అన్వేషించండి

India Revenge Plan Against NZ, Aus: ఆసీస్, కివీస్ లకు ధమ్కీ ఇచ్చేందుకు రెడీ- డబ్ల్యూటీసీ షెడ్యూల్లో 2 జట్లతో ఆడనున్న టీమిండియా

డబ్ల్యూటీసీ ఫైనల్ ని ప్రవేశ పెట్టాక తొలిసారి భారత్ ఫైనల్ కు చేరలేక పోయింది. ఇటీవల కివీస్, ఆసీస్ లతో సిరీస్ లు ఓడిపోవడంతో టీమిండియా ముచ్చటగా మూడోసారి ఫైనల్ కు చేరుకోవాలన్న ఆశలు ఆవిరయ్యాయి. 

WTC 227 India Schedule: తాజాగా టెస్టుల్లో తమను ఓడించిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా స్కెచ్ వేసింది. వచ్చే 2027 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు కోసం భారత్ ఆరు సిరీస్ లను ఆడనుంది. రెండేళ్ల కాలంలో మూడేసి సిరీస్ ల చొప్పున ఇంటా, బయటా ఆడనుంది. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔటైన నేపథ్యంలో వచ్చే డబ్ల్యూటీసీ టూర్ షెడ్యూల్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్ పై పూర్తి అవగాహన వచ్చింది. మరోవైపు 2027 వరకు ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్ పదవీ కాలం ఉండటంతో అతను ఈసారి ఎలాంటి ప్లాన్లు వేసి, టీమిండియాను ఫైనల్ కు చేరుస్తాడోనని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

కొన్ స్టాస్ కాచుకో..
ఇటీవల భారత్ తో సిరీస్ సందర్బంగా డెబ్యూ చేసిన ఆసీస్ ఓపెనర్ శామ్ కొన్ స్టాస్ .. ఆ సిరీస్ లో కాస్త ఓవర్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాలుగో టెస్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత ఆటగాళ్లతో కయ్యం పెట్టుకున్న ఈ యంగ్ ప్లేయర్ భారత్ ఎప్పుడెప్పుడు వస్తాడా..? అని భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనికి ముహుర్తం ఖాయమైంది. 2027 జనవరి-ఫిబ్రవరి మాసాల్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడటానికి ఆసీస్ భారత్ కు రానుంది. అప్పటికి జట్టులో కొన్ స్టాస్ కు స్థానముంటే తను కూడా తప్పకుండా ఇండియన్ టూర్ చేయనున్నాడు. తను భారత గ్రౌండ్ లో బరిలోకి దిగితే తమ సత్తా చూపించాలని అటు ఆటగాళ్లు, ఇటు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇక డబ్ల్యూటీసీ 2027 సిరీస్ కు లకు సంబంధించి ఆరు వేర్వేరు ప్రత్యర్థులతో 18మ్యాచ్ లను భారత్ ఆడనుంది. అందులో ఐదేసి చొప్పున ఇంగ్లాండ్, ఆసీస్ లతో ఆడనుంది.

ఇంగ్లాండ్ పర్యటనతో శ్రీకారం..
డబ్ల్యూటీసీ ఫైనల్ 2027 రేసును ఇంగ్లాండ్ పర్యటనతో ఆరంభించనుంది. ఐపీఎల్ 2025 ముగిశాక జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంగ్లాండ్ లో భారత్ పర్యటించనుంది. ఇందులో ఐదు టెస్టులను భారత్ ఆడనుంది. ఇది చాలా కఠినమైన సిరీస్ అనే చెప్పవచ్చు. సొంతగడ్డపై ఇంగ్లాండ్ చాలా బలమైనది. అయితే గత పర్యటనలో భారత్ బాగా పోటీ ఇవ్వడంతో సిరీస్ డ్రా అయింది. ఈసారి కూడా సిరీస్ పోటాపోటీగా జరుగనుందని అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ తర్వాత వెస్టిండస్ తో సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్ ను అక్టోబర్ లో భారత్ ఆడనుంది. ఆ తర్వాతే అదే ఏడాది సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా.. భారత్ తన సొంతగడ్డపై డిసెంబర్ లో అమీ తుమీ తేల్చుకోనుంది. దీంతో ఈ ఏడాదిని ఇండియా ముగుస్తుంది.

ఇక చిత్రంగా 2026లో కేవలం నాలుగు టెస్టులను మాత్రమే భారత్ ఆడనుంది. అందులో తొలుత రెండు టెస్టుల సిరీస్ ను శ్రీలంకలో పర్యటనలో భాగంగా ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టులో జరుగుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ కు పర్యటనకు అక్టోబర్లో వెళ్లే భారత్, అక్కడ కూడా రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. తన సొంతగడ్డపై ఓడించిన కివీస్ ను.. దాని సొంతగడ్డపై ఓడించి రివేంజీ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

ఆ తర్వాత చివరగా ఆసీస్ తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ తో తన డబ్ల్యూటీసీ షెడ్యూల్ ను ముగిస్తుంది. ఈ సిరీస్ ల్లో సత్తా చాటి పాయింట్ల టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ముచ్చటగా మూడోసారి ఫైనల్ కు భారత్ చేరనుంది. ఇక ఈ డబ్ల్యూటీసీ షెడ్యూల్ కాలంలోనే భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా తమ కెరీర్లకు ముగింపు పలికే అవకాశముంది. 

Also Read: Kohli Vs Gambhir: కోహ్లీ వరుసగా అలా ఔటవుతుంటే వారు ఏం చేస్తున్నారు? - యువరాజ్ తండ్రి సూటి ప్రశ్నలు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Maruti Swift Tax Free: మారుతి స్విఫ్ట్ టాక్స్ ఫ్రీ! ఇలా కొనుగోలు చేస్తే వారికి 1.89 లక్షలు ఆదా
మారుతి స్విఫ్ట్ టాక్స్ ఫ్రీ! ఇలా కొనుగోలు చేస్తే వారికి 1.89 లక్షలు ఆదా
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Embed widget