అన్వేషించండి

Telangana Elections 2023 : తెలంగాణ ప్రజలకు అమిత్ షా బంపర్ ఆఫర్ - అలా చేస్తే అయోధ్య రాముని దర్శనం ఫ్రీ

Telangana Elections 2023 : తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే అయోధ్య రాముడి దర్శనానికి ఉచితంగా తీసుకెళ్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి సాధ్యమన్నారు.

Telangana Elections 2023 :  తెలంగాణలో బీజేపీకి ఓటు వేసి గెలిస్తే అయోధ్య రాముడి దర్శనం ఉచితం అని హోంమంత్రి అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన గద్వాలలో బహిరంగసభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  పూర్తి ఖర్చులు భరించి అయోధ్య రామాలయ దర్శనానికి తీసుకెళ్తామన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా  బీజేపీ ఇదే  హామీ ఇచ్చింది. మేనిపెస్టోలో పెట్టింది. తెలంగాణలో కూడా అదే  హామీ ఇవ్వడం ఆసక్తికరంగా  మారింది.  

బహిరంగసభలో  బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అని విమర్శలు గుప్పించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అబద్ధాపు ప్రచారాలతో ప్రజలన మోసం చేశారని ఫైర్ అయ్యారు. రూ. 70 కోట్లు జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోడీ ఇచ్చారు, కానీ ఆ డబ్బులను కేసీఆర్ ఖర్చు చేయలేదని ఆరోపించారు. గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్‌ను కేసీఆర్ నిర్మించలేదన్నారు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు.  కేసీఆర్ సర్కార్ బీసీలను మోసం చేసింది, కానీ బీజేపీ తెలంగాణలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ ద్రోహులని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు.. 2జీ, 3జీ, 4జీ పార్టీలని.. తెలంగాణలో ఈ పార్టీలకు విముక్తి కల్పించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని అన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే ఐదేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని అమిత్ హామీ ఇచ్చారు. 
 

ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని..  బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.  డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.  బీఆర్ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైందని..   అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ రికార్డు సృష్టించారని విమర్శఇంచారు.  గుర్రంగడ్డ వంతెనను ఇప్పటికీ పూర్తి చేయలేదు.  గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చేయలేదు. కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామన్న హామీని సైతం నెరవేర్చలేదు.గద్వాలలో చేనేతల కోసం హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ పార్కు నిర్మించలేదు.  గద్వాలలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. 
 

బిజెపి కి అధికారమిస్తే ఐదేళ్లలో యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని..  నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని గుర్తు చేశారు.  ఓవైసీకి లొంగిపోయి సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టలేదన్నారు. అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు.  ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Embed widget