అన్వేషించండి

Mynampalli : టిక్కెట్ ఇచ్చినా సరే మైనంపల్లి జంప్ - కాంగ్రెస్‌లో డీల్ సెట్ చేసుకున్నారా ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. హరీష్ రావుపై సిద్దిపేటలో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

Mynampalli :    బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.   మల్కాజిగిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కొడుకు రోహిత్ రావుకు టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మైనంపల్లికి మల్కాజిగిరి నుంచి కేసీఆర్ టిక్కెట్ ఖరారు చేశారు. కానీ.. ఆయన కుమారుడు రోహిత్ రావుకు మాత్రం మెదక్ టిక్కెట్ ఇవ్వలేదు.  దీంతో  దీంతో మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన హన్మంత్ రావు .. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటీ చేసి హరీష్ ను ఓడిస్తానని చాలెంజ్ చేశారు.  శ్రీవారి దర్శనం కోసం తిరుమలకువచ్చిన ఆయన  అక్కడే మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.                       

ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో  మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుకున్నారని..  అందుకే హరీష్ రావును టార్గెట్ చేశారన్న అభిప్రాయం బీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యల్లో..  కేసీఆర్ కుటుంబంపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.   హరీష్ రావును టార్గెట్ చేస్తూ కేసీఆర్ కుటుంబం పై వ్యాఖ్యలు చేశారు.  తాను హీరోగా ఉన్నప్పుడు నువ్వు జీరో వని... రబ్బర్ చెప్పులతో వచ్చిన నీకు లక్ష కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.  మీ కుటుంబంలో అందరికీ టికెట్లు ఇచ్చారుగా..  నాకు, నా కొడుకు ఇస్తే తప్పేంటి అని మైనంపల్లి ప్రశ్నించారు.  సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ రావు ని ఓడిస్తా.. ఆయన అంతు చూస్తా.. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పై శపథం చేశారు మైనంపల్లి.                        

మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లాకు చెందిన వారు . తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నప్పుడు మెదక్ ఎమ్మెల్యేగా పని చేశారు. తర్వాత మల్కాజిగిరికి మారారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి అవకాశం లభించకపోవడంతో  బీఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరి ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. భారీగాసేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉండే హన్మంతరావు కుమరుడు కూడా ఇటీవలి కాలంలో మెదక్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన కుమారుడికి మెదక్ నుంచే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు. ఈ కారణంగా రోహిత్ రావుకు టిక్కెట్  నిరాకరించారు.                                                                  

అయితే ఏ పార్టీలో ఉన్నా గెలిచి తీరుతారమన్న  నమ్మకంతో ఉన్న మైనంపల్లి.. ఇద్దరికీ  టిక్కెట్ ఇవ్వకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే... తీవ్ర వ్యాఖ్యలుచేసినట్లుగా తెలుస్తోంది.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget