అన్వేషించండి

KTPS: పాల్వంచ కేటీపీఎస్‌లో 8 కూలింగ్ టవర్ల కూల్చివేత - 3 దశల్లో ప్రక్రియ సాగిందిలా!

Telangana News: కొత్తగూడెం పాల్వంచ కేటీపీఎస్‌లోని ఓఅండ్ఎం కర్మాగారంలో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చేశారు. 3 దశల్లో కూల్చివేత ప్రక్రియను చేపట్టారు.

Cooling Towers Dismatled In Palwancha KTPS: విద్యుత్ కర్మాగారంలో కాలం చెల్లిన కూలింగ్ టవర్స్‌ను అధికారులు కూల్చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లోని ఓఅండ్ఎం కర్మాగారంలో 8 టవర్ల ప్రస్థానం ముగియగా వాటిని అధునాతన టెక్నాలజీ సాయంతో నేలమట్టం చేశారు. ఉమ్మడి ఏపీలో తొలి విద్యుత్ వెలుగులు అందించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) లో కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు భావించారు. కాలం చెల్లడంతో 2020 ఏప్రిల్ 11న ఈ కర్మాగారం మూతపడింది. దీంతో 2023, జనవరి 18 నుంచి కర్మాగారానికి సంబంధించి టవర్ కూల్చివేత పనులు మొదలయ్యాయి. 

3 దశల్లో ప్రక్రియ

టవర్ల కూల్చివేత ప్రక్రియకు సంబంధించి, అందులోని మెటీరియల్ తీసుకునే విధంగా హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్ట్ కంపెనీ రూ.465 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ట్రాన్స్ కో, జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన తర్వాత టవర్లను కూల్చేశారు. దాదాపు 30 మంది సిబ్బంది సుమారు నెల రోజులు ఈ కూల్చివేత సన్నాహాలు చేశారు. 3 దశల్లో ఈ ప్రక్రియ సాగింది. తొలుత 'ఎ' స్టేషన్‌లోని 102 మీటర్ల ఎత్తు కలిగిన 4 కూలింగ్ టవర్లను కూల్చివేయగా.. అనంతరం 115 మీటర్ల ఎత్తుగల 4 టవర్లను 2 దశల్లో నేలమట్టం చేశారు. ఇంప్లోషిన్ అనే పేలుడు పదార్థాన్ని కూల్చివేత కోసం వినియోగించారు. టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేసిన అనంతరం కేటీపీఎస్‌కు ఉపయోగపడనుంది. 1965 - 67 నుంచి 78 వరకూ దశలవారీగా నిర్మించిన ఏ, బీ, సీ పవర్ స్టేషన్లలో 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం ఈ కూలింగ్ టవర్స్ నిర్మించారు. కాగా, టవర్ల కూల్చివేత సమయంలో ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో 2 గంటలపాటు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు.

Also Read: Mulugu News: సీపీఆర్ చేసి ఊపిరి పోసిన కానిస్టేబుల్స్ - బలమైన గాయం ప్రాణం తీసింది

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget