అన్వేషించండి

Eatala Rajender: ఉద్యమకారుల రక్తం కళ్ల చూసిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటా.. ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు

నేటి ఉదయం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన  మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోమ ద్రోహులను పదవులు వరిస్తున్నాయని, సీఎం కేసీఆర్ ధనాన్ని నమ్ముకున్నారని ఈటల ఆరోపించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమ సహచరులు కనుమరుగవుతున్నారని, ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రాజకీయ పార్టీలు ప్రజలను నమ్ముకుంటాయి కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం డబ్బులను నమ్ముకున్నారని ఈటల ఆరోపించారు. గతంలో మానుకోటలో ఓదార్పు కార్యక్రమం చేపట్టగా ఉద్యమకారులపై రాళ్లతో దాడిచేశారంటూ మండిపడ్డారు. రాళ్లతో దాడి చేసి ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసిన పాడి కౌశిక్ రెడ్డి‌కి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉద్యమ కారులను అవమానించారని వ్యాఖ్యానించారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర (Huzurabad Padyatra) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం జ్వరం, బీపీ లెవెల్స్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించి అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనారోగ్యం నుంచి కోలుకుని నేటి ఉదయం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన  మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియా (Eatala Rajender Pressmeet)తో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ప్రజలను నమ్ముకుని ముందుకు సాగాలని కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం నగదును నమ్ముకుని పావులు కదుపుతున్నారని ఈటల అన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్‌లో కొనుగోళ్ల పర్వానికి సీఎం కేసీఆర్ తెరలేపారని ఆరోపించారు. ఇప్పటికే రూ.150 కోట్లు నగదును హుజురాబాద్ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలకు ఇచ్చారని.. ఇలాంటి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు.

Also Read: Huzurabad Byelection : హడావుడిగా పథకాల అమలు ! ఏ క్షణమైనా హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ రాబోతోందా..? 

ఇప్పుడు మాత్రమే కాదని గత ఎన్నికల్లోనూ తనను ఓడించేందుకు భారీ కుట్ర జరిగిందని ఈటల ఆరోపించారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ నగదు వెదజల్లుతున్నారని, ఇలాంటి వ్యక్తులకు అధికారం అవసరమా అంటూ మండిపడ్డారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.150 కోట్లను నగదు ఖర్చు చేశారన్నారు. నియోజకవర్గంలోని నేతలకు ఖరీదు కొట్టి కొనుగోళ్లు, ప్రలోభ పర్వానికి తెరలేపారని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలు అనగానే హామీలు గుర్తొచ్చాయని, అందుకోసమే కొత్త కొత్త పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగభృతిని తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి ఆటల డిమాండ్ చేశారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. అనంతర కాలంలో సీఎం పదవి ఇవ్వకపోగా, ఉన్న డిప్యూటీ సీఎం పదవిని సైతం లాగేసుకున్నారని గుర్తుచేశారు. దళిత బంధు పేరుతో దళితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఈ పథకాన్ని తాను స్వాగతిస్తున్నునట్లు చెప్పారు. కానీ గత ఏడేళ్ల కాలంలో ఒక్కనాడు సైతం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు కేసీఆర్ దండ వేయలేదని గుర్తుచేశారు. త్వరలోనే తన పాదయాత్ర ‘ప్రజా దీవెన యాత్ర’ను తిరిగి కొనసాగిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget