అన్వేషించండి

WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే

జూన్ 7 నుంచి 11 వరకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుంది. ఓవల్ వేదికగా జరుగబోయే ఈ టెస్టులో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరంటే..!

WTC Final 2023: రెండేండ్లకోమారు  ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఈనెల 7 నుంచి 11 దాకా  ఇంగ్లాండ్‌లోని ‘ఓవల్’ మైదానం వేదికగా జరుగనుంది.  ఈ మ్యాచ్ కోసం భారత్ - ఆస్ట్రేలియాలు ఇదివరకే లండన్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా ముమ్మరంగా చేస్తున్నాయి. అయితే  ఓవల్‌ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ ఎవరు..? ప్రస్తుత టీమిండియా నుంచి  ఓవల్‌లో మెరుగ్గా ఆడినవారు ఎవరైనా ఉన్నారా..? 

ఓవల్‌లో  అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్  ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్.  మిస్టర్ డిపెండెబుల్.. ఓవల్‌లో  మూడు టెస్టులు ఆడి  443 పరుగులు చేశాడు.  ఇక్కడ ద్రావిడ్ సగటు  110.75 గా ఉంది.   ద్రావిడ్ విషయం పక్కనబెడితే ప్రస్తుత తరంలో ఓవల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్  కెఎల్ రాహుల్. రాహుల్ ఇక్కడ  రెండు మ్యాచ్‌లలో  249 పరుగులు చేయగా రిషభ్ పంత్.. రెండు టెస్టులలో 178 పరుగులు సాధించాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయాల కారణంగా ఈ ఇద్దరూ  ఇప్పుడు  డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం లేదు. 

రాహుల్, పంత్ కాకుండా  ఓవల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ - 3 లో ఉన్నది రవీంద్ర జడేజా,  టీమిండియా సారథి రోహిత్ శర్మ, రన్ మిషీన్ విరాట్ కోహ్లీ. 

జడేజా ఇక్కడ  2 మ్యాచ్‌లు ఆడి  126 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లో కూడా  11 వికెట్లు పడగొట్టాడు.  2018లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో జడేజా.. ఓవల్ లో  జరిగిన టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  ఈ మ్యాచ్‌లో  86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీశాడు.  కానీ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 

 

టీమిండియా సారథి  రోహిత్ శర్మ  ఇక్కడ ఒక టెస్టు ఆడాడు. 2021 ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా  రోహిత్.. ఓవల్ లో జరిగిన టెస్టు (రెండో ఇన్నింగ్స్) లో  సెంచరీ సాధించాడు.  ఈ మ్యాచ్‌లో రోహిత్ 127 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టులలో రోహిత్‌ను ఓపెనర్‌గా నిలబెట్టిన ఇన్నింగ్స్‌లలో ఓవల్ కూడా ఒకటి. 

రన్ మిషీన్ విరాట్ కోహ్లీ  ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడి 169 పరుగులు సాధించాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన కోహ్లీ..  2018లో మాత్రం రాణించాడు. 2021లో కోహ్లీ ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్ లలో  కలిపి 99 పరుగులు చేశాడు. 

టీమిండియాకు అతడి భయం.. 

ఓవల్‌లో టీమిండియా  బ్యాటర్ల  ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంటే  ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ మాత్రం జోరు చూపించాడు.   స్మిత్ ఇక్కడ  ఆరు టెస్టులు ఆడి ఐదు ఇన్నింగ్స్ లలో  391 పరుగులు చేశాడు. ఇందులో రెండు  సెంచరీలు కూడా ఉన్నాయి.   స్మిత్‌ బ్యాటింగ్ సగటు ఓవల్‌లో  97.75గా ఉండటం టీమిండియాను కలవరపెడుతున్నది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Best Foods to Eat Raw : ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
Embed widget