అన్వేషించండి

KCR Kaleshwaram Irregularities: కాళేశ్వరం అక్రమాలకు బాధ్యుడు కేసీఆర్! బ్యారేజీల నిర్మాణం వ్యక్తిగతమే.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం ప్రభుత్వ నిర్ణయం కాదని, మాజీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Kaleshwaram Lift Irrigation Scheme project | హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అందుకు మాజీ సీఎం కేసీఆర్ జవాబుదారు అని ప్రాజెక్టు మీద నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లను విచారించిన ఘోష్ కమిషన్ దాదాపు 700 పేజీల నివేదికను కొన్ని రోజులకిందట ప్రభుత్వానికి సమర్పించింది. ఈ  నివేదికను అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్, నిర్వహణ, ఆపరేషన్ సహా అందులో జరిగిన అవకతవకలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా జవాబుదారీ అని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో వెల్లడైనట్లు ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయాలు కాదు.. వ్యక్తిగత నిర్ణయాల వల్లే లోపాలు

ఉన్నత స్థాయి వర్గాల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని క్యాబినెట్ ఆమోదం లేకుండా చేపట్టారని నివేదికలో ఉంది. అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లు సైతం దీనికి బాధ్యులు అని కాళేశ్వరం కమిషన్ నివేదించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించినందుకు, వారికి తప్పుడు నివేదనలు ఇచ్చినందుకు ఆరుగురు నీటిపారుదల ఇంజనీర్లపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా తమ నివేదికలో కమిషన్ సిఫార్సు చేసింది. ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్  మురళీధర్ రావు, కేంద్ర జల కమిషన్‌కు వాస్తవాలకు బదులుగా, అసత్యాలను తెలిపారని కమిషన్ నివేదిక పేర్కొన్నట్లు అధికారుల కమిటీ తెలిపింది.

కేబినెట్ భేటీలో కమిషన్ నివేదికపై కీలక చర్చ..
నేటి (ఆగస్టు 4న) మధ్యాహ్నం నిర్వహించే తెలంగాణ కేబినెట్ భేటీలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికపై సమగ్రంగా చర్చ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందు ఉంచేందుకు ప్రభుత్వం ఇదివరకే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులో రాజకీయ ప్రభావం, వ్యక్తిగత నిర్ణయాలు ప్రభావం చూపడంతో అనేక లోపాలు జరిగాయని కమిటీ పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం నాడు కమిటీలోని అధికారులు, తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, జీఏడీ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతితో ప్రత్యేకంగా భేటీ అయ్యి పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికలోని అంశాలపై చర్చించారు.

మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు అదే కారణం..
అటు రాజకీయంగా వ్యక్తిగత నిర్ణయాలు, ఇటు నిర్మాణ సంస్థతో ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కు కావడంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జాధనం దుర్వినియోగమైందని కమిషన్ పేర్కొనట్లు సమాచారం. బ్యారేజీలను నీటి నిల్వ వ్యవస్థలుగా కాకుండా తక్కువ హెడ్ డైవర్షన్ నిర్మాణాలుగా రూపొందించారు, కానీ పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్టింగ్ కోసం బ్యారేజీలలో నీటిని పూర్తి సామర్థ్యం వరకు నిరంతరం నింపాలని కేసీఆర్ ఆదేశించారని విచారణ కమిషన్ గుర్తించింది. అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని అభిప్రాయపడింది. 

పెరిగిన ఖర్చు.. ప్రజా ధనం వృథా..
అప్పటి కేబినెట్ అనుమతి లేకున్నా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చేశారు. అంచనాల సవరింపులో అవకతవకలు, నిపుణుల కమిటీ నివేదికను పక్కనపెట్టడం, డిజైన్లలో లోపాలు, నాణ్యతా పరమైన తనిఖీలు లేకపోవడం లాంటి అనేక అంశాలను కమిషన్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిధులు విడుదల చేయడాన్ని కమిషన్ తప్పుపట్టింది.  

అప్పటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ప్రాజెక్టును పర్యవేక్షించిన సీఎంవో కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సభర్వాల్‌తో పాటు మాజీ ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్‌రెడ్డి, మాజీ సీఈలు బసవరాజు, చంద్రశేఖర్.. ఈఎన్సీలు టి.శ్రీనివాస్, హరిరాం, సీఈలు సుధాకర్‌రెడ్డి, ప్రమీల తదితరుల పాత్ర గురించి కాళేశ్వరం కమిషన్ తమ నివేదికలో ప్రస్తావించింది. డీపీఆర్‌ తయారీకి కన్సల్టెన్సీ కింద వాప్కోస్‌ సంస్థకు ఇచ్చిన రూ.6.77 కోట్లను తిరిగి వసూలు చేయాలని సైతం పీసీ ఘోష్ కమిషన్‌ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై నేటి సాయంత్రం అధికారిక ప్రకటనగానీ, చర్యలకు ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
Embed widget