ గతంలో ప్రధాన చార్జిషీట్, నాలుగు అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. సోమవారం దాఖలు చేసిన ఛార్జిషీట్ ఈ కేసులో చివరి ఛార్జిషీట్ అని ఏజెన్సీ తెలిపింది. 2021 మార్చి 16న ఢిల్లీ సెక్రటేరియట్‌లోని కేజ్రీవాల్‌ని ఆయన ఆఫీసులో టీడీపీ ఎంపీ, మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసలు రెడ్డి కలిశారని, ఢిల్లీలో మద్యం వ్యాపారంలో తనవంతు సహకారం అందించాల్సిందిగా అభ్యర్థించారని కవితపై ఛార్జిషీట్‌లో ఏజెన్సీ పేర్కొంది. ఆ సమయంలో చేసిన ఎక్సైజ్ పాలసీ 2021-22లో మార్పులు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై తన బృందంతో కలిసి పనిచేస్తున్నందున కవితను సంప్రదించాల్సిందిగా కేజ్రీవాల్.. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కోరినట్లు సీబీఐ ఆరోపించింది.

ప్రతిగా, కేజ్రీవాల్ తన రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి నిధులు ఇవ్వాలని శ్రీనివాసులు రెడ్డిని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. 2021-22 ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసేందుకు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, దినేష్ అరోరా ద్వారా దక్షిణ భారతదేశంలో మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న కొందరు సుమారు రూ.90-100 కోట్ల లంచం తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నాయకులు.. ఇతర ప్రభుత్వోద్యోగులకు ఇది ముందుగానే ముట్టజెప్పారు.  నిబంధనలను ఉల్లంఘించి, పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా, మద్యం తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు అనే ముగ్గురు వాటాదారుల మధ్య ఒక కార్టెల్ ఏర్పడిందని సీబీఐ ఆరోపించింది.  అక్రమ లక్ష్యాలను సాధించడంలో కుట్రదారులందరూ క్రియాశీల పాత్ర పోషించారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ ఉద్యోగులు, కుట్రలో పాలుపంచుకున్న ఇతర నిందితులకు అనవసరమైన మేరకు లాభం చేకూరిందని సీబీఐ ఆరోపించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aspiring acto tragedy: సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు - సినీ ఆఫీసులోనే కన్నుమూసిన ఔత్సాహిక నటుడు
సినిమా అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు - సినీ ఆఫీసులోనే కన్నుమూసిన ఔత్సాహిక నటుడు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Embed widget