అన్వేషించండి

Telangana: దేవుడి భూమల కబ్జాకు యత్నం - అడ్డుకున్న ఈవోపై దాడి - భద్రాచలంలో దారుణం

Bhadrachalam: భద్రాచలం ఆలయం భూముల్నికబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఆపేందుకు ప్రయత్నించిన ఈవోపై దాడి చేశారు

Bhadrachalam EO attacked by Land Mafia:    భద్రాచలం  సీతారామచంద్రస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  రమాదేవి పై  పురుషోత్తపట్నంలో  దాడి జరిగింది.  ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూములను ఆక్రమణ నుండి కాపాడేందుకు రమాదేవి ఆలయ సిబ్బందితో కలిసి వెళ్లిన సమయంలో జరిగింది. 

అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నం  గ్రామం ఉంది. ఈ గ్రామంలో  భద్రాచలం ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఉంది.  సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆలయ ఆస్తిగా గుర్తించారు. అయితే ఈ భూములను కొంత మంది ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన  ఆలయ ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి, పురుషోత్తపట్నం వెళ్లారు.  ఆలయ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించారు.  ఈ భూములు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నందున, ఆక్రమణదారులను తొలగించడంలో ఆలయ అధికారులు గతంలో కూడా  ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. 

ఈ క్రమంలో ఆలయ ఈవో స్వయంగా వెళ్లారు.   ఆలయ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానిక ఆక్రమణదారులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం తీవ్రమై, ఆక్రమణదారులు రమాదేవిపై   దాడికి పాల్పడ్డారు. దాడి కారణంగా రమాదేవి స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది , స్థానికులు ఆమెను వెంటనే  భద్రాచలం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు, అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో ఆమె కోలుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

ఈ ఘటనపై దేవాదాయ మంత్రి కొండా సురేఖ స్పందించారు. దేవుడి భూములు ర‌క్షించే ఈవోల‌పై దాడి  చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా... రూల్స్ విరుద్ధంగా ఎండోమెంట్ భూముల‌ను క‌బ్జా చేస్తే పీడీ యాక్టు పెడుతాం.... ఈ విష‌యంలో గ‌తంలోనూ తాము స్ప‌ష్టం చేశామని హెచ్చరించారు. భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఏపీ)లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవిపై దాడి చేయ‌డం స‌హేతుకం కాద‌ని.. ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం.... ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని... స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేయాల‌ని కోరారు.  

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉంది. పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు.       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Telangana Rajya Sabha Elections: రాజ్యసభ బరిలో గులాబీ వ్యూహం - మైనార్టీ అస్త్రంతో చెక్ - కాంగ్రెస్ సమాధానమేంటి?
రాజ్యసభ బరిలో గులాబీ వ్యూహం - మైనార్టీ అస్త్రంతో చెక్ - కాంగ్రెస్ సమాధానమేంటి?

వీడియోలు

India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Sanju Samson India vs Zimbabwe T20 World Cup | సంజూ శాంసన్ అదిరిపోయే కంబ్యాక్
South Africa vs West Indies T20 World Cup | వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
OPS Joins DMK: తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన ఓపీఎస్, అరుదైన నేతగా పన్నీర్ సెల్వం
తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన ఓపీఎస్, అరుదైన నేతగా పన్నీర్ సెల్వం
Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ETV Win Jathara 2026 : 'ఈటీవీ విన్' ఎంటర్టైన్మెంట్ జాతర - 14 బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్
'ఈటీవీ విన్' ఎంటర్టైన్మెంట్ జాతర - 14 బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్
కేవలం రూ.7.5 లక్షల నుంచే ఎలక్ట్రిక్‌ కార్లు - మీ ఊర్లో దర్జాగా తిరగడానికి చవకైన EVలు!
తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్‌ కారు కావాలా? తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకే దొరుకుతున్న 5 బెస్ట్ కార్లు
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. క్లీన్ చిట్ రాగానే మాజీ సీఎం కన్నీళ్లు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. క్లీన్ చిట్ రాగానే మాజీ సీఎం కన్నీళ్లు!
Kolkata Earthquake: కోల్‌కతాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5 గా నమోదు.. బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5 గా నమోదు.. బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు
Embed widget