అన్వేషించండి

Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABP Southern Rising Summit 2024: విద్య, వైద్య, సాగునీటి, టెక్నాలజీ అన్ని రంగాల్లో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వ హయాంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ABP Southern Rising Summit 2024 | కాంగ్రెస్ హయాంలో భాక్రాంనంగల్, నాగార్జున ప్రాజెక్టుల నుంచి అభివృద్ధి కోసం ఎన్నో  ప్రాజెక్టులను కట్టామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్యా వ్యవస్థలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ ఈవెంట్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి అనంతరం కీలక ప్రసంగం చేశారు. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ హయాంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదికి మేలు జరిగింది, కానీ ఎన్డీయే హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తెలుగు వారి ఠీవి పీవీ నరసింహారావు

ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావో తో ఎన్నో మార్పులు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలని చర్యలు చేపట్టారు. రాజీవ్ గాంధీ హయాంలో ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు మార్చారు. కంప్యూటర్లతో ఐటీ విప్లవం తీసుకురావడంతో పాటు టెలికాం రంగంలో మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహాత్మగాంధీ ఆలోచనల ప్రకారం స్థానిక సంస్థల్లో అధికారాలను కల్పించిన ఘనత తమదేనన్నారు. పీవీ నరసిహారావు దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలు అందించిన గొప్పవ్యక్తి. తెలంగాణకు చెందిన పీవీ ఎల్పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తో కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన తెలుగు ఠీవి పీవీ నరసింహారావు అని రేవంత్ కొనియాడారు. నెహ్రూ నుంచి ఇందిరావరకు ప్రతి ఒక్కరికి మౌలిక అవసరాలు తీర్చాలని ప్రయత్నం చేశారు. తరువాత 30 ఏళ్లు టెక్నాలజీ, టెలికాం ఇతర రంగాల్లో కాంగ్రెస్, యూపీఏ సేవలు అందించింది.  

కాంగ్రెస్, యూపీఏ హయాంలో ఎన్నో విప్లమాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్, యూపీఏ హయాంలో చేసిన సేవల్ని గుర్తుచేసిన రేవంత్.. ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టారు. ఆయన హయాంలో దేశానికి ఏం సేవలు చేశారు, ఎవరికి ప్రయోజనం చేకూర్చారని సదరన్ రైజింగ్ సమ్మిట్ వేదికగా ప్రశ్నించారు. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం చేశారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు పనిచేశారు కానీ ప్రజలకు మాత్రం ప్రధాని మోదీ పార్టీ ఏం చేయలేదన్నారు. 

గతంలో నార్త్ ఇండియా నుంచి ప్రధాని అయితే, సౌత్ ఇండియా నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించింది. కానీ ప్రధాని మోదీ హయాంలో ఇలాంటి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. అందుకే దక్షిణాది నుంచి నీలం సంజీవరెడ్డి, అబ్దుల్ లాంటి వాళ్లు రాష్ట్రపతి అయ్యారు. కానీ ఎన్డీయే హయాంలో  కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రధాని మోదీ పార్టీ ప్రయత్నాలు చేసింది కానీ దక్షిణాదికి చేసిందేమీ లేదని ఆరోపించారు. దక్షిణాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది, కానీ ఇప్పుడు ఎన్డీయే మాత్రం మా నుంచి పన్నులు పెద్ద ఎత్తున తీసుకుంది, తిరిగి ఇచ్చింది ఏమీ లేదంటూ మండిపడ్డారు.

 'కేంద్ర ప్రభుత్వానికి మేం ఓ రూపాయి పంపిస్తే.. మాకు 40  పైసలు తిరిగి పంపిస్తోంది. అదే ఉత్తరప్రదేశ్ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే వాళ్లకు 7 రూపాయలు వెనక్కి వస్తున్నాయి. బిహార్‌కి కూడా రూ.6 వస్తున్నాయి. నార్త్ కన్నా దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి ఎక్కువ ట్యాక్స్ వెళ్తోందని అందరికీ తెలుసన్నారు. కానీ కేంద్రం నుంచి మనకు వచ్చేది మాత్రం తక్కువే. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం మాత్రం దక్షిణాది రాష్ట్రాలన్ని పట్టించుకోవడం లేదు. ప్రధాని మోదీ ఉత్తరాదికి చెందిన వ్యక్తి కావడమే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget