అన్వేషించండి

Breaking News Live Telugu Updates: చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్

Background

ఉత్తర భారత దేశాన్ని వణికిస్తున్న చలి, ఇప్పుడు నేరుగా దక్షిణ భారత దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. దీని వలన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉండనుంది. సాధారణం కంటే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఏపీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చలి తీవ్ర రూపాన్ని దాల్చనుంది. జనవరి 12 వరకు చలి తీవ్రత మరింత ఎక్కువ కానుంది. సాయంకాలం 4 గంటల నుంచే చలి ప్రారంభించి, తెల్లవారుజామున 10 వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చల్లటి వాతావరణం ఉండనుంది. కొన్ని ప్రదేశాల్లో 5 నుంచి 12 డిగ్రీల వరకు పడిపోయే పరిస్ధితి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

అరకు లోయల్లో చాలా చల్లటి వాతావరణం కమ్ముకుంది. మన మొత్తం దక్షిణ భారత దేశంలోనే అత్యంత చల్లటి ప్రాంతం ఇది. నిన్న తమిళనాడులోని ఊటీ వైపు కూడ అంతగా నమోదుకాలేదు కానీ చింతపల్లిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. చింతపల్లి - 1.5 డిగ్రీల సెల్సియస్, హుకుంపేట - 1.5 డిగ్రీల సెల్సియస్, కుంతలం - 1.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. రేపు, ఎల్లూండి కూడ ఇలాంటి తరహాలో వాతావరణం కొనసాగనుంది. విశాఖ ఏజెన్సీనే కాదు, మారేడుమిల్లి వైపు కూడ చలి తీవ్రంగా ఉండనుంది.

ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.

పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కానీ, తెలంగాణలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. కానీ, అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ తెలంగాణలో 6 లేదా 7 జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.

హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 13 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 28.3 డిగ్రీలు, 12.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

22:24 PM (IST)  •  09 Jan 2023

Hyderabad: చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్

హైదరాబాద్ లో చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్

సాదరంగా ఆహ్వానించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు

వివిధ అంశాలపై ఇరువురు చర్చ

20:56 PM (IST)  •  09 Jan 2023

ఇన్స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఓ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ

టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ వి.నరేష్ కుమార్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పి శ్యాంసుందర్, కె సోమలింగం మరియు ఒక కానిస్టేబుల్ బి సృజన్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

19:01 PM (IST)  •  09 Jan 2023

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో పోలీసుల విచారణకు హాజరైన సునీల్ కనుగోలు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో పోలీసుల విచారణకు హాజరైన సునీల్ కనుగోలు

మొదట అనారోగ్య కారణాలతో రాలేనని సమాచారం ఇచ్చి, కాసేపటికి పోలీస్ విచారణకు హాజరైన సునీల్ కనుగోలు

సునీల్ కనుగొలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలుసులు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో డిసెంబర్ 27 తేదీన విచారణకు హాజరుకావాలని 41 A నోటీసులు 

పోలీసులు ఇచ్చిన 41A నోటీసులను హైకోర్టు లో సవాల్ చేసిన సునీల్ కనుగొలు

41A నోటీసులు పై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన హైకోర్టు

సైబర్ క్రైమ్ విచారణ కు సహకరించాలని సునీల్ కనుగొలు కు హైకౌర్ ఆదేశం 

సునీల్ కనుగొలు ను విచారణ చేయాలి తప్ప, అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం

కాంగ్రెస్ వార్ రూమ్ కేంద్రంగా సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్, MLC కవిత ను కించ పరిచేలా సోషియల్ మీడియా లో పోస్ట్ లు పెట్టినట్లు ఆరోపణలు 

41A నోటీసులు పై హైకోర్టు ఆదేశాలతో విచారణ చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు

18:05 PM (IST)  •  09 Jan 2023

దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం

ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

18:00 PM (IST)  •  09 Jan 2023

తెలంగాణ జ్యుడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ జ్యుడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ.....

అల్ ఇండియా జ్యుడిషియల్ అధ్యక్షులు లక్ష్మా రెడ్డి..

తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో అస్సోసియేషన్ డైరీ ఆవిష్కరణ..

2023 క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన అసోసియేషన్ సభ్యులు..

హైకోర్టు జస్టిస్ నవీన్ రావు గారితో క్యాలెండర్ ఆవిష్కరణ..

