అన్వేషించండి

IPL 2025 ఫైనల్ ముగింపు వేడుకల్లో ఇండియన్ ఆర్మీకి గ్రేట్ ట్రిబ్యూట్.. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సెలబ్రేషన్స్

IPL 2025 ముగింపు కార్యక్రమం నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ ముందు జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ జరుపుకుంటారు, సైన్యానికి నివాళులు అర్పిస్తారు.

IPL 2025 Final Celebration: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుక నిర్వహిస్తారు. ఈ ముగింపు వేడుకల్లో ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తారు. అదే విధంగా భారతీయ త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతారు.

IPL 2025 లీగ్ స్టేజ్ పూర్తి కావొచ్చింది. మే 29 నుండి కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మే 29న పంజాబ్ లోని ముల్లంపూర్‌లో జరిగే క్వాలిఫైయర్ 1 విజేతగా నిలిచిన ఐపీఎల్ మొదటి ఫైనలిస్ట్ అవుతుంది. ఆ తర్వాత మే 30న ముల్లంపూర్‌లోనే ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. అది గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 ఆడటానికి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. క్వాలిఫయర్ 1 లో ఓడిన జట్టుతో, ఎలిమినేటర్ విజేత తలపడతాయి. 

జూన్ 1న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ 2 జరుగుతుంది. ఆ మ్యాచ్ గెలిచిన జట్టు రెండవ ఫైనలిస్ట్ అవుతుంది. టైటిల్ పోరు జూన్ 3న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుక నిర్వహిస్తారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని IPL ఫైనల్‌ వేడుకల్లో సెలబ్రేట్ చేస్తారు. అందుకోసం BCCI కొందరు ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది.

ముగింపు వేడుకలకు ఆర్మీ ప్రతినిధులు

 ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జరుపుకోవడానికి ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ దళాల చీఫ్‌లను, రక్షణ సిబ్బందికి చెందిన ప్రముఖులను బీసీసీఐ ఆహ్వానించింది.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఓ నేపాలీ సహా 26 మంది మరణించారు. తరువాత, భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది.  పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి, వారి పౌరులకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుని ఉగ్రస్థావరాలు నేలమట్టం చేసింది. అయినా పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో అమాయక పౌరులపై కాల్పులకు దిగింది. డ్రోన్ దాడులు సైతం చేసింది. అయితే భారత బలగాలు ఆ డ్రోన్లను ఛేదించడంతో పాటు పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసి ధ్వంసం చేశాయి..

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా IPL 2025ని వారం రోజులు తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. మే 17వ తేదీన ఐపీఎల్ సీజన్ రీస్టార్ట్ చేశారు. విదేశాలకు వెళ్లిన చాలా మంది ఆటగాళ్ళు IPL ఆడటానికి భారతదేశానికి తిరిగి వచ్చారు.

టైటిల్ పోటీలో ఈ నాలుగు జట్లు ఉన్నాయి

IPL సీజన్ 18 టైటిల్ కోసం ఇప్పుడు 4 జట్లు ప్లే ఆఫ్ చేరాయి. 6 జట్లు ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించాయి. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌ ఆడనున్నాయి. లీగ్ లో చివరి మ్యాచ్ ఆర్సీబీ, లక్నోల మధ్య జరగనుంది. తర్వాత పంజాబ్‌తో క్వాలిఫైయర్ 1లో ఏ జట్టు ఆడాలి, ఏ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అనేది తేలనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
Embed widget