కాదు, తాను పారిపోవడం లేదని లలిత్ మోడీ పేర్కొన్నారు. తనపై బలమైన కేసు ఉంటే, 17 ఏళ్లలోనే కోర్టుకు వెళ్లేవాడినని ఆయన అన్నారు.
Lalit Modi Interview:"నేను, మోదీ చాలా క్లోజ్, త్వరలోనే భారత్ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్
Lalit Modi Interview:లలిత్ మోడీ భారత్ తిరిగి వస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తూ, "నా స్నేహితుల్లో చాలా మంది అధికారంలో ఉన్నారు..." అని అన్నారు. మోదీ తనకు చాలా క్లోజ్ అని చెప్పారు.

- లలిత్ మోడీ తాను పారిపోలేదని, భారత న్యాయ ప్రక్రియను ప్రశ్నించారు.
- ఐపీఎల్ తన బిడ్డని, మోదీతో క్రికెట్ చర్చలు మాత్రమేనని తెలిపారు.
- మోదీ స్టేడియం పునర్నిర్మాణంపై, ప్రపంచస్థాయి మౌలిక వసతుల ఆకాంక్ష వెలిబుచ్చారు.
Lalit Modi Interview:పరారీలో ఉన్న లలిత్ మోడీ, భారత్కు తిరిగి రావడం, చట్టపరమైన విషయాల గురించి కూడా ఏఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "నేను పారిపోవడం లేదు. ఈ రోజు నా స్నేహితులలో చాలా మంది అధికారంలో ఉన్నారని చెప్పాను, కానీ నేను సహాయం కోసం ఎవరికీ ఎప్పుడూ ఫోన్ చేయలేదు" అని అన్నారు. నేను మోదీ చాలా క్లోజ్గా ఉండే వాళ్లమని ఎప్పుడూ క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకునే వాళ్లమని వివరించారు.
ఐపీఎల్ మాజీ ఛైర్మన్, పరారీలో ఉన్న లలిత్ మోడీ, భారతదేశానికి తిరిగి రావడం, చట్టపరమైన విషయాలతో సహా పలు అంశాలపై ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనపై బలమైన కేసు ఉంటే, తాను కోర్టుకు వెళ్లేవాడినని పేర్కొన్నారు. లలిత్ మోడీ భారత న్యాయ ప్రక్రియను కూడా ప్రశ్నించారు. "నేను ఏ చట్టం నుంచీ పారిపోవడం లేదు. నాపై పక్కా కేసు ఉండి ఉంటే, అది 17 ఏళ్లలోపే కోర్టుకు చేరి ఉండేది." ఇప్పటి వరకు తనపై ఎలాంటి క్రిమినల్ శిక్ష పడలేదని ఆయన పేర్కొన్నారు. "నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, చర్య తీసుకుని ఉండేవారు."
#WATCH | On the 'fugitive' tag, IPL founder and first chairman Lalit Modi says, "I'm not running at all... The Indian government has a long arm. You can't take on the government of India. And I don't intend to, and I don't want to... Not a single case against me has been… pic.twitter.com/zwqALNoY1g
— ANI (@ANI) June 4, 2026
పరారీలో ఉన్న లలిత్ మోడీ తన సమస్య భారత ప్రభుత్వంతో కాదని, న్యాయ ప్రక్రియలోని నెమ్మదితోనే ఉందని పేర్కొన్నారు. చాలా కేసుల్లో నిజం బయటపడటానికి సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నాడు. నెమ్మదైన న్యాయ ప్రక్రియే ఒక శిక్షగా మారుతుందని అన్నారు.
ఐపీఎల్ నా బిడ్డ వంటిది
#WATCH | On the Godfrey Phillips case, IPL founder and first chairman Lalit Modi says, "It's unfortunate. My father built a great company... It's in court, and unfortunately, we don't meet eye to eye as far as my mother and I are concerned... If they were to enforce this trust… pic.twitter.com/gnjGAm8ebB
— ANI (@ANI) June 4, 2026
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఐపీఎల్ గురించి మాట్లాడుతూ, "వ్యవస్థ అంగీకరించినా, అంగీకరించకపోయినా, నేను ఈ ఆటను, లీగ్ను చాలా నిశితంగా చూస్తున్నాను." "ఈ రోజు నా ప్రాధాన్యత నా కుటుంబం, నా పిల్లలే. నా వల్ల, వారు ఊహించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఐపీఎల్ కూడా నాకు బిడ్డతో సమానం" అని అన్నారు.
అధికార పార్టీతో తనకున్న సాన్నిహిత్యం గురించి లలిత్ మోదీ మాట్లాడుతూ, "ఈ రోజు నా స్నేహితుల్లో చాలా మంది అధికారంలో ఉన్నారు, కానీ నేను సహాయం కోసం ఎవరికీ ఫోన్ చేయలేదు. 17 ఏళ్లలో, నా స్వలాభం కోసం నేను ఏ రాజకీయ సంబంధాలను ఉపయోగించుకోలేదు." అని అన్నారు. "నేను కోరుకుంటే చాలా మందికి ఫోన్ చేసి ఉండొచ్చు, కానీ నేను ఎవరినీ సహాయం అడగలేదు." అని తెలిపారు.
