అన్వేషించండి

Rahul Gandhi: టీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయిన పార్టీలు, ఎన్నికలప్పుడే డ్రామాలు: రాహుల్ గాంధీ

తెలంగాణలో ఐదో రోజు ఆదివారం (అక్టోబరు 30) పాదయాత్ర ముగిసింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర సాయంత్రం షాద్‌ నగర్‌లో ముగిసింది.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను ఎలాంటి దోషాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకే అప్పగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో ఐదో రోజు ఆదివారం (అక్టోబరు 30) పాదయాత్ర ముగిసింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర సాయంత్రం షాద్‌ నగర్‌లో ముగిసింది. షాద్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఎలాంటి హింస, ఇబ్బందులు లేకుండా భారత్ జోడో యాత్ర నడుస్తోందని, ఈ యాత్రను ఏ శక్తి ఆపలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎండ వచ్చినా, వాన కురిసినా, తుపాన్లు వచ్చినా సరే కశ్మీర్ వరకు యాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. 

టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకే కోవకు చెందినవని రెండూ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ చట్టాలతో పాటు పార్లమెంట్‌ లో బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, ఎన్నికలప్పుడు కలిసి డ్రామాలాడుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు తెలంగాణలో పాలన పట్ల తమ గోడు చెప్పుకుంటున్నారని.. బీజేపీ, టీఆర్ఎస్‌ లీడర్లు తెలంగాణ ప్రజల గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు.

మోదీ పాలన వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసరాలు వంటి అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటినా మోదీ దానిపై నోరు విప్పడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, సన్నకారు వ్యాపారులకు అనేక రకాలుగా మేలు చేస్తామని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాస్కి గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

53 రోజుల నుంచి కొనసాగుతున్న యాత్ర
కన్యాకుమారి నుంచి 53 రోజులుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. రైతులు, విద్యార్థులు, గిరిజనులు, చేనేత సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ విద్వేషం, టీఆర్ఎస్ దోపిడీపై విమర్శలు కురిపిస్తూ వెళ్తున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేటు పరం అవుతోందంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పెద్దాయిపల్లి వద్ద జోడో యాత్రకు భోజన విరామం ఉంది. అక్కడే యాత్రలో పాల్గొంటున్న వారంతా భోజనం చేయనున్నారు. అనంతరం సాయంత్రం షాద్ నగర్ సోలిపూర్ జంక్షన్ కు చెరుకోనున్నారు. అక్కడే రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. 

నేతలతో పరుగులు పెట్టించిన రాహుల్
భారత్ జోడో యాత్రలో ఆదివారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ కాసేపు ఉత్సాహంగా పరుగులు పెట్టారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ శ్రేణులను పరుగులు పెట్టించారు. ఫిట్‌నెస్ ఫర్ భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ కొద్దిసేపు పరుగు తీసి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్ ను అనుసరించి రన్నింగ్ చేశారు.

తెలంగాణలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న రాహుల్ పాదయాత్ర, ఆపై 12 రోజులపాటు జనజీవన స్రవంతితో ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget