News
News
X

Bandi Sanjay On Four IAS : ఆ నలుగురు కలెక్టర్లే అంతా చేస్తున్నారు - వారి సంగతి చూస్తానని బండి సంజయ్ వార్నింగ్ !

తెలంగాణలో నలుగురు కలెక్టర్లు కేసీఆర్ అక్రమాలకు సహకరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వారిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.

FOLLOW US: 
Share:

 

Bandi Sanjay On Four IAS :   తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నలుగురు కలెక్టర్లపై కోపం వచ్చింది. వారిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఓ నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో ఆ నలుగురు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. వారి వ్యవహారంపై ఆధారాలు సేకరించామని, త్వరలోనే  సదరు కలెక్టర్ల బండారం బయటపెడతామని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తున్న సదరు కలెక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బండి మండిపడ్డారు. ప్రగతి భవన్ లో అన్ని పనులు ఆ నలుగురే చక్కబెడుతున్నారని, అలాంటి వారి వల్ల రాష్ట్రానికి, కష్టపడి పనిచేస్తున్న ఐఏఎస్ లకు చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. 

బండి సంజయ్ ఫైర్ అయిన ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు ?          

ఆ నలుగురిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఇంతకీ ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు అన్న దానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితమైన కలెక్టర్ గా పేరు పొందిన వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఇంటిపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. దాదాపుగా ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఇప్పుడు పవర్ లో ఉన్న నలుగురు కలెక్టర్లపై బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. వారి గురించి స్పష్టమన సమాచారం ఉండే ఉంటుందని అందుకే ఇలాంటి హెచ్చరికలు చేసి ఉంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

ప్రతి ప్రభుత్వంలోనూ  కొంత మంది అధికారులు సన్నిహితంగా ఉంటారు !           

ప్రతి ప్రభుత్వంలోనూ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైన అధికారుల కోటరీ ఉంటుంది. వారు ప్రభుత్వ పెద్దల మనసెరిగి నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు అమలు చేస్తూ ఉంటారు. అలాంటి అధికారులు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉన్నారు. వారు  కీలక నిర్ణయాలు తీసుకుంటారని కూడా చెబుతూంటారు. నిజంగానే బండి సంజయ్ వద్ద ఆధారాలు ఉండి.. డీవోపీటీకి ఫిర్యాదు చేస్తే.. ఈ ఆధారాలను సహజంగానే బీజేపీ సీరియస్ గా తీసుకుంటుంది. ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ మధ్య పరిస్థితులు ఏ మాత్రం సానుకూలంగా లేవు. బీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టేలా ఏ చిన్న అవకాశం వచ్చినా బీజేపీ వినియోగించుకుటుంది. 

వారిని నియంత్రించడానికే బండి సంజయ్ ఆరోపణలా ?           

అయితే బండి సంజయ్ వద్ద నలుగురు కలెక్టర్లకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే..  వెంటనే డీవోపీటికి ఫిర్యాదు చేయకుండా.. త్వరలో అనే పదం ఎందుకు వాడదారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్ ఆరోపణల వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా పని చేస్తున్న అధికారులను నియంత్రించడానికి వారు యాక్టివ్ గా ఉండకుండా చేయడానికి ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తున్నారు.ఈ విషయంలో అధికారులకూ స్పష్టత ఉందని.. బండి సంజయ్ బెదిరింపులకు వారు భయపడబోరని అంటున్నారు. 

Published at : 08 Feb 2023 05:32 PM (IST) Tags: Bandi Sanjay Telangana News Bandi Sanjay is angry with the four collectors

సంబంధిత కథనాలు

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు-  మంత్రి కేటీఆర్

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

సీతమ్మవారి పెండ్లికి వెండి పీతాంబరం పంపిన సిరిసిల్ల నేతన్న

సీతమ్మవారి పెండ్లికి వెండి పీతాంబరం పంపిన సిరిసిల్ల నేతన్న

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

టాప్ స్టోరీస్

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు