అన్వేషించండి

Redmi 11 Prime 5G: ఒకే రోజు మూడు బడ్జెట్ ఫోన్లు లాంచ్ చేయనున్న షావోమీ - 5జీ మొబైల్ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ.

రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ కానుంది. రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ ఫోన్ కూడా లాంచ్ కానుంది. అంటే రెడ్‌మీ 11 ప్రైమ్‌లో 5జీ, 4జీ వేరియంట్లు కూడా మనదేశంలో లాంచ్ కానున్నాయన్న మాట. అమెజాన్‌లో ఈ ఫోన్ సేల్‌కు వెళ్లనుంది. దీనికి సంబంధించిన లైవ్ పేజీని కూడా అమెజాన్‌లో చూడవచ్చు.

రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ
రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

ఇందులో వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించనున్నారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. బ్లాక్, మింట్ గ్రీన్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీలో టియర్ డ్రాప్ తరహా డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.

వీటితో పాటు రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది. రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉండనుంది. కానీ ప్రాసెసర్ పేరు మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ద్వారా ‘క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్’ అందించనుందని షావోమీ ప్రకటించింది. అంటే ఎటువంటి యూజర్ ఇంటర్ ఫేస్ లేకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో రెడ్‌మీ ఏ1 లాంచ్ కానుందన్న మాట.

సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన లాండింగ్ పేజ్ కూడా కంపెనీ వెబ్‌సైట్లో చూడవచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. కనీసం మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గతంలో ఎంఐ ఏ-సిరీస్‌లో ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు రెడ్‌మీ ఏ-సిరీస్‌లో వస్తున్నాయి.

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ మోడల్ ధరను రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ పని చేయనుంది. 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌‌ను రెడ్‌మీ నోట్ 11ఎస్ఈలో అందించారు . 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!
OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget