అన్వేషించండి

Telangana: తెలంగాణలో ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతోంది: అసోం సీఏం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా అభివృద్ధికి నిధులు కేటాయించిందని, అయినా ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతూనే ఉందని అసోం సీఏం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.

నిర్మల్: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా అభివృద్ధికి నిధులు కేటాయించిందని, అయినా ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతూనే ఉందని అసోం సీఏం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అభివృద్ధి పరిచిన జాతీయ రహదారులపైనే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేపడుతున్నారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 
తెలంగాణలో బీజేపీ బలోపేతం..
విజయ సంకల్ప యాత్ర 5,500 కిలోమీటర్ల మేర సాగనుందని, మూడోసారి ముచ్చటగా మోదీనే ప్రధానమంత్రిగా చేసి, దేశం అభివృద్ధి పథంలో సాగాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతుందని హిమంత బిశ్వశర్మ తెలిపారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందని 2018 సంవత్సరంలో 6.8 శాతం ఓట్లు సంపాదించగా, 2023 లో 14.9 అయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వీళ్ల పాలన రజాకార్ల పాలనని, దీన్ని అంతం చేసే రోజులు వస్తున్నాయన్నారు. భారత ప్రజలు కాంగ్రెస్ ని తరిమి మోదీని తీసుకొచ్చారని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ రామ మందిరం కలను సాకారం చేసిందన్నారు. ప్రస్తుతం ప్రజలు మోడీని 3వ సారి ప్రధానిగా తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మోదీదేనని కొనియాడారు. 

Telangana: తెలంగాణలో ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతోంది: అసోం సీఏం సంచలన వ్యాఖ్యలు
గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతుందని, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే లేదని అన్నారు. ప్రధాని మోదీ మాత్రం పక్కాగా హామీలను నెరవేర్చి వ్యక్తి అని కొనియాడారు. అసోం రాష్ట్రంలో పెట్రోల్ 98 రూపాయలు కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై టాక్స్ వేసి 110 రూపాలకు ఇస్తూ ప్రజలపై భారాన్ని వేస్తున్నారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదని, ప్రపంచ దేశాలే తన వైపు తిరిగి చూస్తున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ అందించాలని, ఆదిలాబాద్ పార్లమెంట్ సీటుని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఈ బహిరంగ సభలో మణిపూర్ మంత్రి సుసింద్రీ, జాతీయ ఓబీసీ నాయకులు,రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాయల్ శంకర్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి, పదాధికారులు, యాత్ర ప్రముఖులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Embed widget