CSK Auction Strategy And Decisions: ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
ఐపీఎల్ 2026 పాయింట్ల టేబుల్ లో ఎనిమిదో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలం వ్యూహాలు, మ్యాచ్ మేనేజ్మెంట్ లో దారుణంగా ఫెయిలయిందని రవిచంద్రన్ అశ్విన్ విమర్శించాడు.

CSK Auction Strategy And Decisions Under Scanner Post IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ లో మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు తీవ్ర నిరాశే మిగిలింది. పాయింట్ల టేబుల్ లో ఎనిమిదో ప్లేస్ కే పరిమితమై ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. టోర్నమెంట్ లో సంజూ శాంసన్ లాంటి ప్లేయర్స్ సాలిడ్ పర్ఫార్మెన్స్ తో ఆశలు రేపినా, ఓవరాల్ గా 14 మ్యాచుల్లో 12 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. ఈ దారుణమైన ఫెయిల్యూర్ పై సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో సీరియస్ గా స్పందించాడు. సంజూ శాంసన్, అకీల్ హొసేన్, అన్షుల్ కాంబోజ్ ఎఫర్ట్స్ ను మెచ్చుకుంటూనే, మేనేజ్మెంట్ వేలం స్ట్రాటజీలను కంప్లీట్ గా మార్చాలని సూచించాడు.
రెండు తప్పు డెసిషన్స్..
కోట్ల రూపాయలు పెట్టి తప్పుడు ప్లేయర్లను కొనడం వల్లే టీమ్ కాంబినేషన్ దెబ్బతిందని అశ్విన్ విశ్లేషించాడు. వేలం వ్యూహాలను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఫైనల్ చేరిన రెండు టీమ్స్ వెంకటేష్ అయ్యర్, జేసన్ హోల్డర్ లను కేవలం రూ. 7 కోట్లకే దక్కించుకుని సక్సెస్ అయ్యాయని గుర్తు చేశాడు. ఒక్కొక్కరికి రూ. 14 కోట్లు చొప్పున భారీగా ఖర్చు పెట్టే కంటే, ఇలాంటి ఇద్దరు ప్లేయర్లను తీసుకుంటే యూత్, ఎక్స్ పీరియన్స్ పర్ఫెక్ట్ గా కుదిరేదని అభిప్రాయపడ్డాడు. సీఎస్కే ప్లేయర్స్ ఒక టీమ్ లాగా కలవలేకపోయారని, వారికి సరైన రోల్ క్లారిటీ లేకపోవడం మైనస్ అయిందని స్పష్టం చేశాడు.
సీజన్ మధ్యలో గాయాల బెడద..
ఇతర టీమ్స్ కు సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఇంజూరీలు అయితే, సీఎస్కే కి మాత్రం మ్యాచ్ లు మొదలయ్యాక ప్లేయర్స్ గాయపడ్డారని అశ్విన్ గుర్తు చేశాడు. ఎంత ట్రై చేసినా ఆ ఇంజూరీల ప్రెజర్ నుంచి టీమ్ కోలుకోలేకపోయిందని అన్నాడు. అలాగే మ్యాచ్ లలో ప్లేయర్ల ఇన్సర్షన్ పాయింట్లు కూడా తప్పుగా ఇచ్చారని విమర్శించాడు. డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే లాంటి వాళ్లను ఫినిషర్లుగా వాడటం చూస్తే టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాలు ఎంత ఏకపక్షంగా ఉన్నాయో అర్థమవుతోందని ఎండగట్టాడు. ఈ లోపాల వల్లే క్వాలిఫై అవ్వడం ఇంపాజిబుల్ గా మారిందని స్పష్టం చేశాడు.
ఎంఎస్ ధోనీ లేని లోటు..
మరోవైపు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశాడు. 44 ఏళ్ల లెజెండ్ ఎంఎస్ ధోనీ గాయాల వల్ల ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అయినప్పటికీ టీమ్ పై అతడి ఇన్ ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉందని కోచ్ చెప్పాడు. గ్రౌండ్ లో ఆడకపోయినా డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటూ యంగ్ ప్లేయర్లకు గైడెన్స్ ఇవ్వడంలో, టీమ్ లో కంటిన్యూటీని మెయింటైన్ చేయడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. అతడి ప్రెజెన్స్ ఈ ఏడాది టీమ్ కు ఎంతో ఇంపార్టెంట్ గా నిలిచిందని స్పష్టం చేశాడు.
Before You Go
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్పై ఏబీ డివిలియర్స్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు



















