అన్వేషించండి

Telangana AP Live News: కార్వీ సంస్థ ఎండీ అరెస్టు.. పార్థసారథిపై భారీ అభియోగాలు!

విజయవాడలో కారులో డెడ్‌బాడీ కలకలం రేపింది. మొగల్రాజపురం మానర్ ప్లాజా ఎదురుగా ఉన్న రోడ్డులో పార్క్ చేసిన ఫోర్డ్ కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

LIVE

Key Events
Telangana AP Live News: కార్వీ సంస్థ ఎండీ అరెస్టు.. పార్థసారథిపై భారీ అభియోగాలు!

Background

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి సహా ఇతర అధికారులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తగ్గుముఖం పట్టాలని స్వామివారిని ప్రార్థించినట్టు కిషన్ రెడ్డి చెప్పారు.

13:37 PM (IST)  •  19 Aug 2021

మొహర్రం: రేపు హైద‌రాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

మొహర్రం సందర్భంగా రేపు (ఆగస్టు 20) ఉద‌యం 11 గంట‌ల‌ నుంచి రాత్రి 9 గంటల వరకు హైద‌రాబాద్ వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించ‌నున్నారు. రేపు హైద‌రాబాద్‌లోని డబీర్‌పురాలోని బీబీ కా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్‌లో మొహర్రం సన్నాహాలపై పోలీసులతో హైద‌రాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ వ‌ర్చువ‌ల్ విధానంలో మాట్లాడారు. రేపు హైద‌రాబాద్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చ‌ర్చించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని చెప్పారు. ప్రజలు క‌రోనా నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని ఆయ‌న అన్నారు. పోలీసులకు ప్రజ‌లు సహకరించాలని కోరారు.

13:17 PM (IST)  •  19 Aug 2021

వీడిన గాంధీ ఆస్పత్రి మిస్టరీ.. ఆ మహిళ ఆచూకీ లభ్యం

గాంధీ ఆస్పత్రిలో మిస్సింగ్ అయి మూడు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న మహిళ ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించారు. నారాయణగూడలోనే ఆ మహిళ సురక్షితంగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల పాటు ఆమె ఓ వ్యక్తితో ఉన్నట్లుగా తేల్చారు. ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

13:02 PM (IST)  •  19 Aug 2021

Karvy ఎండీ పార్థసారథి అరెస్టు

కార్వీ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్టయ్యారు. దాదాపు రూ.720 కోట్లను దుర్వినియోగం చేసినట్లుగా కార్వీ ఎండీ పార్థసారథిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని సీసీఎస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

12:35 PM (IST)  •  19 Aug 2021

విజయవాడలో పార్క్ చేసి ఉన్న కారులో మృతదేహం....

విజయవాడ నగరంలో కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మాచవరం పరిధిలో పార్క్ చేసిన కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని జడ్‌ఎక్స్‌ఎన్‌ సిలిండర్ల కంపెనీ యజమాని తాడిగడపకు చెందిన రాహుల్‌గా పోలీసులు నిర్థారించారు. జి. కొండూరు మండలం చెరువు మాధవరంలో రాహుల్ కంపెనీ ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

10:16 AM (IST)  •  19 Aug 2021

గ్యాంగ్ రేప్ అంతా బూటకమే: పోలీసులు

హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు నాటకమని పోలీసులు తేల్చేశారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు తనను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కేసు పెద్ద హై డ్రామా అని పోలీసులు ధ్రువీకరించారు. తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేయగానే రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో ఈ కేసులో కిడ్నాప్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకనట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో అతణ్ని ఈ కేసులో ఇరికించేందుకు యువతి ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు.


10:08 AM (IST)  •  19 Aug 2021

దేశంలో కొత్తగా 36,401 కరోనా కేసులు, 530 మరణాలు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజాగా గణాంకాలను కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. కొత్తగా కేసులు, మరణాలు పెరిగినట్లు వెల్లడించింది. తాజాగా 18,73,757 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 36,401 మందికి కోవిడ్ సోకినట్లు తెలిపింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 3.4 శాతం పెరిగినట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 530 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.23 కోట్లకు చేరగా, 4,33,039 మంది మరణించారు. 

08:49 AM (IST)  •  19 Aug 2021

ఒవైసీజీ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి: విజయశాంతి

‘‘భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలి. అంతకన్నా, ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిది.’’ అని విజయశాంతి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ తాలిబన్లతో చర్చలు జరపాలని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన సందర్భంగా విజయశాంతి ఈ మేరకు స్పందించారు.

08:45 AM (IST)  •  19 Aug 2021

తొలిసారి తెలుగు రాష్ట్రాలకు

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మంత్రి జి.కిషన్‌రెడ్డి తొలిసారిగా తెలుగు రాష్ట్రాలకు ఇవాళ (ఆగస్టు 19) వస్తున్నారు. తెలంగాణలోకి కిషన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సూర్యాపేట జిల్లా కోదాడలోని నల్లబండగూడెం పెద్ద సభ నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డి చేపడుతున్న 3 రోజుల జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. 12 జిల్లాలు 17 అసెంబ్లీ, 8 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 305 కిలో మీటర్ల యాత్ర సాగనుంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి
Telangana News: తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
Telugu Movies: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Shivam Dube Sixers vs LSG IPL 2024 | ధనాధన్ సిక్సులతో దంచికొడుతున్న శివమ్ దూబే | ABP DesamMarcus Stoinis Century vs CSK | ఛేజింగ్ సూపర్ సెంచరీ కొట్టినా స్టాయినిస్ కు ఆ లక్ లేదు | ABP DesamMarcus Stoinis Century vs CSK | స్టాయినిస్ అద్భుత పోరాటంతో చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABPCSK vs LSG Match Highlights | ఇంటా బయటా రెండు చోట్ల చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి
Telangana News: తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
Telugu Movies: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Embed widget