న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డీమాండ్..

నిజామాబాద్ కోర్టు సిబ్బంది ఫై పెట్టిన కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలి.

న్యాయశాఖ లో పదవి విరమణ పొందిన రెటైర్మెంట్స్ బెనిఫిట్స్ తక్షణం విడుదల చేయాలి.

14:17 PM (IST)  •  09 Jan 2023

MLC Ashok Babu: శ్రీవారి సేవలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఈయనకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రద ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ. మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థులు నిలబడ్డారో వారు నేటి నుండి ప్రచారం కొనసాగించే నేపథ్యంలో స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగిందన్నారు.  టిడిపి పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టిడిపికి అనుకూలంగా ఉందని, కచ్చితంగా విజయం సాధిస్తాం అనే నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం జరుగుతున్న అరాచకాలతో ప్రజలు విసిగు చెందారన్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక, ఉపాధి లేక చాలా నిరుత్సాహంగా ఉన్నారని చెప్పిన ఆయన, యువత టిడిపి బ్రహ్మరధం పడుతుందని ఆయన చెప్పారు. సమాజంపై వైసీపి దాడి చేస్తుందని, జనసేన, బిజేపి, టిడిపి నాయకులు అని తేడా లేకుండా అందరిపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దౌర్జన్యాలను కలిసి ఎదుర్కోవాలని అన్ని పార్టిలు నిర్ణయంకు రావడం జరిగిందని, అయితే గతంలో విజయవాడలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పవన్ ను కలిసారు కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గౌరవంగా చంద్రబాబును కలిసారని, రాబోయే ఉద్యమాలు అన్ని‌ కూడా కలిసి పాల్గోనాలి అనే ఇద్దరు చర్చించడం జరిగిందన్నారు.

14:11 PM (IST)  •  09 Jan 2023

Tirumala Updates: శ్రీవారి సేవలో‌ పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ‌ సమయంలో బీజేపీ నేత సునీల్ ధియోధర్, రేమాండ్ అధినేత గౌతమ్ సింఘానియా, తమిళ సినీ నటుడు విక్రమ్ ప్రభు, ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు, ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యే ‌అప్పలనాయుడు, తెలంగాణ ఛీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ లు వేర్వేరుగా వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

13:09 PM (IST)  •  09 Jan 2023

PM Modi Hyderabad Tour: 19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

  • పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ సభ నిర్వహించే యోచనలో బీజేపీ 
  • 19న సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన
  • అనంతరం పరెడ్ గ్రౌండ్స్ లో సభకు ఏర్పాట్లు
  • ఏర్పాట్లు పరిశీలిస్తున్న బండి సంజయ్, లక్ష్మణ్
11:24 AM (IST)  •  09 Jan 2023

Varasudu Movie Release Postpone: ‘వారసుడు’ సినిమా విడుదల వాయిదా

తమిళ హీరో విజయ్ సినిమా నటించిన ‘వారసుడు’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ఈ వివాదంలో తానే వెనక్కి తగ్గానని చెప్పారు. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నానని వెల్లడించారు. రెండు రోజులు ఆలస్యంగా వారసుడు సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

10:44 AM (IST)  •  09 Jan 2023

Telangana Congress: హౌస్ అరెస్టులు చేయడంపై మల్లు రవి ఆగ్రహం

ఇందిరా పార్కు వద్ద ధర్నా వేళ పోలీసులు పలువురు నేతలను హౌస్ అరెస్టులు చేయడంపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు స్పందించారు. ‘‘ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ ఆధ్వర్యంలో జరిగే సర్పంచ్ ధర్నా కు కోర్ట్ అనుమతి ఇచ్చింది. కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నాం. పోలీసుల అనుమతి తీసుకున్నా కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బందాలు చేస్తున్నారు. మాకు అన్ని ప్రాంతాల నుంచి నాయకుల ద్వారా సమాచారం తెలుస్తుంది. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవద్దు. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు, గృహ నిర్బందాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అనుమతి ఉండి, శాంతి యుతంగా నిర్వహించే ధర్నాను అడ్డుకుంటే కోర్ట్ ధిక్కరణ కిందకు వస్తుంది. గృహ నిర్బంధం చేసిన నాయకులకు వెంటనే పోలీసులు స్వేచ్ఛ ఇవ్వాలి. వారిని ధర్నాలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలి లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది’’ అని  మల్లు రవి అన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget