అన్వేషించండి

Breaking News Live: ఫిబ్రవరి 15న కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
Andhra Pradesh Telangana Breaking News Live Updates Today On 29 January 2022 Breaking News Live: ఫిబ్రవరి 15న కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 
Today-News-Updates

Background

దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ఫలితంగా నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గలేదు కానీ చలి గాలులు మాత్రం రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోవాతావరణం పొడిగా మారడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నేడు వాతావరణం పొడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఉదయం వేళ చలి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో గత రెండు రోజుల మాదిరిగా వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశం నిర్మలమై ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. ఈశాన్య దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు దిగొచ్చాయి.  మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. తాజాగా హైదరాబాద్‌‌లో రూ.350 మేర పతనం కావడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,250కి పడిపోయింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.1,400 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,300 అయింది.

ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారంపై రూ.390 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,250 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,150 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.66,300కు పతనమైంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు క్షీణించాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇదే ధరలతో పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ తొలి నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర కాస్త పెరిగింది. 22 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.91 కాగా, డీజిల్‌పై 20 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 అయింది. 

విజయవాడలో పెట్రోల్‌పై 24 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.61 కాగా, ఇక్కడ డీజిల్ పై 22 పైసలు తగ్గి లీటర్ ధర రూ.96.68 అయింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 70 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.75 అయింది. డీజిల్ పై 65 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.83 కు చేరింది.

నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు దక్కించుకోలేని శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త అందించింది. నేటి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది. ఇందులో ఫిబ్రవరి 1వ తేది నుంచి 15 తేది వరకు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నెల కోటాలో రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తోంది టీటీడీ. కోవిడ్ తీవ్రత తగ్గితే తిరుపతిలో ఫిబ్రవరి 16 నుంచి ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని ప్లాన్ చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి టీటీడీ రద్దు చేసింది. 

17:07 PM (IST)  •  29 Jan 2022

ఫిబ్రవరి 15న పోలీస్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 

బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 15వ తేదీ సీఎం కేసీఆర్  కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ ను నిర్మిస్తోంది. ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయానికి మంచి పేరు సూచించాల్సిందిగా ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలను కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు

12:50 PM (IST)  •  29 Jan 2022

జాబ్ నోటిఫికేషన్స్ డిమాండ్.. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడించిన యూత్ కాంగ్రెస్

తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. యూత్ కాంగ్రెస్ MLA క్వార్టర్స్ ముట్టడి చేసింది. నిరుద్యోగ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు అని నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ తన కుటుంబానికి రాజకీయ నోటిఫికేషన్లు వేశారని, మరి నిరుద్యోగులకు ఎప్పుడు వేస్తారు అని ప్రశ్నించారు. ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మాకు ప్రభుత్వం చేత నోటిఫికేషన్ వేయించడం కష్టం కాదు అని యూత్ కాంగ్రెస్ అంటోంది.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget