అన్వేషించండి

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ - ఐపీఎల్‌కు బుమ్రా దూరం?

ఐపీఎల్ సీజన్ మొత్తానికి జస్‌ప్రీత్ బుమ్రా దూరం అవుతాడని వార్తలు వస్తున్నాయి.

Indian Premier League 2023: భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ మైదానంలోకి వస్తాడని క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్‌లో అతను తిరిగి ఫిట్‌గా ఉంటాడని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అతను మొత్తం సీజన్‌కు దూరంగా ఉండవచ్చు.

జస్‌ప్రీత్ బుమ్రా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. కొంతకాలంగా అక్కడ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో అతను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో ఆడతాడని భావించారు. కానీ సెలెక్టర్లు అతని ఫిట్‌నెస్ ఆధారంగా ఎటువంటి రిస్క్ చేయడానికి ధైర్యం చేయలేదు. అందుకే తనను జట్టులోకి తీసుకోలేదు.

గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్‌కు ముందు అతను ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఆడాడు, కానీ ఆ తర్వాత వెన్ను గాయం కారణంగా అతను తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి సుమారు ఎనిమిది నెలలు గడిచాయి, అతని ఫిట్‌నెస్ గురించి వస్తున్న నివేదికల ప్రకారం అతను IPL 2023 సీజన్ కోసం జట్టులోకి తిరిగి వస్తాడని భావించారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం అతను ఈ మొత్తం సీజన్‌కు కూడా దూరంగా ఉండవచ్చు.

బుమ్రా నిష్క్రమణ ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ
జస్‌ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్‌లో చాలా ముఖ్యమైన భాగం. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ. అతని నిష్క్రమణ ప్రభావం జట్టు బౌలింగ్ ఆర్డర్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో అతని స్థానంలో ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం ఫ్రాంచైజీకి అంత తేలికైన పని కాదు. అయితే జట్టుకు శుభవార్త ఏమిటంటే గత సీజన్‌లో ఫిట్‌గా లేనందున మొత్తం సీజన్‌కు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్, రాబోయే సీజన్‌లో ఫాస్ట్ బౌలింగ్ దాడికి నాయకత్వం వహించడం చూడవచ్చు.

ఐపీఎల్ 2023 సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ తన మొదటి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌తో తమ ఐపీఎల్ పోటీని ప్రారంభించనుంది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ తన రెండో మ్యాచ్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మూడో మ్యాచ్ ఆడనుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Embed widget