అన్వేషించండి

Virat Kohli: టీమ్‌ఇండియా కోసం నా టార్గెట్‌ అదేనంటున్న కోహ్లీ!

Virat Kohli: దేశానికి ఆసియాకప్‌, ప్రపంచకప్‌ అందించడమే తన లక్ష్యమని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అంటున్నాడు. అందుకు ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించాడు.

Virat Kohli: దేశానికి ఆసియాకప్‌, ప్రపంచకప్‌ అందించడమే తన లక్ష్యమని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)  అంటున్నాడు. అందుకు ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించాడు. త్వరలోనే పరుగుల వరద పారిస్తానన్న ధీమా వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ప్యారిస్‌లో ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు సెంచరీ కొట్టి మూడేళ్లు అవుతోంది. ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీసులోనూ అతడు రాణించలేదు. ఫామ్‌ లేమితో బాధపడుతున్న జట్టు అండగా నిలిచింది. అయితే మానసికంగా కాస్త విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావించారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీసులకు ఎంపిక చేయలేదు.

ఆగస్టులో టీమ్‌ఇండియా ఆసియాకప్‌ ఆడుతుంది. అక్టోబర్‌-నవంబర్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తలపడుతుంది. ఈ రెండింటినీ గెలవాలంటే విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం అత్యవసరం. ఒకవేళ అతడు గనక ఇబ్బంది పడితే జట్టుకు భారంగా మారతాడు. ప్రొఫెషనల్‌ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగుల చేసిన అతడిని జట్టు నుంచి తప్పించడం అంత సులభం కాదు. పైగా అతనుంటే ప్రత్యర్థులకు ఒక రకమైన భయం ఉంటుంది. అందుకే అతడు ఫామ్‌ అందుకోవడం ముఖ్యం. అయితే జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని విరాట్‌ అంటున్నాడు.

'ఆసియా కప్‌, ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను గెలిపించడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకు జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను' అని అతడు స్టార్‌స్పోర్ట్స్‌కు తెలిపాడు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని స్టార్‌ ట్వీట్‌ చేసింది. 

ఇంటర్నేషనల్‌ క్రికెట్లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) 2019, నవంబర్‌ 13న చివరి సెంచరీ కొట్టాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన గులాబి టెస్టులో శతకబాదాడు. 136 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది 70వ శతకం. ఆ తర్వాత సిరీసులోనే ఒకట్రెండు శతకాలు బాదేసి రికీ పాంటింగ్‌ 71 సెంచరీల రికార్డు బద్దలు కొట్టేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇప్పుడు మూడేళ్లు గడుస్తున్నాయి. ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసాయే తప్ప విరాట్‌ బ్యాటు నుంచి వంద రాలేదు.

ఇప్పటి వరకు 102 టెస్టులాడిన కోహ్లీ 50 సగటుతో 8074 పరుగులు చేశాడు. 262 వన్డేల్లో 57 సగటుతో 12344, 99 టీ20ల్లో 50 సగటుతో 3308 రన్స్‌ సాధించాడు. రెండు ఫార్మాట్లలో కలిసి 70 సెంచరీలు కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఏటా 2000 రన్స్‌ చేసే కింగ్‌ కోహ్లీ 2020లో 842, 2021లో 964, 2022లో 459 మాత్రమే సాధించాడు. అతడు త్వరగా ఫామ్‌ అందుకోవాలని అభిమానులు, టీమ్‌ఇండియా కోరుకుంటోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Embed widget