అన్వేషించండి

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

IPL 2023: ఇక నుంచి ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల (IPL Franchises) సొంతమని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు. క్రికెటర్ల వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ వారిదేనని పేర్కొన్నాడు.

IPL 2023, Rohit Sharma: 

ఇక నుంచి ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల (IPL Franchises) సొంతమని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు. క్రికెటర్ల వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ వారిదేనని పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అందరూ ఫిట్‌గా ఉండటం ముఖ్యమన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), రిషభ్ పంత్‌, జస్ప్రీత్‌ వంటి క్రికెటర్లు గాయాల పాలవ్వడం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు.

'ఇప్పట్నుంచి ఫ్రాంచైజీలదే బాధ్యత. ఆటగాళ్లు ఇప్పుడు వారి సొంతం. మేం వారికి కొన్ని సూచనలు చేశాం. ఎంత వరకు ఆడించాలో లక్ష్మణ రేఖ గీశాం. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది ఫ్రాంచైజీలే. మరీ ముఖ్యంగా ఆటగాళ్లు. ఎందుకంటే వారి దేహ రక్షణకు వారిదే బాధ్యత. వారంతా పెద్దోళ్లే. అలసటగా అనిపిస్తే మాట్లాడి 1-2 మ్యాచులకు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే చేస్తారని అనుకుంటున్నా' అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు.

'ఆటగాళ్ల గాయాలు ఆందోళనకు గురిచేస్తాయన్నది నిజమే. ప్లేయింగ్‌ లెవన్‌లో ఉండే క్రికెటర్లను ఇప్పటికే మిస్సవుతున్నాం. అందరూ అందుబాటులో ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. మేం వారి పనిభారం నిర్వహణపై దృష్టి సారించాం. కొందరికి కచ్చితంగా రెస్ట్‌ ఇవ్వడం మీరు చూస్తూనే ఉన్నారు. మేం మా చేతనైంత వరకు చేస్తున్నాం. అయితే కుర్రాళ్లు ఎందుకు గాయపడుతున్నారో కచ్చితంగా చెప్పేందుకు నేనేమీ స్పెషలిస్టును కాదు. ప్రపంచకప్‌నకు 15 మందిని పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంచేందుకు మా మెడికల్‌ టీమ్స్‌ పనిచేస్తున్నాయి' అని రోహిత్‌ తెలిపాడు.

'ఎక్కువ క్రికెట్‌ ఆడితే  గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. అందుబాటులో ఉన్నవారితోనే జట్టును బరిలోకి దించుతున్నాం. మన చేతుల్లో లేని వాటిని కంట్రోల్‌ చేయలేం. ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌ ఆడాలనే కోరుకుంటున్నారు. వారిని సురక్షితంగా ఉంచేందుకు సపోర్ట్‌ స్టాఫ్‌ ఎంతో శ్రమిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు గాయాలు అవుతూనే ఉంటాయి. శ్రేయస్‌ అయ్యరే ఇందుకు ఉదాహరణ. రోజంతా కూర్చున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌ ఆడబోయి గాయపడ్డాడు. వీటిని కంట్రోల్‌ చేసేందుకే ప్రయత్నిస్తున్నాం' అని రోహిత్‌ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ (54: 72 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 2019 తర్వాత భారత్ స్వదేశంలో సిరీస్ కోల్పోయింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే భారత్‌ను ఓడించింది.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget