By: ABP Desam | Updated at : 03 Aug 2021 05:07 PM (IST)
భారత మార్కెట్లోకి రెడ్ మీ తొలి ల్యాప్ టాప్
షియోమి సబ్బ్రాండ్ రెడ్మీ తన మొట్టమొదటి ల్యాప్టాప్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ ల్యాప్టాప్లను 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసే ఉద్యోగులకు, ఈ–లెర్నింగ్లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయలు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు రెడ్మీ స్పష్టం చేసింది. 2019 నుంచి చైనా మార్కెట్లో ఈ ల్యాప్టాప్లను విక్రయిస్తోంది. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి వీటిని విడుదల చేసింది.
వర్క్ ఫ్రంహోం చేసే ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్ కోసం రెడ్ మీ బుక్ ప్రో, ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులకు రెడ్ మీ ఈ-బుక్ ఈ లెర్నింగ్ ఎడిషన్ డిజైన్ చేశారు. ఈ రెండింటిలో స్పెసిఫికేషన్లు చూద్దాం..
రెడ్మీ బుక్ ప్రో లో 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇస్తున్నారు. విండోస్ 10 ఓఎస్తో పనిచేస్తుంది. సిస్సర్ మెకానిజమ్ కీ బోర్డు ఇస్తున్నారు. దీని సాయంతో యూజర్ మరింత సౌకర్యవంతంగా, సులభంగా, వేగంగా టైప్ చెయ్యొచ్చు. అలానే ఈ ల్యాప్టాప్లో 100సెంటీమీటర్ ట్రాక్పాడ్ అమర్చారు. ఇది విండోస్ ప్రిసెషన్ డ్రైవర్స్, మల్టీ-టచ్ ఇన్పుట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5 11వ జనరేషన్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది 4.4 గిగాహెడ్జ్ స్పీడ్తో ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ను అందిస్తుంది. 8జీబీ డీడీఆర్4 ర్యామ్ /512జీబీ ఎస్ఎస్డీ హార్డ్డిస్క్ ఇస్తున్నారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, రెండు యూఎస్బీ 3.2 జెన్1, ఒక యూస్బీ 2.0, హెచ్డీఎమ్ఐ, గిగాబైట్ ఈథర్నెట్, 3.5 ఎమ్ఎమ్ ఆడియోజాక్ పోర్టులు ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ కేవలం 12 సెకన్లలో బూట్ అవుతుంది. అలానే 25 సెకన్లలో రీబూట్ అవుతుందని రెడ్మీ తెలిపింది. ఆన్లైన్ మీటింగ్, వీడియో కాల్స్ కోసం 720 పిక్సెల్ వెబ్ కెమెరా ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్స్, డీటీఎస్ ఆడియోతో రెండు 2వాట్ స్పీకర్స్ ఉన్నాయి. రెడ్మీ బుక్ ప్రో ల్యాప్టాప్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం, 50 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందట. ఈ ల్యాప్టాప్ ధర రూ. 49,999.
రెడ్మీ బుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ ల్యాప్టాప్ కూడా విండోస్ 10 ఓఎస్తో పనిచేస్తుంది. 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇస్తున్నారు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ3 11వ జనరేషన్ ప్రాసెసర్ను ఉపయోగించారు. సిస్సర్ మెకానిజమ్ కీ బోర్డు అమర్చారు. 720 పిక్సెల్ హెచ్డీ వెబ్ కెమెరా ఇస్తున్నారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, రెండు యూఎస్బీ 3.2 జెన్1, ఒక యూస్బీ 2.0, హెచ్డీఎమ్ఐ, గిగాబైట్ ఈథర్నెట్, 3.5 ఎమ్ఎమ్ ఆడియోజాక్ పోర్టులు ఉన్నాయి. ల్యాప్టాప్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. రెండు వేరియంట్లలో ఈ ల్యాప్టాప్ను తీసుకొచ్చారు.
రెడ్మీ భారతీయ పీసీ మార్కెట్లోకి ప్రవేశిస్తుండటంతో ఇప్పటికే హవా కొనసాగిస్తున్న హెచ్పి, లెనెవో, డెల్, ఏసర్ వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీనివ్వనుంది.
Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?
Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?
Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?
BGMI 2.9 Update Release Date: మోస్ట్ అవైటెడ్ బీజీఎంఐ 2.9 అప్డేట్ వచ్చింది - వావ్ అనిపిస్తున్న కొత్త గేమ్ప్లే!
Google Chrome: ఈ ఫోన్లు ఉపయోగిస్తున్నారా? - అయితే ఇక క్రోమ్ పని చేయదు!
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>