By : ABP Desam | Updated: 23 Jun 2022 10:02 PM (IST)
రేపటి ఏపీ కేబినెట్ భేటీ యథావిధిగా జరగనుంది. సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దైన కారణం కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ రేపు దిల్లీ వెళ్లనున్నట్లు ముందు వార్తలు వచ్చాయి కానీ ఆ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. మంత్రులందరూ 11 గంటలకు హజరవ్వాలని సీఎంవో ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ చత్రినకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పుగుడలో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. గతంలో అలీ అనే యువకుడితో బాలికకు పరిచయం ఉండేది. ఆ పరిచయంతో అలీ అనే యువకుడు బాలికను ఇంటికి పిలిచి తన మిత్రుడు ఆర్బాస్ తో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలీ, అర్భాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులు సమ్మెను విరమించారు. ఫిల్మ ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం కావడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు అంగీకారం లభించింది. దీంతో కార్మికులు రేపటి నుంచి షూటింగుల్లో పాల్గొననున్నారు. కొత్త వేతనాల ద్వారానే రేపటి నుంచి షూటింగ్ ఉండనుంది.
పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో గురువారం విజయారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. తాను పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
మదనపల్లె అమ్మచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని ద్విచక్ర వాహనంలో ఓవర్ టెక్ చేస్తుండగా అదుపు తప్పి లారీ క్రింద పడి శిరీషా (17) విద్యార్ధిని మృతి చేందింది.. ద్విచక్ర వాహనంను నడుపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయాలు కావడంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్ధానికులు.. ఘటన స్దలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. మృతిదేహాన్ని శవ పరిక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
దాచేపల్లి పట్నం మాదినపాడు రోడ్డులో మైనింగ్ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ టైరు ఊడి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటిలో వ్యక్తులు అప్రమత్తం కావడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం తప్పింది.
దాచేపల్లి పట్టణం మాదినపాడు రోడ్ లో కొత్తగా సుమారు నాలుగు మైనింగ్ క్వారీలకు పర్మిషన్ ఇచ్చారు. అప్పటి నుంచి నిత్యం మైనింగ్ లోడుతో ట్రాక్టర్లు టిప్పర్లు ఓవర్ స్పీడ్ తో వెళ్లుతున్నాయి. దారిలో వివిధ స్కూల్స్ ఉన్నాయి. గతంలో ఒక టెన్త్ క్లాస్ విద్యార్థిని మైనింగ్ ట్రాక్టర్ ఢీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఓవర్ స్పీడ్ తో వస్తున్న ట్రాక్టర్ వెనక టైర్ ఊడి సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ఇంట్లోని కుటుంబ సభ్యులు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ ని ప్రశ్నిస్తే ఎవరికి ఏం కాలేదుగా అయినప్పుడు చూసుకుందాం సమాధానం ఇవ్వడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న జనసేన పార్టీ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అర్ధగంట ట్రాఫిక్ ఆగితేనే సుమారు 50 లోడు ట్రాక్టర్లు నిలిచాయన్నారు. బాధితులతో ట్రాక్టర్ డ్రైవర్లు మాట్లాడిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అధికారులు కూడా అక్రమ క్వారీల యజమానులతో కుమ్మక్కైనట్లు ఆరోపించారు.
నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరో మూడు రోజులు ఇక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ఉరుములు మెరుపులు కూడా రావచ్చని అధికారులు అంచనా వేశారు.
నెల్లూరు జిల్లా ఉత్తర భాగాల్లో వర్షాలు కురిశాయని, అవి నేరుగా ప్రకాశం జిల్లా దక్షిణ భాగాలకు ముఖ్యంగా చిమకుర్తి, కనిగిరితో పాటుగా తూర్పు భాగాలైన కందుకూరు - ఒంగోలు బెల్ట్, చీరాలలో వర్షాలు పెరగనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు. అర్ధరాత్రి దాటాక బాపట్ల జిల్లాలో వర్షాలు పడనున్నాయని అంచనా వేశారు.
Telangana Weather News: తెలంగాణ వాతావరణం ఇలా
‘‘తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు ఇంకాస్త తగ్గింది. 10 గ్రాములకు రూ.200 తగ్గింది. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.300 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్లో రూ.47,450 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.66,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,450 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,760గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,000 గా ఉంది.
Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: విజయసాయి రెడ్డి
Purandeshwari: వైన్ షాప్లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు అలర్ట్
/body>