అన్వేషించండి

Internet Usage in India: 2014 తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం - భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు!

Internet Broadband Connections in India: భారతదేశంలో గత పది సంవత్సరాల్లో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది.

Mobile Internet Broadband Connections in India: దేశంలో మొబైల్ కనెక్షన్లు, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగం నిరంతరం పెరుగుతోంది. గత 10 సంవత్సరాలలో దేశంలో మొత్తం టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్ర సమాచార ప్రసారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ మేరకు పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు.

గత దశాబ్ద కాలంలో మొత్తం టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఎంత వరకు పెరిగాయని లోక్ సభ సభ్యులు కృష్ణ ప్రసాద్ తెన్నేటి, వై.ఎస్. అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఈ కాలంలో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ ఎంత వరకు పెరిగింది? ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఎంత పెరిగాయని కూడా అడిగారు.

దీనిపై రాష్ట్ర సమాచార ప్రసారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ స్పందిస్తూ 2014 మార్చి 31వ తేదీ నాటికి వరకు 93.3 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు ఉండగా, 2024 మార్చి 31వ తేదీ నాటికి వాటి సంఖ్య 119.87 కోట్లకు పెరిగిందన్నారు. ఈ కాలంలో మొత్తం వృద్ధి రేటు 28.48 శాతంగా ఉంది. ఈ డేటా 2014 నుంచి 2024 వరకు టెలికాం సర్వీస్ పనితీరు సూచికలపై ట్రాయ్ త్రైమాసిక నివేదిక నుంచి తీసుకున్నారు.

Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?

10 ఏళ్లలో బాగా పెరిగిన కలెక్షన్లు!
అదే సమయంలో 2014 మార్చి 31వ తేదీ వరకు దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 90.45 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి 116.59 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో వృద్ధి రేటు 28.90 శాతంగా ఉంది. ప్రభుత్వం తెలుపుతున్న దాని ప్రకారం 2014 మార్చి 31వ తేదీ నాటికి ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్ 25.16 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి ఏకంగా 95.44 కోట్లకు పెరిగింది. ఈ విభాగంలో వృద్ధి రేటు 279.33 శాతంగా ఉంది.

బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్ 2014 మార్చి 31వ తేదీ నాటికి 6.09 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి 92.41 కోట్లకు పెరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా స్వీకరించే వాటిలో టెలికాం రంగం కూడా ఒకటి. 

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Embed widget