అన్వేషించండి

Telangana High Court: కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టులో హోరాహోరీ వాదనలు - కేసీఆర్‌కు ఊరట లభిస్తుందా?

Kaleshwaram report: కాళేశ్వరం రిపోర్టును రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు.

TG High Court Kaleshwaram report: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ,  మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి.  కమిషన్ ఏర్పాటు , దాని నివేదిక రూపొందింపు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని  కేసీఆర్ తరపు లాయర్ కోర్టులో వాదించారు.  కమిషన్‌కు విచారణ చేసే అర్హత లేదని, నివేదికలో తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చట్టపరంగా, సాంకేతిక ,  ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా జరిగిందని తెలిపారు. కానీ కమిషన్ ఈ అంశాలను పట్టించుకోలేదన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ఉద్దేశంతో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని వాదించారు. నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా రూపొందించారని..  నివేదికలో తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేయడం, తమకు సరైన నోటీసులు ఇవ్వకపోవడం , సాక్షులను ప్రశ్నించే అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని కేసీఆర్ తరపు లాయర్ వాదించారు 

అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగా 60 పేజీల సమగ్ర నివేదిక రూపొందించినట్లు కోర్టుకు తెలిపారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో నివేదిక వివరాలను ప్రకటించారని, ఈ నివేదికను త్వరలో అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. పిటిషనర్లు అియన  కేసీఆర్, హరీశ్ రావు అసెంబ్లీ సభ్యులుగా ఉన్నందున,   చర్చలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్ సమస్యలు ఉన్నాయని నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక స్పష్టం చేసిందని అందుకే కమిషన్ ఏర్పాటైందని ప్రభుత్వం తెలిపింది. కమిషన్ 16 నెలల పాటు విచారణ జరిపి, 116 మందిని ప్రశ్నించి, జులై 31, 2025న 665 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిని తెలిపారు. 

విచారణలో ఈ నివేదికపై చర్యలు తీసుకుంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని అడిగి చెబుతానని లాయర్ చెప్పారు. శుక్రవారం లేదా సోమవారం చెబుతానని చెప్పడంతో.. రేపటికి కల్లా చెప్పాలని తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. 

కాళేశ్వరం రిపోర్టులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు అప్పటి ఆర్థిక మంత్రిగా చేసిన ఈటల రాజేందర్ పై కూడా చర్యలు తీసుకోవాలని సిఫారసులు ఉన్నాయి. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిఫారసు  చేశారు. ఈ నివేదికను ప్రతి ఎమ్మెల్యేకు ఇస్తామని..  అసెంబ్లీతో పాటు మండలిలోనూ కూలంకుషంగా చర్చిద్దామని రేవంత్ ప్రకటించారు. ఈ చర్చకు కేసీఆర్ కూడా రావాలన్నారు.  చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలన్న సభే నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ చెబుతున్నారు.  ఇదే వాదనను హైకోర్టుకు ..  అడ్వకేట్ జనరల్ తెలిపే అవకాశం ఉంది.          

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget