అన్వేషించండి

Breaking News: భారత్ లో నాలుగో ఒమిక్రాన్ కేసు... ముంబయి వచ్చిన యువకుడికి పాజిటివ్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
Breaking News: AP Telangana News Live Updates on 4 December 2021 Breaking News: భారత్ లో నాలుగో ఒమిక్రాన్ కేసు... ముంబయి వచ్చిన యువకుడికి పాజిటివ్
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను... ఉత్తర,వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు దూసుకొస్తోంది. విశాఖకు 250కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 360కిలోమీటర్లు, పూరీకి 430కిలోమీటర్లు, పారాదీప్‌నకు 510కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

జవాద్ తుపాను రేపు తీరం దాటే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను... ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి రానుంది. ఐదో తేదీన ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే ఛాన్స్ ఉంది. సాయంత్రానికి పూర్తిగా బలహీనపడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలా బలహీనపడిన తుపాను పశ్చిమ బంగా వైపు వెళ్లిపోనుంది. శనివారం తుపాను ప్రభావంతో చాలా ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.  తక్కువ ప్రాంతాల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఒడిశా దక్షిణ కోస్తా , ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం శనివారం ఏర్పడనుంది. ఉదయం 10.59 నిమిషాలకు మొదలైన గ్రహణం మధ్యాహ్నం 12.30కు సంపూర్ణమవుతుంది. మధ్యాహ్నం 1.33 నిమిషాలకు సంపూర్ణ గ్రహణం ముగుస్తుంది. అప్పట్నించి గ్రహణం వీడడం మొదలై మధ్యాహ్నం 3.07 నిమిషాలకు పూర్తిగా విడుస్తుంది. అంటే మొత్తం నాలుగ్గంటలకు పైగానే గ్రహణ సమయం వస్తోంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కావడంతో పలు దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. 

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో దీక్ష నిర్వహించనున్నారు. దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) గాంధీభవన్‌లో శనివారం భేటీ కానుంది. తెలంగాణలో 9 నుంచి క్షేత్రస్థాయిలో డిజిటల్‌ సభ్యత నమోదు కార్యక్రమాలను చేపట్టనున్నారు. అయితే క్షేత్రస్థాయి డిజిటల్‌ సభ్యత్వ నమోదులో కీలకమైన ఎన్‌రోలర్ల నియామకం ఇంకా పూర్తి కాలేదు. ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షతో పాటు రైతుల సమస్యలు, డిజిటల్‌ సభ్యత నమోదు అంశాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. 

పసిడి ప్రియులకు శుభవార్త. భారత మార్కెట్లో బంగారం ధర వరుసగా నాలుగోరోజు స్వల్పంగా దిగొచ్చింది. తాజాగా 22 క్యారెట్లపై రూ.150 మేర తగ్గడంతో 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,450 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత)పై రూ. 160 మేర తగ్గడంతో ధర రూ.48,490 కి పతనమైంది. ఇక వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో మూడు రోజుల తరువాత తగ్గింది. రూ.300 మేర పుంజుకోవడంతో తాజాగా కిలో రూ.65,300కి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు ఉంటున్నాయి. 

ఇక విజయవాడలోనూ పసిడి ధర స్వల్పంగాపెరిగి. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారంపై రూ.150 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర నేడు రూ.44,450 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,490గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉంది.

ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ధరలు తగ్గించడంతో నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నేడు ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.107.69... డీజిల్ ధర రూ.94.14 గా విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరుకు రూ.0.20 పైసలు తగ్గడంతో ప్రస్తుతం రూ.110.71 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.19 పైసలు తగ్గడంతో రూ.96.77గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర భారీగా పెరిగింది. 0.94 పైసలు పెరగడంతో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.99గా ఉంది.   డీజిల్ ధర 87 పైసల మేర పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.96.05కి చేరింది. 

19:52 PM (IST)  •  04 Dec 2021

భారత్ లో నాలుగో ఒమిక్రాన్ కేసు... ముంబయి వచ్చిన యువకుడికి పాజిటివ్

భారత్‌లో నాలుగో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇదివరకే కర్ణాటకలో ఇద్దరికి,  గుజరాత్ లో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించారు. తాజాగా మహారాష్ట్రలో మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. ముంబయికి వచ్చిన 33 ఏళ్ల యువకుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆపై జరిపిన టెస్టుల్లో ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4కు చేరుకుంది.

19:48 PM (IST)  •  04 Dec 2021

భారత్‌లో మరో వ్యక్తికి ఒమిక్రాన్.. జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తికి పాజిటివ్

భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇదివరకే కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ రాగా.. ఆపై జరిపిన టెస్టుల్లో ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3కు చేరుకుంది.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
Revanth Reddy: ఫుడ్ కల్తీపై రేవంత్ సీరియస్- ఈగల్‌, హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు రెడీ! కేసీఆర్‌ను హౌస్ అరెస్టు చేశారని విమర్శ!
ఫుడ్ కల్తీపై రేవంత్ సీరియస్- ఈగల్‌, హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు రెడీ! కేసీఆర్‌ను హౌస్ అరెస్టు చేశారని విమర్శ!
Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
US Iran War: అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
Embed widget