అన్వేషించండి

ICC WTC Final Venue: మూడు సార్లూ ఇంగ్లాండ్‌కే! WTC2 ఫైనల్‌ వేదిక ఓవల్‌

ICC WTC Final Venue: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది.

ICC World Test Championship Finals 2023 2025: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. 2023, జూన్‌లో మ్యాచ్‌ ఉంటుందని వెల్లడించింది. ఇక 2025 ఎడిషన్‌ ఫైనల్‌ను క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. 2023 ఎడిషన్‌ ఫైనల్‌ తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. బహుశా బర్మింగ్‌హామ్‌లో జూన్‌ 16న ఆరంభమయ్యే యాషెస్‌కు ముందే ఉంటుందని తెలుస్తోంది.

ఇంగ్లాండ్‌లోనే 3 ఫైనళ్లు

మొత్తంగా వరుగా మూడు WTC ఫైనళ్లకు ఇంగ్లాండే వేదిక అవుతుండటం గమనార్హం. 2021లో సౌథాంప్టన్‌ వేదికగా జరిగిన ఫైనల్లో టీమ్‌ఇండియాను న్యూజిలాండ్‌ ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. వాస్తవంగా ఈ మ్యాచ్‌ లార్డ్స్‌లో జరగాలి. కరోనా కారణంగా మెరుగైన ఆతిథ్య వసతులు ఉన్న సౌథాంప్టన్‌కు వేదికను తరలించారు. ప్రతి ఎడిషన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌ ఆడతాయి.

ఆసీస్‌తో గట్టిపోటీ

ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఎడిషన్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్‌, పాకిస్థాన్‌ 4, 5 ప్లేసుల్లో కొనసాగుతున్నాయి. ఈ ఎడిషన్‌ ముగిసేందుకు ఇంకా మ్యాచులు మిగిలే ఉన్నాయి. అంటే ఫైనల్‌ చేరేందుకు టీమ్‌ఇండియాకు అవకాశాలు మిగిలే ఉన్నాయి. వాస్తవంగా నెల రోజుల ముందు వరకు దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉండేది. ఇంగ్లాండ్‌ చేతిలో 2-1తో సిరీస్‌ చేజార్చుకోవడంతో కిందకు వెళ్లింది. ఈ సైకిల్‌లో వారికి ఇంకా రెండు సిరీసులు మిగిలే ఉన్నాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో తలపడనుంది. టీమ్‌ఇండియాతో వారికి తీవ్రంగా పోటీ ఉంది. ఎందుకంటే హిట్‌మ్యాన్‌ సేన త్వరలోనే బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా సిరీసుల్లో తలపడనుంది. ఆసీస్‌ ఇంకా 9 మ్యాచులు ఆడనుంది. పాకిస్థాన్‌, శ్రీలంకకు టాప్‌-2లో చేరుకొనే అవకాశం ఉంది.

గొప్ప వేదికలు

'ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను వచ్చే ఏడాది ఓవల్‌లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ వేదికను ఘన వారసత్వం ఉంది. చక్కని వాతావరణం ఉంటుంది' అని ఐసీసీ సీఈవో జెఫ్‌ అలార్డిస్‌ అన్నారు. 'ఆ తర్వాత 2025 ఎడిషన్‌ ఫైనల్‌ను లార్డ్స్‌లో నిర్వహిస్తాం. ఆ వేదిక తుది సమరానికి అసలైన నిర్వచనం ఇస్తుంది' అని ఆయన పేర్కొన్నారు.

ఐపీఎల్‌కు మధ్యలోనే దూరం!

ఐపీఎల్‌ 2023 సీజన్‌ నుంచి ఆసీస్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోవచ్చు. ఇంగ్లాండ్‌ సమ్మర్‌ షెడ్యూలు జూన్ 1 నుంచి ఆరంభమవ్వడమే ఇందుకు కారణం. ఆంగ్లేయులు మొదట ఐర్లాండ్‌తో ఒక టెస్టు ఆడతారు. జూన్‌ 16 నుంచి ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీసులో తలపడతారు. మొదటి మ్యాచ్‌ బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ను మరింత కాలం పొడగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సీజన్లో ఐపీఎల్‌ మే ఆఖరి వరకు జరిగింది. వచ్చే సీజన్లో ఇంకాస్త ఎక్కువ రోజులే జరగొచ్చు. అలాంటప్పుడు ఆసీస్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండరు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Embed widget