అన్వేషించండి

Telangana News: తెలంగాణలో కొత్త బీర్లపై రాజకీయం- అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు

New Brand Beer Telangana: మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

BRS Leader Manne Krishank vs Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తీసుకురాబోతున్న కొత్త మద్యం పాలసీ (New Liquor Policy)పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక పత్రికపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని జూపల్లి అన్నారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్‌ల మద్యంకు అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి చెప్పారు. కానీ సోం డిస్టిలరీస్ కంపెనీ తెలంగాణలో కొత్త బీర్లు తీసుకువస్తోంది. దీనిని బట్టి మంత్రి జూపల్లి చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది’ అని విమర్శించారు.

అక్రమ మద్యానికి తలుపులు తెరుస్తారా?
‘సోమ్ డిస్టిల‌రీస్‌లో కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని కేసు నడిచింది. 2013-14లో మరో రూ.25 లక్షలు, 2019లో సోమ్ డిస్టిల‌రీస్ కాంగ్రెస్ పార్టీకి రూ.1.31 కోట్లు విరాళాలు ఇచ్చింది. సోమ్ డిస్టిల‌రీస్ కార్యక్రమానికి దిగ్విజయ్ సింగ్ వెళ్లి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచారు. మధ్యప్రదేశ్‌లో సోమ్ డిస్టిల‌రీస్ సంస్థను సీజ్ చేశారు. పలుసార్లు ఆ డిస్టిల‌రీస్‌పై అధికారులు దాడులు జరిగాయి. కానీ సాక్షాత్తు ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు చెప్తున్నారు’ అని మన్నె మండిపడ్డారు

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
‘సోమ్ డిస్టిల‌రీస్ తెలంగాణకు వస్తున్న విషయం జూపల్లికి తెలుసా? తెలియదా? తెలంగాణలో బీర్లు అమ్మడానికి సోమ్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు? గతంలో సోమ్ డిస్టిల‌రీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని మన్నె క్రిషాంక్ ధ్వజమెత్తారు.

తెలంగాణలోకి కొత్త బీర్లు ఎంట్రీ!
తెలంగాణలోకి కొత్త బీర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొత్త బ్రాండ్ బీర్లు ఇవేనంటూ ఫొటో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. తెలంగాణలో త‌మ బ్రాండ్ బీర్ సరఫరా చేసుకునేందుకు సోమ్ డిస్టిల‌రీస్ అనుమతి పొందినట్లు ప్రచారం సాగుతోంది. ప‌వ‌ర్ 1000, హంట‌ర్, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పీక‌ర్ వంటి పేర్లతో కొత్త బీర్లు షాపుల్లోకి అందుబాటులోకి రానున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైన్ షాపుల్లో కింగ్ ఫిషర్, ఆర్‌సీ, 5000 వంటి బీర్లు అందుబాటులో ఉన్నాయి. 

ఖండించిన జూపల్లి
తెలంగాణలో కొత్త బీర్లు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, వాటిని తాను పరిశీలించలేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని, పెండింగ్ బిల్లులు ఉన్న కంపెనీలు ఎక్కవగా బీరు సరఫరా చేయలేకపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా మద్యం కృత్రిమ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. 

ప్రతిపక్షాల విమర్శలు
తెలంగాణలో రూ. 5000 కోట్ల లిక్కర్ స్కాం జ‌రిగిన‌ట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర జ‌రుగుతోందని ఆరోపిస్తున్నాయి. కమీషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచే అవ‌కాశం ఉంద‌ని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్లు వ‌చ్చే అవ‌కాశ ఉంద‌ని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తు్న్నారు. రాష్ట్రంలో మద్యం కొర‌త సృష్టించి కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీర్ బ్రాండ్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget