అన్వేషించండి

Telangana High Court: కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టులో హోరాహోరీ వాదనలు - కేసీఆర్‌కు ఊరట లభిస్తుందా?

Kaleshwaram report: కాళేశ్వరం రిపోర్టును రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు.

TG High Court Kaleshwaram report: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ,  మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి.  కమిషన్ ఏర్పాటు , దాని నివేదిక రూపొందింపు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని  కేసీఆర్ తరపు లాయర్ కోర్టులో వాదించారు.  కమిషన్‌కు విచారణ చేసే అర్హత లేదని, నివేదికలో తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చట్టపరంగా, సాంకేతిక ,  ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా జరిగిందని తెలిపారు. కానీ కమిషన్ ఈ అంశాలను పట్టించుకోలేదన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ఉద్దేశంతో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని వాదించారు. నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా రూపొందించారని..  నివేదికలో తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేయడం, తమకు సరైన నోటీసులు ఇవ్వకపోవడం , సాక్షులను ప్రశ్నించే అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని కేసీఆర్ తరపు లాయర్ వాదించారు 

అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగా 60 పేజీల సమగ్ర నివేదిక రూపొందించినట్లు కోర్టుకు తెలిపారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో నివేదిక వివరాలను ప్రకటించారని, ఈ నివేదికను త్వరలో అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. పిటిషనర్లు అియన  కేసీఆర్, హరీశ్ రావు అసెంబ్లీ సభ్యులుగా ఉన్నందున,   చర్చలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్ సమస్యలు ఉన్నాయని నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక స్పష్టం చేసిందని అందుకే కమిషన్ ఏర్పాటైందని ప్రభుత్వం తెలిపింది. కమిషన్ 16 నెలల పాటు విచారణ జరిపి, 116 మందిని ప్రశ్నించి, జులై 31, 2025న 665 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిని తెలిపారు. 

విచారణలో ఈ నివేదికపై చర్యలు తీసుకుంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని అడిగి చెబుతానని లాయర్ చెప్పారు. శుక్రవారం లేదా సోమవారం చెబుతానని చెప్పడంతో.. రేపటికి కల్లా చెప్పాలని తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. 

కాళేశ్వరం రిపోర్టులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు అప్పటి ఆర్థిక మంత్రిగా చేసిన ఈటల రాజేందర్ పై కూడా చర్యలు తీసుకోవాలని సిఫారసులు ఉన్నాయి. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిఫారసు  చేశారు. ఈ నివేదికను ప్రతి ఎమ్మెల్యేకు ఇస్తామని..  అసెంబ్లీతో పాటు మండలిలోనూ కూలంకుషంగా చర్చిద్దామని రేవంత్ ప్రకటించారు. ఈ చర్చకు కేసీఆర్ కూడా రావాలన్నారు.  చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలన్న సభే నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ చెబుతున్నారు.  ఇదే వాదనను హైకోర్టుకు ..  అడ్వకేట్ జనరల్ తెలిపే అవకాశం ఉంది.          

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
Pawan Kalyan Telangana Controversy 2026: పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!
పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget