అన్వేషించండి

KCR Kaleshwaram Irregularities: కాళేశ్వరం అక్రమాలకు బాధ్యుడు కేసీఆర్! బ్యారేజీల నిర్మాణం వ్యక్తిగతమే.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం ప్రభుత్వ నిర్ణయం కాదని, మాజీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Kaleshwaram Lift Irrigation Scheme project | హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అందుకు మాజీ సీఎం కేసీఆర్ జవాబుదారు అని ప్రాజెక్టు మీద నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లను విచారించిన ఘోష్ కమిషన్ దాదాపు 700 పేజీల నివేదికను కొన్ని రోజులకిందట ప్రభుత్వానికి సమర్పించింది. ఈ  నివేదికను అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్, నిర్వహణ, ఆపరేషన్ సహా అందులో జరిగిన అవకతవకలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా జవాబుదారీ అని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో వెల్లడైనట్లు ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయాలు కాదు.. వ్యక్తిగత నిర్ణయాల వల్లే లోపాలు

ఉన్నత స్థాయి వర్గాల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని క్యాబినెట్ ఆమోదం లేకుండా చేపట్టారని నివేదికలో ఉంది. అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లు సైతం దీనికి బాధ్యులు అని కాళేశ్వరం కమిషన్ నివేదించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించినందుకు, వారికి తప్పుడు నివేదనలు ఇచ్చినందుకు ఆరుగురు నీటిపారుదల ఇంజనీర్లపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా తమ నివేదికలో కమిషన్ సిఫార్సు చేసింది. ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్  మురళీధర్ రావు, కేంద్ర జల కమిషన్‌కు వాస్తవాలకు బదులుగా, అసత్యాలను తెలిపారని కమిషన్ నివేదిక పేర్కొన్నట్లు అధికారుల కమిటీ తెలిపింది.

కేబినెట్ భేటీలో కమిషన్ నివేదికపై కీలక చర్చ..
నేటి (ఆగస్టు 4న) మధ్యాహ్నం నిర్వహించే తెలంగాణ కేబినెట్ భేటీలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికపై సమగ్రంగా చర్చ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందు ఉంచేందుకు ప్రభుత్వం ఇదివరకే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులో రాజకీయ ప్రభావం, వ్యక్తిగత నిర్ణయాలు ప్రభావం చూపడంతో అనేక లోపాలు జరిగాయని కమిటీ పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం నాడు కమిటీలోని అధికారులు, తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, జీఏడీ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతితో ప్రత్యేకంగా భేటీ అయ్యి పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికలోని అంశాలపై చర్చించారు.

మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు అదే కారణం..
అటు రాజకీయంగా వ్యక్తిగత నిర్ణయాలు, ఇటు నిర్మాణ సంస్థతో ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కు కావడంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జాధనం దుర్వినియోగమైందని కమిషన్ పేర్కొనట్లు సమాచారం. బ్యారేజీలను నీటి నిల్వ వ్యవస్థలుగా కాకుండా తక్కువ హెడ్ డైవర్షన్ నిర్మాణాలుగా రూపొందించారు, కానీ పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్టింగ్ కోసం బ్యారేజీలలో నీటిని పూర్తి సామర్థ్యం వరకు నిరంతరం నింపాలని కేసీఆర్ ఆదేశించారని విచారణ కమిషన్ గుర్తించింది. అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని అభిప్రాయపడింది. 

పెరిగిన ఖర్చు.. ప్రజా ధనం వృథా..
అప్పటి కేబినెట్ అనుమతి లేకున్నా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చేశారు. అంచనాల సవరింపులో అవకతవకలు, నిపుణుల కమిటీ నివేదికను పక్కనపెట్టడం, డిజైన్లలో లోపాలు, నాణ్యతా పరమైన తనిఖీలు లేకపోవడం లాంటి అనేక అంశాలను కమిషన్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిధులు విడుదల చేయడాన్ని కమిషన్ తప్పుపట్టింది.  

అప్పటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ప్రాజెక్టును పర్యవేక్షించిన సీఎంవో కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సభర్వాల్‌తో పాటు మాజీ ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్‌రెడ్డి, మాజీ సీఈలు బసవరాజు, చంద్రశేఖర్.. ఈఎన్సీలు టి.శ్రీనివాస్, హరిరాం, సీఈలు సుధాకర్‌రెడ్డి, ప్రమీల తదితరుల పాత్ర గురించి కాళేశ్వరం కమిషన్ తమ నివేదికలో ప్రస్తావించింది. డీపీఆర్‌ తయారీకి కన్సల్టెన్సీ కింద వాప్కోస్‌ సంస్థకు ఇచ్చిన రూ.6.77 కోట్లను తిరిగి వసూలు చేయాలని సైతం పీసీ ఘోష్ కమిషన్‌ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై నేటి సాయంత్రం అధికారిక ప్రకటనగానీ, చర్యలకు ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Why Mouth Taste Bitter During Fever: జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Embed widget