అన్వేషించండి

India vs Sri Lanka 2021: మరో హోటల్‌కి కృనాల్ పాండ్య... ఆటగాళ్లందరికీ నెగటివ్ రిపోర్టు...ఈ రోజే రెండో T20

భారత క్రికెటర్లందరికీ RT-PCR టెస్టుల కోసం మంగళవారమే శాంపిల్స్ తీసుకున్నారు. తాజాగా వాటి రిజల్ట్ వచ్చాయి. అందరికీ నెగిటివ్ వచ్చింది.

భారత్-శ్రీలంక మధ్య మంగళవారం జరగాల్సిన రెండో T20 కొద్ది గంటల ముందు అనూహ్యంగా ఆగిపోయింది. భారత ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో కృనాల్ పాండ్యకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య టీ20 బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

భారత క్రికెటర్లందరికీ RT-PCR టెస్టుల కోసం మంగళవారమే శాంపిల్స్ తీసుకున్నారు. తాజాగా వాటి రిజల్ట్ వచ్చాయి. అందరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే జట్టు మేనేజ్‌మెంట్ సిబ్బంది కృనాల్ పాండ్యను మరో హోటల్‌కి తరలించారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెటర్ బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా తెలిపారు. 

కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన 8 మంది సభ్యులకు కూడా కరోనా రిపోర్టులో నెగిటివ్ రిజల్టే వచ్చాయి. కానీ, ముందు జాగ్రత్త కోసం భారత్ ఈ 8మందిని కూడా ఈ రోజు మ్యాచ్‌లో ఆడించడంలేదు. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్లో సుమారు ఆరు మార్పులు జరిగే అవకాశం ఉంది. 

బుధవారం, గురువారాల్లో రెండు T20లు ఆడిన తర్వాత ఈ నెల 30న టీమిండియా తిరిగి భారత్ చేరుకోనుంది. జట్టుతో పాటు కృనాల్ భారత్ వచ్చే పరిస్థితి లేదు. అతడు క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆ తర్వాత నిర్వహించే RT-PCR పరీక్షలో నెగిటివ్ వచ్చిన వెంటనే అతడు భారత్‌కు వస్తాడు. అప్పటి వరకు అతడు అక్కడే ఉంటాడు. 

షా, సూర్య ఆలస్యం
ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌‌లు అక్కడికి వెళ్లేందుకు ఆలస్యమయ్యేట్ల ఉంది. కృనాల్‌కు పాజిటివ్ రావడంతో ఇప్పుడు వీరిద్దరూ బుడగలో ఉండాలి. మామూలుగా అయితే వీరిద్దరూ లంక పర్యటన ముగియగానే ఇంగ్లాండ్ బయలుదేరాల్సి ఉంది. కానీ, ఇప్పుడు కృనాల్‌కు పాజిటివ్ రావడంతో వీరు కొద్ది రోజులు ఆలస్యంగా ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. 

ఈ రోజు శ్రీలంకతో జరిగే రెండో T20 లో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి. కృనాల్ స్థానం కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది. తొలి T20కి రెండో మ్యాచ్‌కి జట్టులో బాగానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి శ్రీలంక టూర్‌కి భారీ జట్టునే భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. 20 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు స్టాండ్ బై నెట్ బౌలర్లు కూడా ప్రస్తుతం లంకలో టీమ్‌తో ఉన్నారు. దీంతో.. కృనాల్ పాండ్యాతో పాటు 8 మంది టీమ్‌కి దూరమైనా.. మ్యాచ్ ఆడగలిగే టీమ్ అక్కడ ఉంది. కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న ఆ 8 మంది పేర్లని మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్ గోప్యంగా ఉంచుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Amritha Aiyer: అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Elon Musk: ఎలాన్ మస్కే తన బిడ్డకు తండ్రి అంటున్న యువతి -  స్పందించని టెస్లా చీఫ్
ఎలాన్ మస్కే తన బిడ్డకు తండ్రి అంటున్న యువతి - స్పందించని టెస్లా చీఫ్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.