అన్వేషించండి

IND vs SL: కోహ్లీకి షాక్‌! ఇష్టమైన మైదానం నుంచి మారిన వందో టెస్టు వేదిక!

విరాట్‌ కోహ్లీ వందో టెస్టు వేదిక మారనుంది! మొహాలి క్రికెట్‌ మైదానం ఈ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిసింది. బెంగళూరులోని చిన్నసామిలో ఈ మ్యాచ్‌ జరగడం లేదని సమాచారం.

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ వందో టెస్టు వేదిక మారనుంది! మొహాలి క్రికెట్‌ మైదానం ఈ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిసింది. బెంగళూరులోని చిన్నసామిలో ఈ మ్యాచ్‌ జరగడం లేదని సమాచారం.

ప్రస్తుతం టీమ్‌ఇండియా వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసుల్లో తలపడుతోంది. ఇది ముగిసిన వెంటనే లంకేయులు భారత పర్యటనకు వచ్చేస్తారు. రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనున్నారు. కరోనా మహమ్మారి, ఇతర కారణాల వల్ల ఈ షెడ్యూలును రివర్స్‌ చేశారని తెలిసింది. విండీస్‌ సిరీసుకు సైతం అలాగే చేశారు. గతంలో వేర్వేరు వేదికలను ప్రకటించినా ఇప్పుడు వన్డేలను అహ్మదాబాద్‌, టీ20లను కోల్‌కతాలో నిర్వహిస్తున్నారు.

Also Read: టీమ్‌ఇండియా పట్టుదలా? విండీస్‌ ప్రతీకారమా? రెండో వన్డేలో గెలుపెవరిది?

Also Read: టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఓకే! త్వరలోనే సెలక్షన్‌ కమిటీ ప్రకటన

విరాట్‌ కోహ్లీ ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడాడు. వాస్తవంగా అతడు దక్షిణాఫ్రికాలోనే వంద టెస్టుల ఘనత అందుకోవాలి. కానీ వెన్ను నొప్పి కారణంగా మూడింట్లో రెండు టెస్టులే ఆడాడు. దాంతో శ్రీలంక టెస్టు వరకు అభిమానులు ఎదురు చూడాల్సి వస్తోంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో విరాట్‌ కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడే సంగతి తెలిసిందే. అతడికి ఇష్టమైన మైదానాల్లో చిన్నసామి ఒకటి. దాంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. శ్రీలంకతో తొలి టెస్టు అక్కడే జరగాల్సింది. కొత్త షెడ్యూలు ప్రకారం శ్రీలంక మొదట టీ20లు ఆడనుంది. తొలి మ్యాచ్‌కు లక్నో, చివరి రెండు మ్యాచులకు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనుంది. అక్కడి నుంచి రెండు జట్లు పంజాబ్‌ క్రికెట్‌ సంఘానికి చెందిన మొహాలికి వెళ్తాయి. మార్చి 3-7 తొలి టెస్టు ఆడతాయి. ఆ తర్వాత బెంగళూరుకు వచ్చిన చిన్నసామిలో రెండో టెస్టులో తలపడతాయి. అయితే ఈ మ్యాచ్‌ గులాబి బంతితో  డే/నైట్‌లో జరుగుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget