అన్వేషించండి

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

IPL 2023: ఇక నుంచి ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల (IPL Franchises) సొంతమని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు. క్రికెటర్ల వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ వారిదేనని పేర్కొన్నాడు.

IPL 2023, Rohit Sharma: 

ఇక నుంచి ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల (IPL Franchises) సొంతమని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు. క్రికెటర్ల వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ వారిదేనని పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అందరూ ఫిట్‌గా ఉండటం ముఖ్యమన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), రిషభ్ పంత్‌, జస్ప్రీత్‌ వంటి క్రికెటర్లు గాయాల పాలవ్వడం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు.

'ఇప్పట్నుంచి ఫ్రాంచైజీలదే బాధ్యత. ఆటగాళ్లు ఇప్పుడు వారి సొంతం. మేం వారికి కొన్ని సూచనలు చేశాం. ఎంత వరకు ఆడించాలో లక్ష్మణ రేఖ గీశాం. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది ఫ్రాంచైజీలే. మరీ ముఖ్యంగా ఆటగాళ్లు. ఎందుకంటే వారి దేహ రక్షణకు వారిదే బాధ్యత. వారంతా పెద్దోళ్లే. అలసటగా అనిపిస్తే మాట్లాడి 1-2 మ్యాచులకు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే చేస్తారని అనుకుంటున్నా' అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు.

'ఆటగాళ్ల గాయాలు ఆందోళనకు గురిచేస్తాయన్నది నిజమే. ప్లేయింగ్‌ లెవన్‌లో ఉండే క్రికెటర్లను ఇప్పటికే మిస్సవుతున్నాం. అందరూ అందుబాటులో ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. మేం వారి పనిభారం నిర్వహణపై దృష్టి సారించాం. కొందరికి కచ్చితంగా రెస్ట్‌ ఇవ్వడం మీరు చూస్తూనే ఉన్నారు. మేం మా చేతనైంత వరకు చేస్తున్నాం. అయితే కుర్రాళ్లు ఎందుకు గాయపడుతున్నారో కచ్చితంగా చెప్పేందుకు నేనేమీ స్పెషలిస్టును కాదు. ప్రపంచకప్‌నకు 15 మందిని పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంచేందుకు మా మెడికల్‌ టీమ్స్‌ పనిచేస్తున్నాయి' అని రోహిత్‌ తెలిపాడు.

'ఎక్కువ క్రికెట్‌ ఆడితే  గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. అందుబాటులో ఉన్నవారితోనే జట్టును బరిలోకి దించుతున్నాం. మన చేతుల్లో లేని వాటిని కంట్రోల్‌ చేయలేం. ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌ ఆడాలనే కోరుకుంటున్నారు. వారిని సురక్షితంగా ఉంచేందుకు సపోర్ట్‌ స్టాఫ్‌ ఎంతో శ్రమిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు గాయాలు అవుతూనే ఉంటాయి. శ్రేయస్‌ అయ్యరే ఇందుకు ఉదాహరణ. రోజంతా కూర్చున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌ ఆడబోయి గాయపడ్డాడు. వీటిని కంట్రోల్‌ చేసేందుకే ప్రయత్నిస్తున్నాం' అని రోహిత్‌ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ (54: 72 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 2019 తర్వాత భారత్ స్వదేశంలో సిరీస్ కోల్పోయింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే భారత్‌ను ఓడించింది.

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget