అన్వేషించండి

Breaking News Live Telugu Updates:హనుమకొండ బీజేపీ సభాస్థలి అనుమతి రద్దు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates:హనుమకొండ బీజేపీ సభాస్థలి అనుమతి రద్దు 

Background

ఈ నెల 28 వరకు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు. వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుపాను వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ పై ఈ వాయు గుండం ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందని వివరించారు.

అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో నేటి నుంచి వచ్చే 4 రోజుల పాటు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాలు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. 

26వ తేదీన రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లోనూ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వాతావరణ విభాగం వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లా్ల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులుహెచ్చరించారు. అరటి తోటలు సహా కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందని అన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

‘‘రాష్ట్రంలో కోస్తా భాగాల మీదుగా ఏర్పడుతున్న రెండు ఉపరితల ఆవర్తనాల వల్ల ఈ రోజు నుంచి వర్షాలు జోరందుకోనుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంకాలం మధ్యలో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నగరం పరిసరాలు, అనకాపల్లి, పాడేరు (అరకు వ్యాలీ), ఉభయ గోదావరి జిల్లాలోని పలు భాగాలు, కృష్ణా జిల్లాలోని కొన్ని భాగాల్లో వర్షాలను చూడగలం. ఇవి అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడాలంటే ఒకటి తెలంగాణ నుంచి మన వైపుగా రావాలి, లేదా ఒడిషా నుంచి రావాలి లేదా రాయలసీమ నల్లమల అటవి నుంచి రావాలి. ఈ సారి మాత్రం రాత్రి రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కడప​, అన్నమయ్య​, తిరుపతి, చిత్తూరులో మొదలై నెల్లూరు, ప్రకాశం మీదుగా బాపట్ల గుంటూరు, విజయవాడ జిల్లాల్లోకి ఈ రోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారిజామున వర్షాలు విస్తరించనుంది. రేపు తెల్లవారిజామున ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుండనుంది. మరో వైపున తెలంగాణ హైదరాబాద్ లో అర్ధరాత్రి రేపు తెల్లవారిజామున వర్షాలను మనం చూడగలము’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

21:42 PM (IST)  •  25 Aug 2022

హనుమకొండ బీజేపీ సభాస్థలి అనుమతి రద్దు 

హనుమకొండ బీజేపీ సభకు అనుమతి ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అన్నారు. పోలీసుల నుంచి సమాచారం రాని కారణంగా సభ అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.  ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ లేఖ రాశారు. సభ కోసం కాలేజీ గ్రౌండ్ కు చెల్లించిన రూ.5 లక్షలు వాపస్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎల్లుండి ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు.   

17:18 PM (IST)  •  25 Aug 2022

బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసే పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పోలీసులు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. 

16:55 PM (IST)  •  25 Aug 2022

మతపిచ్చి లేపే తెలంగాణ కావాలా -పంటలు పండే తెలంగాణ కావాలా: కేసీఆర్

కొంగరకలాన్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే రాజకీయానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేసిన మోదీ ఆధ్వర్యంలోనే బీజేపీ... తెలంగాణపై పడిందన్నారు. అర్థంపర్థంలేని మత పిచ్చి లేపి ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేద్దామనుకుంటోందని విమర్శించారు. 

గతంలో జరిగిన చిన్న తప్పు కారణంగా యాభై ఎనిమదేళ్లు తెలంగాణ అనేక బాధలు అనుభవించిందని గుర్తు చేశారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత క్రమంగా సమస్యల నుంచి బయటపడుతున్నామన్నారు. ఇలాంటి సందర్భంలో మరోసారి తప్పు చేస్తే మాత్రం ఇకపై కోలుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దేశంలో నడుస్తున్న అసూయ రాజకీయలను గమనించాలని ప్రజలకు హితవు పలికారు. 

భారత్‌లో ఏ రాష్ట్రంలో లేని అద్భుత సంక్షేమ పథకాలు ఇక్కడ అందిస్తున్నామన్నారు కేసీఆర్.  రైతులతోపాటు అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాదు... వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ఇలాంటి సదుపాయాలు వస్తాయన్ని ఎప్పుడైనా అనుకున్నామా అని ప్రశ్నించారు. సొంత పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇదంతా సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి సదుపాయాలు ఉండాలా.. వద్దా... ఇవి కాపాడుకోవాలా.. వద్దా అని ప్రశ్నించారు. నిద్రపోతే చాలా ప్రమాదానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 

పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో మంటలు రేపే తెలంగాణ కావాలా అని ప్రజలను అడిగారు సీఎం కేసీఆర్.  సంకుచిత మత పిచ్చి మంటలు మండే రాష్ట్రమైతే భవిష్యత్‌ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇవాళ ఇండియా ఏం జరుగుతోందో చూడాలన్నారు. దీన్ని సహించుకొని మౌనంగా ఉందామా.. పిడికిలి ఎత్తి పోరాడదామా... అని సలహా అడిగారు.  కేంద్రం ఒక్కటంట్టే ఒక్కటైనా మంచి పని చేసిందా అని నిలదీశారు. ఆ చేసిన పని ఏమైనా కనిపిస్తుందా.. ఒక్కప్రాజెక్టైనా కట్టారా అని క్వశ్చన్ చేశారు. ప్రధాని, మంత్రులు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని వారి చేసిన మంచి ఏంటో చెప్పాలన్నారు.  

తాను సీఎం అయిన తర్వాతే మోదీ పీఎం అయ్యారని గుర్తు చేశారు. తాము తెలంగాణంలో 24గంటలు కరెంటు ఇస్తున్నామని.. దేశంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. అలాంటి వాళ్లు మాత్రం ఇక్కడకు వచ్చి నీతులు చెప్పాలా.. డైలాగ్‌లు చెప్పాలా.. వాళ్ల మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోవాలా అని అడిగారు. 

16:12 PM (IST)  •  25 Aug 2022

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కి మరో షాక్, బీజేపీలోకి శ్రీరాం చక్రవర్తి 

Karimnagar Congress : ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఇవాళ బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారు.  కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డిని కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరుస్తూ ఆహ్వానించడంపై శ్రీరాం చక్రవర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

14:35 PM (IST)  •  25 Aug 2022

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. కొన్ని వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. అధ్యక్ష పదవి చేపట్టేందుకు  రాహుల్ గాంధీ విముక్తి చూపిస్తున్న టైంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు వస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇంతలో ప్రక్రియే వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Squid Game Season 2 Teaser: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Embed widget