Also Read: ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో నయా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గొప్ప క్రికెట్ అభిమానిగా మాజీ ఐపీఎల్ ఛైర్మన్,క్రికెట్ నిర్వాహకుడు లలిత్ మోడీ అభివర్ణించారు. తనకు, ప్రధాని మోదీకి మధ్య జరిగే చర్చల్లో ఎక్కువ భాగం అహ్మదాబాద్లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఉండేవని అన్నారు. గుజరాత్లో క్రికెట్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవారని చెప్పారు.
"మా సంభాషణలు కేవలం క్రికెట్ గురించే ఉండేవి," అని లలిత్ మోడీ అన్నారు, "నరేంద్ర మోదీ క్రికెట్ అభిమాని. ఆయనకు అహ్మదాబాద్లోని క్రికెట్ మౌలిక సదుపాయాలపై ఆసక్తి ఉండేది, మా చర్చలు క్రికెట్కే పరిమితమయ్యాయి." "నేను నరేంద్ర మోదీకి సన్నిహితంగా ఉండేవాడిని, కానీ ఆ సాన్నిహిత్యం క్రికెట్ విషయంలోనే కానీ రాజకీయాల విషయంలో కాదు." అని స్పష్టం చేశారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం గురించి ఇటీవల చేసిన ప్రకటనల తర్వాత లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు . అవకాశం ఇస్తే, ప్రేక్షకులకు మెరుగైన వీక్షణా అనుభవాన్ని అందించడానికి ఆ స్టేడియంను కూల్చివేసి తిరిగి నిర్మిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియంలలో ఒకటిగా పరిగణించే ఈ మైదానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
'నేను స్టేడియంను విమర్శించలేదు'
తాను స్టేడియంను విమర్శించలేదని, భారత క్రీడా మౌలిక సదుపాయాల కోసం ఒక పెద్ద దార్శనికత గురించి మాట్లాడుతున్నానని లలిత్ మోడీ అన్నారు. "ఈ రోజు ఇది భారత్లోనే అత్యుత్తమ స్టేడియం, కానీ అది సరిపోదు. నేను దానిని కూల్చివేస్తానని చెప్పాను. నేను దానిని కూల్చివేయడం గురించి మాట్లాడితే, ఇతర స్టేడియంలను కూడా కూల్చివేయాల్సి వస్తుంది. ఈ రోజు ఇది భారత్లోనే అత్యుత్తమ స్టేడియం అని నేను స్పష్టంగా చెప్పాను. కానీ నేను అంతర్జాతీయ స్థాయి అభిమానుల అనుభవాన్ని అందించాలనుకుంటే, నేను దానిని కూడా పునర్నిర్మిస్తాను." అని పేర్కొన్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి నేడు ఉన్న ఆర్థిక శక్తి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా మైదానాలకు దీటుగా దేశంలో స్టేడియాలను నిర్మించాలని లలిత్ అన్నారు. "ఈ రోజు వెంబ్లీ స్టేడియం, లార్డ్స్, బార్సిలోనా క్యాంప్ నౌ, మాంచెస్టర్ యునైటెడ్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ సిటీ ఎతిహాద్ స్టేడియంలను చూడండి. అవన్నీ మన స్టేడియాల కంటే ఎంతో ఉత్తమమైనవి. ఈ రోజు బీసీసీఐ వద్ద గతంలో కంటే ఎక్కువ డబ్బు ఉంది, కాబట్టి మనం మరింత పెద్ద స్థాయిలో ఆలోచించాలి." అని సూచించారు.
Before You Go
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Frequently Asked Questions
లలిత్ మోడీ తాను పారిపోతున్నానని ఒప్పుకుంటున్నారా?
భారత న్యాయ ప్రక్రియపై లలిత్ మోడీ అభిప్రాయం ఏమిటి?
భారత న్యాయ ప్రక్రియ నెమ్మదిగా ఉందని, అదే తన సమస్య అని లలిత్ మోడీ అన్నారు. నెమ్మదైన న్యాయమే శిక్షగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
లలిత్ మోడీకి ఐపీఎల్ అంటే ఎంత ముఖ్యం?
ఐపీఎల్ తన బిడ్డతో సమానమని లలిత్ మోడీ అన్నారు. ఈ లీగ్ను తాను చాలా నిశితంగా చూస్తున్నానని ఆయన తెలిపారు.
లలిత్ మోడీ, ప్రధాని మోదీల మధ్య సంభాషణలు దేని గురించి ఉండేవి?
వారి మధ్య జరిగే సంభాషణలు అహ్మదాబాద్లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మాత్రమే ఉండేవని లలిత్ మోడీ వివరించారు. ప్రధాని మోదీ క్రికెట్ అభిమాని అని ఆయన చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















