అన్వేషించండి

Breaking News Live Telugu Updates: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి

Background

పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 

తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. నేడు తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు, రాత్రి పూట చలి విషయంలో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.8 డిగ్రీలుగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 

ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
‘‘ఫసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్ధితుల వలన తేలికపాటి-ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు లానినా దిశ ఉన్నా, ఇప్పుడు పరిస్ధితులు వెనక్కి మారనున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్ధితుల కంటే ఏప్రిల్ లో మరింత స్పష్టత రానుంది.

ఎల్-నినో అంటే తక్కువ వర్షాలు, లానినా అంటే అధిక వర్షాలు ఉండటం సహజం. దానితో పాటు హిందూ మహాసముద్రం (ఇండియన్ ఓషన్) లో జరిగే మార్పుల వలన కూడ వర్షపాతం మారుతుంది. కానీ దాని ప్రభావం అత్యల్పంగానే ఉంటుంది. కాబట్టి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

21:51 PM (IST)  •  23 Feb 2023

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి(47) ( సైదాబాద్ లో నివాసముండే సోదరి కుమారుడు) గుండెపోటుతో మృతి చెందారు. సంతోష్ నగర్ డిఆర్డిఎల్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి కన్నుమూశారు.

19:02 PM (IST)  •  23 Feb 2023

బేగంపేటలోని బ్లైండ్ స్కూల్లో విషాదం, బిల్డింగ్ పైనుంచి పడి  విద్యార్థి మృతి

బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో విషాదం

బిల్డింగ్ పైనుంచి పడి  విద్యార్థి మృతి..

కేర్ టేకర్ బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో  కింద పడ్డ లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ..

ఆరో అంతస్తు నుంచి పడిపోయిన
 12 సంవత్సరాల లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ..

17:36 PM (IST)  •  23 Feb 2023

యూత్ కాంగ్రెస్ నేత పవన్ ను పరామర్శించిన భట్టి విక్రమార్క

సికింద్రాబాద్: తెలంగాణ లో అరాచక పాలన, అప్రజాస్వామిక వ్యవస్థ కొనసాగుతుందని కాంగ్రెస్ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు

వరంగల్ లో జరిగిన దాడి ఘటనలో గాయాలపాలై సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ను బట్టి విక్రమార్క పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..

భారాస నాయకులు గుండాల మాదిరిగా వ్యవహరిస్తూ దాడులకు దిగబడడం ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు గా మారిందన్నారు..

బారాస నాయకుల రాక్షసత్వం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని అనుమానం తలెత్తుతుందనీ అన్నారు..

వరంగల్లో పవన్ పై జరిగిన దాడి భాదాకరమని అన్నారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ శ్రేణులపై బారాస నాయకులు దాడులకు దిగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

15:03 PM (IST)  •  23 Feb 2023

టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ, కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానం

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో కన్నాతో పాటు మరికొందరు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి చంద్రబాబు ఆహ్వానించారు.

15:02 PM (IST)  •  23 Feb 2023

Osmania Dental Collage: ఉస్మానియాలో విద్యార్థుల ఆందోళన 

ఉస్మానియా డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ వైఖరికి వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వసతి గృహాలు ఖాళీ చేయాలంటూ యాజమాన్యం వేధిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు కాలపరిమితి పూర్తికాకుండానే హాస్టల్ ఎలా ఖాళీ చేస్తామని యూజీ, పీజీ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

12:24 PM (IST)  •  23 Feb 2023

Tirumala Updates: శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని జబర్దస్త్ బృందం దర్శించున్నారు. గురువారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు సంజయ్ స్వరూప్, సినీనటి శ్రీలక్ష్మీ, చైల్డ్ కమెడియన్స్ యోధ, దివెన, నటుడు గెటప్ శీనులు కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన గెటప్ శీను మీడియాతో మాట్లాడుతూ. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కోవిడ్ తర్వాత మొదటి సారి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు. భోళా శంకర్, రాజు యాదవ్, పొలిమేర-2, హనుమెన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నట్లు గెటప్ శీను తెలియజేశారు.

12:15 PM (IST)  •  23 Feb 2023

Minister KTR Tour in Bhupalpally: భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన

జయశంకర్ భూపాల పల్లి జిల్లా ములుగు ఘనపురానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, వరంగల్ ZP చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. 

అనంతరం మంత్రి కేటీఆర్ ములుగు ఘనపురంలో మండల తహశీల్దార్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అలాగే, జ్యోతిరావు ఫూలే బాలికల ఆవాస పాఠశాలకు, సింగరేణి వెయ్యి క్వార్టర్స్ కి ప్రారంభోత్సవం చేశారు. అలాగే భూపాలపల్లి కి చేరుకుని అర్ అండ్ బి అతిథి గృహానికి, దివ్యాంగుల కమ్యూనిటీ హాలుకు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కు ప్రారంభోత్సవం చేశారు.

12:10 PM (IST)  •  23 Feb 2023

Warangal: కాకతీయ మెడికల్ కాలేజీ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

  • మెడికో ప్రీతి ఆత్మహత్యయత్నం నేపథ్యంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో KMC ముట్టడికి పిలుపు
  • ముందస్తుగా మోహరించిన పోలీసులు
  • విద్యార్థి సంఘాలను లోపలికి అనుమతించకుండా అరెస్ట్ చేసిన పోలీసులు
  • కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట
  • పరిస్థితి ఉద్రిక్తం
11:56 AM (IST)  •  23 Feb 2023

Hyderabad Murder: జగద్గిరిగుట్టలో యువకుడి హత్య

  • జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో బండెల మనోజ్(22) అనే యువకుడిని హత్య
  • సత్తి, మోహన్ అనే ఇద్దరు మనోజ్ అనే యువకుడిపై కత్తితో దాడి
  • చికిత్స పొందుతూ మృతి చెందిన మనోజ్
  • హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
11:28 AM (IST)  •  23 Feb 2023

TTD News: లంచం తీసుకుంటూ విజిలెన్స్ వింగ్ కి పట్టుబడ్డ టీటీడీ ఉద్యోగి

నలభై వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ విజిలెన్స్ వింగ్ అధికారులకు పట్టుబడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్ లోని దుకాణం సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్ ఫైల్ ప్రాసెస్ కోసం రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన టీటీడీలో రెవిన్యూ విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ నవీన్ రూ.40 వేలు లంచం తీసుకుంటుడగా రెడ్ హ్యాండెడ్ గా టీటీడీ ఉద్యోగిని నవీన్ ను విజిలెన్స్ వింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్ లోని ఓ దుకాణం యజమాని జానకిరామ్ ఫిర్యాదుతో టిటిడి విజిలెన్స్ వింగ్ అధికారులు నవీన్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే టీటీడీ చరిత్రలో మొదటి సారి టిటిడి ఉద్యోగి లంచం డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం మూడు రోజుల క్రితం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టీటీడీలో చర్చనీయాంశంగా మారింది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
షర్మిలకు ఈసీ షాక్, వివేకా హత్య కేసులో నోటీసులు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Mahindra Scorpio: భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
Embed widget