(Source: Poll of Polls)
Oppo A17: ఆండ్రాయిడ్ 12తో ఒప్పో కొత్త ఫోన్ - రూ.10 వేలలోనే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్ ఏ17ను మలేషియాలో లాంచ్ చేసింది.

ఒప్పో ఏ17 స్మార్ట్ ఫోన్ మలేషియాలో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా అందించారు.
ఒప్పో ఏ17 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర 599 మలేషియన్ రింగెట్లుగా (సుమారు రూ.10,600) నిర్ణయించారు. లేక్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. త్వరలో మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఒప్పో ఏ17 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ను ఈ ఫోన్లో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్ను మరో 4 జీబీ పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
స్టోరేజ్ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?నin
View this post on Instagram
ట్రెండింగ్ వార్తలు






















