News
News
X

Breaking News Live Telugu Updates: సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం 

సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

 

కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్  

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఫలితాల కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తి అవ్వగా... మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్  రెడ్డికి 7505 ఓట్లు రాగా, చెన్నకేశవ రెడ్డికి 6584 ఓట్లు  వచ్చాయని ఈసీ అధికారులు ప్రకటించారు. మొదటి  ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో  ఉన్నారు. ఏవీఎన్ రెడ్డికి 50 శాతానికి పైగా ఆధిక్యం వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 452 చెల్లని ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికల సిబ్బంది ఎలిమినేషన్ చేస్తారు. మ్యాజిక్ ఫిగర్ 12709. 
 

కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్  

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఫలితాల కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తి అవ్వగా... మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్  రెడ్డికి 7505 ఓట్లు రాగా, చెన్నకేశవ రెడ్డికి 6584 ఓట్లు  వచ్చాయని ఈసీ అధికారులు ప్రకటించారు. మొదటి  ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో  ఉన్నారు. ఏవీఎన్ రెడ్డికి 50 శాతానికి పైగా ఆధిక్యం వచ్చిందని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 452 చెల్లని ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికల సిబ్బంది ఎలిమినేషన్ చేస్తారు. మ్యాజిక్ ఫిగర్ 12709. 
 

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో కవిత అనుమానితురాలు - కోర్టుతో చెప్పిన ఈడీ

కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు గైర్హాజరైన వ్యవహారంలో ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 20వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. అయితే, కవిత నేడు విచారణకు హాజరు కానందున రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. ఈ సందర్భంగానే లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ కోర్టుకు కీలక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె సాక్షా? అనుమానితురాలా? అని ఈడీ ప్రత్యేక కోర్టు ప్రశ్నించగా, అనుమానితురాలు అని ఈడీ కోర్టుకు చెప్పింది. 

Vikarabad Rains: వికారాబాద్‌లో వడగండ్ల వాన, విదేశాన్ని తలపిస్తున్న రోడ్లు

వికారాబాద్ జిల్లా మర్పల్లిలో వడగండ్ల వాన కురిసింది. దీనివల్ల మంచు గడ్డలతో రోడ్లు నిండిపోయాయి. వడగండ్లు పడిన ఆ రోడ్లు చూస్తే విదేశాలకు వెళ్లిన అనుభూతి కలుగుతోంది. జహీరాబాద్‌లోనూ వడగండ్ల వాన పెద్ద ఎత్తున పడింది.

Kavitha ED Enquiry: ఈడీ విచారణకు రాని ఎమ్మెల్సీ కవిత

నేడు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత, తాను రాలేనని ఈడీకి సమాచారం పంపారు. అనారోగ్య కారణాల వల్ల విచారణకు నేడు హాజరు కాలేనని చెప్పారు. విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని కోరారు.

West Godavari MLC Election: పశ్చిమ గోదావరిలో రెండు చోట్ల వైసీపీనే విజయం

పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులే గెలిచారు. వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంగకా రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. మొత్తం 1105 ఓట్లు ఉండగా 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వైసీపీకి చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటిప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. వంకా రవీంద్రనరాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయి.

Kurnool News: కర్నూలులో ముగిసిన ఎన్నికల కౌంటింగ్

కర్నూలులో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ కి భారీ మెజారిటీ వచ్చింది. కాసేపట్లో తుది ఫలితాన్ని ఇక్కడ ప్రకటించనున్నారు.

MLC Election Result: పశ్చిమగోదావరి లోనూ వైసీపీదే గెలుపు

పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మె్ల్సీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ సీపీ విజయం సాధించింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్ గెలిచారు. శ్రీనివాస్ కు 481, వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ కు 122 ఓట్లు, చెల్లని ఓట్లు 25 వచ్చాయి. 

Inter Exams: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సెకండ్ ఇయర్ మొదటి పరీక్ష నేడు ప్రారంభం కాగా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి  విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాయడానికి ఎగ్జామ్స్ సెంటర్ వద్దకు చేరుకుంటున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని పలు కాలేజీల వద్ద ఎగ్జామ్ రాయడానికి విద్యార్థులు ఉదయం 8 గంటల నుండి కాలేజీ వద్దకు చేరుకున్నారు. తొమ్మిది గంటల లోపు ఒక్కక్షణం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించబోమని ఇంటర్ బోర్డు స్పష్టం చేయగా, అధికారులు ఆంక్షలు ఏర్పాటు చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఎగ్జామ్ సెంటర్ లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

AP MLC Election Result: ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ఫలితం వెల్లడి, శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి గెలుపు

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. ఆయనకు 632 ఓట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి.

Background

జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Telangana Weather: తెలంగాణలో వాతావరణ స్థితి

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

Rains In Telangana: ఈ నెల 16 నుంచి తెలంగాణలో ఈ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలు సహా నిజామాబాద్‌, జగిత్యాల, హన్మకొండ, మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్‌,  జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (మార్చి 17) ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. శనివారం  (మార్చి 18) పెద్దపల్లి, కరీంనగర్‌, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, ఆదిలాబాద్‌, హన్మకొండ, కామారెడ్డి, ములుగు, నిజామాబాద్‌, జగిత్యాల, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు వెదర్ బులెటిన్ లో తెలిపారు.

ఏపీలో వర్షాలు ఇలా

ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. 17, 18, 19 తేదీల్లో ప్రకాశం, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదా­వరి, తిరుపతి జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు­గాలు­లు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Delhi Weather: ఢిల్లీలో ఇలా

రానున్న 5 రోజులపాటు భారత వాతావరణ విభాగం చెప్పిన అంచనాల ప్రకారం.. దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చి 20 వరకు తేలికపాటి, మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండగా, వాయువ్య, తూర్పు, మధ్య, పశ్చిమ భారతదేశంలో మినహా గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన తేడా ఉండదు. మేఘావృతమైన వాతావరణం, వర్షం పడే అవకాశం ఉన్నందున ఢిల్లీ-NCR వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?