అన్వేషించండి

Aasara Pensions Hike: ఏపీ తరహాలో తెలంగాణలో పింఛన్ల పెంపు, జగన్ సక్సెస్ అయ్యారు: కేసీఆర్

Aasara Pensions: ఆసరా పింఛన్ లబ్దిదారులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఏపీ తరహాలోనే తెలంగాణలో ఆసరా పింఛన్లను పెంచనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్: ఆసరా పింఛన్ లబ్దిదారులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఏపీ తరహాలోనే తెలంగాణలో ఆసరా పింఛన్లను పెంచనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అందిస్తున్న రూ.2016 పింఛన్లను రూ.5000 పెంచుతామని ఆదివారం స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పెన్షన్ ను ఒకటేసారి రూ.5 వేలకు పెంచుతామని ప్రజలను తాము మోసం చేయడం లేదన్నారు. 
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ ను రూ.2000 నుంచి ప్రతి ఏడాది రూ.250 చొప్పున  పెంచుతూ రూ.3000 చేసి అక్కడ విజయవంతంగా కొనసాగిస్తున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా చూసేందుకు తెలంగాణలో సైతం ప్రతి ఏడాది కొంతమేర పింఛన్ సాయాన్ని పెంచుకుంటూ పోతామని స్పష్టం చేశారు. 

కేసీఆర్ మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ స్కీమ్ అని, మొదటగా రూ.1000 చేశాం. అదే విధంగా పెంచుతూ కంటిన్యూ చేస్తున్నాం. ఆసరా పింఛన్ ను రూ.2016 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నాం. అయితే ఒకటేసారి రూ.5 వేలకు పెంచుతామని చెప్పడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది అంటే వచ్చే మార్చి తరువాత రూ.3000 కు పెంచుతాం. అదే విధంగా ప్రతి ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో ఏడాదికి పింఛన్ ను రూ.5000 చేస్తామని వివరించారు. ప్రభుత్వం మీద ఒకటేసారి ఆర్థిక భారం పడకుండా పెన్షనర్లకు సైతం సాయం పెంచుతూ పోతామన్నారు.

పొరుగు రాష్ట్రం ఏపీలో జగన్ ప్రభుత్వం రూ.2 వేల నుంచి పింఛన్ ను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది రూ.250 పెంచుతూ చివరికి పింఛన్ మొత్తాన్ని మూడు వేలు చేస్తామని చెప్పి విజయవంతంగా అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో అయితే ఏడాదికి రూ.500 మేర ఆసరా పింఛన్ పెరుగుతుందన్నారు. 

దివ్యాంగులకు శుభవార్త..
దివ్యాంగుల పెన్ష‌న్‌ను ఇటీవ‌ల రూ. 4 వేలు చేసినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని రూ.6 వేల రూపాయాల‌కు తీసుకెళ్తాం అన్నారు. రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల 35 వేల కుటుంబాల్లో దివ్యాంగులు ఉన్నారని, వారికి సైతం మార్చి త‌ర్వాత రూ. 5 వేల‌కు చేస్తాం అన్నారు. . ప్ర‌తి సంవ‌త్స‌రం 250 పెంచుతూ, చివరగా ఐదో సంవ‌త్స‌రం రూ. 6 వేలు పింఛన్ అందిస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.

రెండుసార్లు విజయం సాధించి అధికారం చేపట్టిన కేసీఆర్ హ్యాట్రిక్‌ లక్ష్యంగా బీఆర్ఎస్ సంక్షేమ మేనిఫెస్టోను రూపొందించారు. ప్రజలందరికీ ఐదు లక్షల కేసీఆర్ బీమా కల్పిస్తామని ప్రకటించారు.  వచ్చే ఏప్రిల్ నుంచి తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం ఇస్తాం.  ప్రస్తుతం ఎకరానికి అందిస్తున్న రూ.10 వేల రైతు బంధు సాయాన్ని మొదట రూ.12 వేలకు పెంచి, ఆపై ఏడాకి వెయ్యి చొప్పును పెంచుతూ రూ.16 వేలకు రైతు బంధు సాయం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మి  పేరుతో అర్హులైన మహిళలకు నెలకు మూడు వేలభృతి ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన ప్రజలకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్‌ ఇస్తామన్నారు. అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు సైతం నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అందించాలని ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget