అన్వేషించండి

Breaking News: ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News: ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

Background

ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది దక్షిణ అండమాన్ తీరంలో శనివారం మొదలైంది. నవంబర్ 15 నాటికి ఇది తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజా అల్పపీడనం తుపానుగా మారనుందని, దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై అధికంగా ఉంటుంది. ఈ వాయుగుండం తుపానుగా మారనుందని, దీనికి జవాద్ అని నామకరణం చేయాలని నిర్ణయించారు. 

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు తాజా వాయుగుండం జవాద్ తుపానుగా మారనుండటంతో ఏపీ, తమిళనాడులకు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. తమిళనాడుతో పాటు కొస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం బలపడి నవంబర్ 18 నాటికి ఏపీ తీరానికి చేరే అవకాశం ఉంది. జవాద్ ప్రభావంతో ఏపీలో మరో మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణపై సైతం తాజా అల్పపీడన ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోరూ చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా ముందు రోజుతో పోల్చితే నిలకడగానే ఉంది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. దీంతో తాజా ధర రూ.107.69 గా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.94.14గా నిలకడగా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు భారీగా పెరిగింది. పసిడి ధర గ్రామునకు రూ.20 పెరగ్గా.. వెండి ధర గ్రాముకు రూ.0.30 పైసలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.300 ఎగబాకినట్లయింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో గ్రాముకు రూ.20 పెరిగి.. రూ.46,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,180 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 

ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,100 కు ఎగబాకింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,700గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,700 గా ఉంది.



22:02 PM (IST)  •  14 Nov 2021

ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. విందు అనంతరం తాజ్ హోటల్ నుంచి ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, తమిళనాడు మంత్రి పొన్నుమూడి, కేరళ మంత్రులు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, అండమాన్ లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తిరుగుపయమయ్యారు. ఈ రాత్రికి తిరుపతిలోని తాజ్ హోటల్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బసచేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాజ్ హోటల్ లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవ్వనున్నారు. ఏపీలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకులతో అమిత్ షా చర్చించనున్నారు. 

 

20:26 PM (IST)  •  14 Nov 2021

రేపు...ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ

రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి రాజ్ హోటల్ వేదికగా ఏపీ రాష్ట్ర బీజేపీ నాయకులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. సోమువీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్, సునీల్ ధియోదర్, విష్ణు వర్ధన్ రెడ్డి పలువురు ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. 

15:25 PM (IST)  •  14 Nov 2021

ఆర్టీసీ డ్రైవర్ కు గుండె పోటు... తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. అంబర్ పేట్ లో ఆర్టీసీ డ్రైవర్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్ ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు.

15:06 PM (IST)  •  14 Nov 2021

మరికాసేపట్లో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం... తాజ్ హోటల్ కు చేరుకున్న అమిత్ షా

తిరుపతి సదరన్ జోనల్ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజ్ హోటల్ కు చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగసామి, తెలంగాణ, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్‌ గవర్నర్ డి.కే.జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ పటేల్, తమిళ నాడు, కేరళ నుంచి మంత్రులు, అధికారులు  హాజరయ్యారు. మరికొద్ది సేపటిలో కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది.

14:43 PM (IST)  •  14 Nov 2021

హైదరాబాద్‌లో బంజారా ఉత్సవ్ ప్రారంభం

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బంజారా ఉత్సవ్ 2021 ప్రారంభం అయింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ నేతలు రవీంద్రనాయక్, పేరాల శేఖరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోరీ గోర్ పేరుతో బంజారా భాషా రేడియోను గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం బంజారా మహిళలతో కలసి దత్తాత్రేయ నృత్యం చేశారు. మరికాసేపట్లో బంజారా ఉత్సవ్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు అవుతారు. ఏటా ఇదే గ్రౌండ్స్‌లో నుమాయిష్ జరిగే సంగతి తెలిసిందే.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
Ind Vs NZ Odi Update:  స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
Ind Vs NZ Odi Update:  స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
స‌చిన్ ని అధిగమించనున్న రోహిత్ ..! 300వ వ‌న్డే క్ల‌బ్బులో కోహ్లీ.. ఇరుజ‌ట్లు చెరో మార్పు.. కివీస్ తో మ్యాచ్
SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
Nani Vs Vijay Devarakonda: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
Babili water Release: బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Samsung A56: భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
భారత మార్కెట్లోకి 3 కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్న శాంసంగ్- స్పెసిఫికేషన్లు, ధరలు పూర్తి వివరాలిలా
96 Movie - Vijay Sethupathi: విజయ్ సేతుపతి కాదు... బాలీవుడ్ హీరో కోసం రాసిన కథ... కల్ట్ క్లాసిక్ '96'ను మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా?
విజయ్ సేతుపతి కాదు... బాలీవుడ్ హీరో కోసం రాసిన కథ... కల్ట్ క్లాసిక్ '96'ను మిస్ చేసుకున్న స్టార్ ఎవరో తెలుసా?
Embed widget