అన్వేషించండి

KCR Kaleshwaram Irregularities: కాళేశ్వరం అక్రమాలకు బాధ్యుడు కేసీఆర్! బ్యారేజీల నిర్మాణం వ్యక్తిగతమే.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం ప్రభుత్వ నిర్ణయం కాదని, మాజీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Kaleshwaram Lift Irrigation Scheme project | హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అందుకు మాజీ సీఎం కేసీఆర్ జవాబుదారు అని ప్రాజెక్టు మీద నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లను విచారించిన ఘోష్ కమిషన్ దాదాపు 700 పేజీల నివేదికను కొన్ని రోజులకిందట ప్రభుత్వానికి సమర్పించింది. ఈ  నివేదికను అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్, నిర్వహణ, ఆపరేషన్ సహా అందులో జరిగిన అవకతవకలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా జవాబుదారీ అని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో వెల్లడైనట్లు ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయాలు కాదు.. వ్యక్తిగత నిర్ణయాల వల్లే లోపాలు

ఉన్నత స్థాయి వర్గాల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని క్యాబినెట్ ఆమోదం లేకుండా చేపట్టారని నివేదికలో ఉంది. అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లు సైతం దీనికి బాధ్యులు అని కాళేశ్వరం కమిషన్ నివేదించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించినందుకు, వారికి తప్పుడు నివేదనలు ఇచ్చినందుకు ఆరుగురు నీటిపారుదల ఇంజనీర్లపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా తమ నివేదికలో కమిషన్ సిఫార్సు చేసింది. ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్  మురళీధర్ రావు, కేంద్ర జల కమిషన్‌కు వాస్తవాలకు బదులుగా, అసత్యాలను తెలిపారని కమిషన్ నివేదిక పేర్కొన్నట్లు అధికారుల కమిటీ తెలిపింది.

కేబినెట్ భేటీలో కమిషన్ నివేదికపై కీలక చర్చ..
నేటి (ఆగస్టు 4న) మధ్యాహ్నం నిర్వహించే తెలంగాణ కేబినెట్ భేటీలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికపై సమగ్రంగా చర్చ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందు ఉంచేందుకు ప్రభుత్వం ఇదివరకే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులో రాజకీయ ప్రభావం, వ్యక్తిగత నిర్ణయాలు ప్రభావం చూపడంతో అనేక లోపాలు జరిగాయని కమిటీ పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం నాడు కమిటీలోని అధికారులు, తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, జీఏడీ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతితో ప్రత్యేకంగా భేటీ అయ్యి పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికలోని అంశాలపై చర్చించారు.

మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు అదే కారణం..
అటు రాజకీయంగా వ్యక్తిగత నిర్ణయాలు, ఇటు నిర్మాణ సంస్థతో ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కు కావడంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జాధనం దుర్వినియోగమైందని కమిషన్ పేర్కొనట్లు సమాచారం. బ్యారేజీలను నీటి నిల్వ వ్యవస్థలుగా కాకుండా తక్కువ హెడ్ డైవర్షన్ నిర్మాణాలుగా రూపొందించారు, కానీ పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్టింగ్ కోసం బ్యారేజీలలో నీటిని పూర్తి సామర్థ్యం వరకు నిరంతరం నింపాలని కేసీఆర్ ఆదేశించారని విచారణ కమిషన్ గుర్తించింది. అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని అభిప్రాయపడింది. 

పెరిగిన ఖర్చు.. ప్రజా ధనం వృథా..
అప్పటి కేబినెట్ అనుమతి లేకున్నా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చేశారు. అంచనాల సవరింపులో అవకతవకలు, నిపుణుల కమిటీ నివేదికను పక్కనపెట్టడం, డిజైన్లలో లోపాలు, నాణ్యతా పరమైన తనిఖీలు లేకపోవడం లాంటి అనేక అంశాలను కమిషన్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిధులు విడుదల చేయడాన్ని కమిషన్ తప్పుపట్టింది.  

అప్పటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ప్రాజెక్టును పర్యవేక్షించిన సీఎంవో కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సభర్వాల్‌తో పాటు మాజీ ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్‌రెడ్డి, మాజీ సీఈలు బసవరాజు, చంద్రశేఖర్.. ఈఎన్సీలు టి.శ్రీనివాస్, హరిరాం, సీఈలు సుధాకర్‌రెడ్డి, ప్రమీల తదితరుల పాత్ర గురించి కాళేశ్వరం కమిషన్ తమ నివేదికలో ప్రస్తావించింది. డీపీఆర్‌ తయారీకి కన్సల్టెన్సీ కింద వాప్కోస్‌ సంస్థకు ఇచ్చిన రూ.6.77 కోట్లను తిరిగి వసూలు చేయాలని సైతం పీసీ ఘోష్ కమిషన్‌ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై నేటి సాయంత్రం అధికారిక ప్రకటనగానీ, చర్యలకు ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget