అన్వేషించండి

Wrestlers Protest: న్యాయం కావాలంటే వెళ్లాల్సింది కోర్టుకు - రెజ్లర్లపై బ్రిజ్‌ భూషణ్‌ సెటైర్లు!

Wrestlers Protest: హరియాణాకు చెందిన అథ్లెట్లు, వారి సంరక్షకులు భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విశ్వాసంతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అన్నారు.

Wrestlers Protest: 

హరియాణాకు చెందిన అథ్లెట్లు, వారి సంరక్షకులు భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విశ్వాసంతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అన్నారు. కేవలం ఒకే ఒక్క రెజ్లింగ్‌ కుటుంబం మాత్రమే జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అయినా.. న్యాయం కావాలంటే న్యాయస్థానానికి వెళ్లాలి కానీ జంతర్‌ మంతర్‌కు కాదని విమర్శించారు. ఇదంతా దీపిందర్ హుడా కోసం చేస్తున్నారని ఆరోపించారు.

తనపై లైంగిక ఆరోపణలు చేసిన అమ్మాయిలు ఒకే అఖాడాకు చెందినవారని బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Sharan Singh) అన్నారు. దానిని కాంగ్రెస్‌ నేత దీపిందర్‌ హుడా నడిపిస్తున్నారని చెప్పారు. '90 శాతానికి పైగా రెజ్లర్లు, సంరక్షకులు భారత రెజ్లింగ్‌ సమాఖ్యను విశ్వసిస్తున్నారు. ఒకే అఖాడాకు చెందిన కొన్ని కుటుంబాలు, అమ్మాయిలు నాపై లైంగిక ఆరోపణలు చేశారు. దానిని నడిపిస్తున్నది దీపిందర్ హుడా' అని ఆయన పేర్కొన్నారు.

'జంతర్‌ మంతర్‌ వద్ద మీకు న్యాయం దొరకదు. నిజంగా న్యాయం కావాలంటే మీరు పోలీస్‌ స్టేషన్‌, కోర్టుకు వెళ్లాలి. ఇప్పటి వరకు వాళ్లు ఆ పని చేయలేదు. కోర్టు ఏం చెప్పినా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అని బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అన్నారు.

ఆందోళన చేపట్టిన రెజ్లర్లకు రాజకీయ నాయకులు కొందరు మద్దతు తెలిపారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా, ప్రాంతీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు జంతర్‌ మంతర్‌కు వచ్చి మాట్లాడారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాత్రం రాలేదు. ఇదే విషయాన్ని బ్రిజ్ భూషణ్‌ను విలేకరులు ప్రశ్నించగా...

'అఖిలేశ్‌ యాదవ్‌కు నిజమేంటో తెలుసు. చిన్నప్పట్నుంచీ మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రెజ్లర్లు, వారి కుటుంబాలకు సమాజ్‌వాదీ పార్టీ ఐడియాలజీ తెలుసు. వారు నన్ను నేతాజీ అంటారు. వాళ్ల నేతాజీ ఎలాంటి వారో వాళ్లకు తెలుసు' అని బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అన్నారు.

బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదవ్వడంతో రెజ్లర్లు ఇక ఆందోళన వీడి ప్రాక్టీస్‌కు వెళ్లాలని మాజీ రెజ్లర్ యోగేశ్వర్‌ దత్‌ అన్నారు. బ్రిజ్‌భూషణ్‌ ఆరోపణలపై  ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీలో ఆయన ఒకరు. 'రెజర్లు మూడు నెలల క్రితమే ఈపని చేయాల్సింది. ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ అయింది. ఇప్పటికైన ప్రాక్టీస్‌పై దృష్టి పెడితే మంచిది. దేశ ప్రధాన మంత్రికి సైతం శిక్షించే అధికారం లేదు. కోర్టులో ఆ పని చేస్తాయి' అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget