అన్వేషించండి

India vs Sri Lanka 2021: మరో హోటల్‌కి కృనాల్ పాండ్య... ఆటగాళ్లందరికీ నెగటివ్ రిపోర్టు...ఈ రోజే రెండో T20

భారత క్రికెటర్లందరికీ RT-PCR టెస్టుల కోసం మంగళవారమే శాంపిల్స్ తీసుకున్నారు. తాజాగా వాటి రిజల్ట్ వచ్చాయి. అందరికీ నెగిటివ్ వచ్చింది.

భారత్-శ్రీలంక మధ్య మంగళవారం జరగాల్సిన రెండో T20 కొద్ది గంటల ముందు అనూహ్యంగా ఆగిపోయింది. భారత ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో కృనాల్ పాండ్యకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య టీ20 బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

భారత క్రికెటర్లందరికీ RT-PCR టెస్టుల కోసం మంగళవారమే శాంపిల్స్ తీసుకున్నారు. తాజాగా వాటి రిజల్ట్ వచ్చాయి. అందరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే జట్టు మేనేజ్‌మెంట్ సిబ్బంది కృనాల్ పాండ్యను మరో హోటల్‌కి తరలించారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెటర్ బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా తెలిపారు. 

కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన 8 మంది సభ్యులకు కూడా కరోనా రిపోర్టులో నెగిటివ్ రిజల్టే వచ్చాయి. కానీ, ముందు జాగ్రత్త కోసం భారత్ ఈ 8మందిని కూడా ఈ రోజు మ్యాచ్‌లో ఆడించడంలేదు. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్లో సుమారు ఆరు మార్పులు జరిగే అవకాశం ఉంది. 

బుధవారం, గురువారాల్లో రెండు T20లు ఆడిన తర్వాత ఈ నెల 30న టీమిండియా తిరిగి భారత్ చేరుకోనుంది. జట్టుతో పాటు కృనాల్ భారత్ వచ్చే పరిస్థితి లేదు. అతడు క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆ తర్వాత నిర్వహించే RT-PCR పరీక్షలో నెగిటివ్ వచ్చిన వెంటనే అతడు భారత్‌కు వస్తాడు. అప్పటి వరకు అతడు అక్కడే ఉంటాడు. 

షా, సూర్య ఆలస్యం
ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌‌లు అక్కడికి వెళ్లేందుకు ఆలస్యమయ్యేట్ల ఉంది. కృనాల్‌కు పాజిటివ్ రావడంతో ఇప్పుడు వీరిద్దరూ బుడగలో ఉండాలి. మామూలుగా అయితే వీరిద్దరూ లంక పర్యటన ముగియగానే ఇంగ్లాండ్ బయలుదేరాల్సి ఉంది. కానీ, ఇప్పుడు కృనాల్‌కు పాజిటివ్ రావడంతో వీరు కొద్ది రోజులు ఆలస్యంగా ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. 

ఈ రోజు శ్రీలంకతో జరిగే రెండో T20 లో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి. కృనాల్ స్థానం కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది. తొలి T20కి రెండో మ్యాచ్‌కి జట్టులో బాగానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి శ్రీలంక టూర్‌కి భారీ జట్టునే భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. 20 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు స్టాండ్ బై నెట్ బౌలర్లు కూడా ప్రస్తుతం లంకలో టీమ్‌తో ఉన్నారు. దీంతో.. కృనాల్ పాండ్యాతో పాటు 8 మంది టీమ్‌కి దూరమైనా.. మ్యాచ్ ఆడగలిగే టీమ్ అక్కడ ఉంది. కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న ఆ 8 మంది పేర్లని మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్ గోప్యంగా ఉంచుతోంది. 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
CM Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
Allu Arjun: అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
CM Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
Allu Arjun: అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Viral News: ఏం గుండెరా అది.. తాను ప్రేమించిన యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న మరో యువకుడు
ఏం గుండెరా అది.. తాను ప్రేమించిన యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న మరో యువకుడు
Embed widget