అన్వేషించండి

Breaking News Live: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు... ఒమిక్రాన్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh Telangana news Updates Breaking News Live on January 3 Monday Breaking News Live: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు... ఒమిక్రాన్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం
ABP Live

Background

మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్యాదేవి పల్లిలో విషాదం చోటు చేసుకుంది. వేడి సాంబార్‌లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు హుటాహుటాన ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజుల పాటు చికిత్స పొందిన బాలుడు పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆయన రచ్చబండ కార్యక్రమంతో పాటు బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్ అరెస్ట్‌లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రేవంత్ ఇంటికి రావడం, ఆయనను కలవడం వంటివి జరుగుతున్నాయి. ‘‘స్వల్ప లక్షణాలతో నేను కోవిడ్ బారిన పడ్డాను. గత కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారు.. తప్పనిసరిగా కావల్సిన జాగ్రత్తలు తీసుకోండి’’ అని ట్వీట్ చేశారు.

సూర్యాపేటలో ర్యాగింగ్ భూతం
సూర్యాపేటలో ర్యాగింగ్ రక్కసి వెలుగు చూసింది. పట్టణంలోని మెడికల్ కాలేజీలో హాస్టల్‌లో ఉంటూ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సీనియర్ల నుంచి ర్యాగింగ్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌‌కు చెందిన విద్యార్థి ఇంటి నుంచి శనివారం రాత్రి హాస్టల్‌‌కు చేరుకున్నాడు. అతణ్ని చూసిన రెండో సంవత్సరం సీనియర్ విద్యార్థులు దాదాపు 25 మంది తమ గదిలోకి రమ్మని పిలిచారు.

వారు అప్పటికే మద్యం సేవించి ఉన్నట్లుగా బాధితుడు ఫిర్యాదులో పేర్కొ్న్నాడు. ‘‘వారు నా దుస్తులు విప్పించి సెల్‌ ఫోన్‌ లో వీడియో తీశారు. కొంత మంది మద్యం తాగి నాపై దాడికి కూడా పాల్పడ్డారు. అనంతరం ట్రిమ్మర్ తీసుకొని నాకు గుండు గీసేందుకు ప్రయత్నించారు. సీనియర్లు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్‌ చేయించుకోవడమే కాకుండా నాపై పిడి గుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్‌ వస్తుందని చెప్పి నేను తప్పించుకుని నా గదికి వెళ్లిపోయాను. నా తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాను. ఆయన వెంటనే డయల్‌ 100 కు ఫిర్యాదు చేశారు.’’ అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన పై ఆరా తీశారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ర్యాంగింగ్‌ జరిగితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని కాలేజీ సూపరింటెండెంట్ కూడా తేల్చి చెప్పారు.

హైదరాబాద్‌లోని మైలార్‌ దేవుపల్లికి చెందిన విద్యార్థి సూర్యాపేట మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 15 నుంచి జనవరి 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. పరీక్షలు ఉండటంతో ప్రిపేర్‌ అయ్యేందుకు ఈ నెల 1న రాత్రి 8 గంటలకు మెడికల్‌ కళాశాలకు సంబంధించిన రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్‌లోని రెండో ఫ్లోర్‌లోని తన గదికి వెళ్లాడు. రాత్రి 8.40కు సాయి కుమార్‌ను ఫస్ట్‌ ఫ్లోర్‌కు రమ్మని హరీశ్‌తో పాటు మరికొందరు రెండో సంవత్సరం విద్యార్థులు.. కబురు పంపారు. దీంతో ఫస్ట్‌ ఫ్లోర్‌కు వచ్చిన సాయిని ఫార్మల్‌ డ్రెస్, షూ వేసుకురమ్మనగా అతను అలాగే వేసుకొని వచ్చాడు. ఆ తర్వాత దుస్తులు విప్పించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.

22:05 PM (IST)  •  03 Jan 2022

తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు... ఒమిక్రాన్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుండి 16 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఒమిక్రాన్ దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

18:19 PM (IST)  •  03 Jan 2022

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ 

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి సీఎం జగన్‌ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక  విషయాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించారు. విభజన హామీలు, పోలవరం, జల వివాదాలకు సంబంధించిన అంశాలను ప్రధాని మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget