అన్వేషించండి

Legends League Cricket 2022: గంభీర్‌, సెహ్వాగ్‌ డిష్యూం డిష్యూం! లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తలపడుతున్న దిగ్గజాలు

క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. సెప్టెం బర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి.

Legends League Cricket 2022: క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. దిగ్గజాల ఆటను మరోసారి వీక్షించేందుకు సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో అంటే సెప్టెంబర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. 

ఎన్ని జట్లంటే

ఈ లీగ్ లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ జట్లు తలపడనున్నాయి. 

కెప్టెన్స్

ఇండియా క్యాపిటల్స్ - గౌతం గంభీర్
గుజరాత్ జెయింట్స్ -  వీరేంద్ర సెహ్వాగ్
మణిపాల్ టైగర్స్   -  హర్భజన్ సింగ్
భిల్వారా కింగ్స్  -  ఇర్ఫాన్ పఠాన్

సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు 20 రోజులపాటు అలరించనున్నాయి. 17వ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా క్యాపిటల్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 18న లక్నోలో మణిపాల్ టైగర్స్- భిల్వారా కింగ్స్ పోటీపడనున్నాయి.

లెజెండ్ లీగ్ క్రికెట్ ఫార్మాట్

లీగ్ దశలో 12 మ్యాచులు ఉంటాయి. టోర్నీలో ఉన్న 4 జట్లు ఒక్కో జట్టు మరో దానితో రెండు సార్లు తలపడతాయి. మ్యాచుకు మ్యాచుకు మధ్య 4 రోజుల విశ్రాంతి ఉంటుంది. లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ కు చేరుకుంటాయి. 

లీగ్ దశ ముగిసే సమయానికి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు అక్టోబర్ 2న జోధ్‌పూర్‌లోని బర్కతుల్లా ఖాన్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్‌లో ఆడతాయి. ఇందులో విజేత నేరుగా అక్టోబర్ 5న జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుకు ఇంకో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్ లో మూడో స్థానంలో నిలిచిన జట్టుతో గెలిస్తే ఫైనల్ కు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 3న జరుగుతుంది. 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే సెప్టెంబర్ 25న ఇండియా క్యాపిటల్స్- గుజరాత్ జెయింట్ ల మధ్య జరిగే మ్యాచ్, ఇంకా అక్టోబర్ 2న జరిగే క్వాలిఫైయర్ మ్యాచులు సాయంత్రం 4.00 గంటలకు జరుగుతాయి. 

ఈ మ్యాచులు సోనీ లివ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంకా స్టార్ స్పోర్ట్స్ టీవీలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. 

ఎల్ ఎల్ సీ మ్యాచులు జరిగే వేదికలు

లీగ్ మ్యాచులు కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, కటక్, జోధ్ పూర్ లలో జరుగుతాయి. మొదటి క్వాలిఫయర్ జోధ్‌పూర్‌లో జరగనుంది. ఎలిమినేటర్ మరియు ఫైనల్‌కు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తారు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ కోసం టిక్కెట్లు ఇలా పొందవచ్చు.

మ్యాచ్‌ల టిక్కెట్లు బుక్ మై షో అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 16న ఇండియా మహారాజాస్- వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగే ప్రత్యేక బెనిఫిట్ మ్యాచ్ టికెట్లు కూడా అభిమానుల కోసం అందుబాటులో ఉంచారు. 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 పూర్తి షెడ్యూల్

  • శుక్రవారం, 16 సెప్టెంబర్- ప్రత్యేక మ్యాచ్: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
  • శనివారం, 17 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
  • ఆదివారం, 18 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (7:30 pm; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
  • సోమవారం, 19 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
  • బుధవారం, 21 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
  • గురువారం, 22 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
  • శనివారం, 24 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
  • ఆదివారం, 25 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (సాయంత్రం 4:00; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
  • సోమవారం, 26 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
  • మంగళవారం, 27 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
  • గురువారం, 29 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
  • శుక్రవారం, 30 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30 బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
  • శనివారం, 1 అక్టోబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
  • ఆదివారం, 2 అక్టోబర్- క్వాలిఫైయర్ (ర్యాంక్ 1 vs ర్యాంక్ 2) (రాత్రి 4 గంటలకు; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
  • సోమవారం, 3 అక్టోబర్- ఎలిమినేటర్ (ర్యాంక్ 3 vs లూజర్ ఆఫ్ Q1) ( రాత్రి 7:30 , వేదిక ప్రకటించాల్సి ఉంది.)
  • బుధవారం, 5 అక్టోబర్- ఫైనల్ (క్వాలిఫైయర్ విజేత vs ఎలిమినేటర్ విజేత) (రాత్రి 7:30 వేదిక ప్రకటించాల్సి ఉంది.)

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Thrilling Victory: తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో సత్తా చాటిన తెలుగు ప్లేయర్.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ.. 
తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Padma Awards: ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
Ind Vs Eng 2nd T20 Updates: సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Thrilling Victory: తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో సత్తా చాటిన తెలుగు ప్లేయర్.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ.. 
తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Padma Awards: ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
Ind Vs Eng 2nd T20 Updates: సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?
పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?
Karimnagar News: మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan on Amazon: ఏడాది తర్వాత గిఫ్ట్ కార్డుల ఎక్స్‌పైర్ - అమెజాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి
ఏడాది తర్వాత గిఫ్ట్ కార్డుల ఎక్స్‌పైర్ - అమెజాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి
Telangana News: ఫార్ములా ఈ-కారు రేసు కేసు విచారణలో కీలక మలుపు-మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం
ఫార్ములా ఈ-కారు రేసు కేసు విచారణలో కీలక మలుపు-మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం
Embed widget