అన్వేషించండి

మ్యాచ్‌లు

IPL 2023: రెస్ట్‌ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్‌!

IPL 2023: ఇక నుంచి ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల (IPL Franchises) సొంతమని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు. క్రికెటర్ల వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ వారిదేనని పేర్కొన్నాడు.

IPL 2023, Rohit Sharma: 

ఇక నుంచి ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల (IPL Franchises) సొంతమని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు. క్రికెటర్ల వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ వారిదేనని పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అందరూ ఫిట్‌గా ఉండటం ముఖ్యమన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), రిషభ్ పంత్‌, జస్ప్రీత్‌ వంటి క్రికెటర్లు గాయాల పాలవ్వడం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు.

'ఇప్పట్నుంచి ఫ్రాంచైజీలదే బాధ్యత. ఆటగాళ్లు ఇప్పుడు వారి సొంతం. మేం వారికి కొన్ని సూచనలు చేశాం. ఎంత వరకు ఆడించాలో లక్ష్మణ రేఖ గీశాం. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది ఫ్రాంచైజీలే. మరీ ముఖ్యంగా ఆటగాళ్లు. ఎందుకంటే వారి దేహ రక్షణకు వారిదే బాధ్యత. వారంతా పెద్దోళ్లే. అలసటగా అనిపిస్తే మాట్లాడి 1-2 మ్యాచులకు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే చేస్తారని అనుకుంటున్నా' అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు.

'ఆటగాళ్ల గాయాలు ఆందోళనకు గురిచేస్తాయన్నది నిజమే. ప్లేయింగ్‌ లెవన్‌లో ఉండే క్రికెటర్లను ఇప్పటికే మిస్సవుతున్నాం. అందరూ అందుబాటులో ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. మేం వారి పనిభారం నిర్వహణపై దృష్టి సారించాం. కొందరికి కచ్చితంగా రెస్ట్‌ ఇవ్వడం మీరు చూస్తూనే ఉన్నారు. మేం మా చేతనైంత వరకు చేస్తున్నాం. అయితే కుర్రాళ్లు ఎందుకు గాయపడుతున్నారో కచ్చితంగా చెప్పేందుకు నేనేమీ స్పెషలిస్టును కాదు. ప్రపంచకప్‌నకు 15 మందిని పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంచేందుకు మా మెడికల్‌ టీమ్స్‌ పనిచేస్తున్నాయి' అని రోహిత్‌ తెలిపాడు.

'ఎక్కువ క్రికెట్‌ ఆడితే  గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. అందుబాటులో ఉన్నవారితోనే జట్టును బరిలోకి దించుతున్నాం. మన చేతుల్లో లేని వాటిని కంట్రోల్‌ చేయలేం. ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌ ఆడాలనే కోరుకుంటున్నారు. వారిని సురక్షితంగా ఉంచేందుకు సపోర్ట్‌ స్టాఫ్‌ ఎంతో శ్రమిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు గాయాలు అవుతూనే ఉంటాయి. శ్రేయస్‌ అయ్యరే ఇందుకు ఉదాహరణ. రోజంతా కూర్చున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌ ఆడబోయి గాయపడ్డాడు. వీటిని కంట్రోల్‌ చేసేందుకే ప్రయత్నిస్తున్నాం' అని రోహిత్‌ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ (54: 72 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 2019 తర్వాత భారత్ స్వదేశంలో సిరీస్ కోల్పోయింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే భారత్‌ను ఓడించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
My Dear Donga Trailer: ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
AR Rahman - Subhash Ghai: నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
Embed widget