అన్వేషించండి

మ్యాచ్‌లు

WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే

జూన్ 7 నుంచి 11 వరకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుంది. ఓవల్ వేదికగా జరుగబోయే ఈ టెస్టులో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరంటే..!

WTC Final 2023: రెండేండ్లకోమారు  ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఈనెల 7 నుంచి 11 దాకా  ఇంగ్లాండ్‌లోని ‘ఓవల్’ మైదానం వేదికగా జరుగనుంది.  ఈ మ్యాచ్ కోసం భారత్ - ఆస్ట్రేలియాలు ఇదివరకే లండన్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా ముమ్మరంగా చేస్తున్నాయి. అయితే  ఓవల్‌ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ ఎవరు..? ప్రస్తుత టీమిండియా నుంచి  ఓవల్‌లో మెరుగ్గా ఆడినవారు ఎవరైనా ఉన్నారా..? 

ఓవల్‌లో  అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్  ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్.  మిస్టర్ డిపెండెబుల్.. ఓవల్‌లో  మూడు టెస్టులు ఆడి  443 పరుగులు చేశాడు.  ఇక్కడ ద్రావిడ్ సగటు  110.75 గా ఉంది.   ద్రావిడ్ విషయం పక్కనబెడితే ప్రస్తుత తరంలో ఓవల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్  కెఎల్ రాహుల్. రాహుల్ ఇక్కడ  రెండు మ్యాచ్‌లలో  249 పరుగులు చేయగా రిషభ్ పంత్.. రెండు టెస్టులలో 178 పరుగులు సాధించాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయాల కారణంగా ఈ ఇద్దరూ  ఇప్పుడు  డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం లేదు. 

రాహుల్, పంత్ కాకుండా  ఓవల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ - 3 లో ఉన్నది రవీంద్ర జడేజా,  టీమిండియా సారథి రోహిత్ శర్మ, రన్ మిషీన్ విరాట్ కోహ్లీ. 

జడేజా ఇక్కడ  2 మ్యాచ్‌లు ఆడి  126 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లో కూడా  11 వికెట్లు పడగొట్టాడు.  2018లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో జడేజా.. ఓవల్ లో  జరిగిన టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  ఈ మ్యాచ్‌లో  86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీశాడు.  కానీ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 

 

టీమిండియా సారథి  రోహిత్ శర్మ  ఇక్కడ ఒక టెస్టు ఆడాడు. 2021 ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా  రోహిత్.. ఓవల్ లో జరిగిన టెస్టు (రెండో ఇన్నింగ్స్) లో  సెంచరీ సాధించాడు.  ఈ మ్యాచ్‌లో రోహిత్ 127 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టులలో రోహిత్‌ను ఓపెనర్‌గా నిలబెట్టిన ఇన్నింగ్స్‌లలో ఓవల్ కూడా ఒకటి. 

రన్ మిషీన్ విరాట్ కోహ్లీ  ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడి 169 పరుగులు సాధించాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన కోహ్లీ..  2018లో మాత్రం రాణించాడు. 2021లో కోహ్లీ ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్ లలో  కలిపి 99 పరుగులు చేశాడు. 

టీమిండియాకు అతడి భయం.. 

ఓవల్‌లో టీమిండియా  బ్యాటర్ల  ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంటే  ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ మాత్రం జోరు చూపించాడు.   స్మిత్ ఇక్కడ  ఆరు టెస్టులు ఆడి ఐదు ఇన్నింగ్స్ లలో  391 పరుగులు చేశాడు. ఇందులో రెండు  సెంచరీలు కూడా ఉన్నాయి.   స్మిత్‌ బ్యాటింగ్ సగటు ఓవల్‌లో  97.75గా ఉండటం టీమిండియాను కలవరపెడుతున్నది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna at Legend 10Years | పసుపు చీరలో సోనాల్ చౌహాన్..కవిత చెప్పిన బాలకృష్ణ | ABPKTR Angry on Leaders Party Change | పార్టీ మారుతున్న బీఆర్ఎస్ లీడర్లపై కేటీఆర్ ఫైర్ | ABP DesamNandamuri Balakrishna at Legend 10Years | లెజెండ్ రీరిలీజ్ లోనూ 100రోజులు ఆడుతుందన్న బాలకృష్ణ | ABPBIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Embed widget