IPL 2024: పంత్ పేరిట అరుదైన రికార్డు
Rishabh Pant: : ఐపీఎల్లో ఢిల్లీ వారియర్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ బంతుల్లో 3 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Rishabh Pant Record: ఐపీఎల్ 2024 లో ఢిల్లీ వారియర్స్(DC) కెప్టెన్ రిషబ్ పంత్( Rishabh Pant) అరుదైన రికార్డు సృష్టించారు. ఐపీఎల్లో అతి తక్కువ బంతుల్లో మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ 3వేల పరుగుల మార్క్ను పంత్ కేవలం 2028 బంతుల్లోనే అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో శుక్రవారం నాటి మ్యాచ్లో 41 పరుగులు చేసి, ఈ రికార్డును నెలకొల్పాడు. స్టోయినిస్ వేసి 12 ఓవర్లలో చివరి బంతిని బౌండరికి తరలించిన పంత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. రిషబ్ ఐపిఎల్ లో ఇప్పటివరకు 104 మ్యాచులో 34 సగటుతో 3032 పరుగులు చేశాడు.
అతని తర్వాతి స్థానంలో యూసుఫ్ పఠాన్ (2062), సూర్యకుమార్ యాదవ్ (2130), సురేశ్ రైనా (2135), మహేంద్ర సింగ్ ధోనీ (2152) ఉన్నారు. అలాగే అతి చిన్న వయసులో 3వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా పంత్ (26 ఏళ్ల 191 రోజులు) మూడో స్థానంలో నిలిచాడు. అతనికంటే ముందు శుభ్మన్ గిల్ (24 ఏళ్ల 215 రోజులు), విరాట్ కోహ్లీ (26 ఏళ్ల 186 రోజులు) ఈ ఫీట్ను సాధించారు.
పంత్ ప్రయాణం ఓ అద్భుతం
Before You Go
India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















