అన్వేషించండి

Shubman Gill: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు- రిషబ్ పంత్ గాయంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక ప్రకటన

Did Rishabh Pant to Play 4th Test against England | వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంపై టీమిండియా కెప్టెన్ కీలక ప్రకటన చేశాడు. అతడ్ని మైదానంలో చూడాలని ఉందన్నాడు.

India vs England 4ht Test: లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. టెయిలెండర్లతో కలిసి రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడినా భారత్‌కు మరో ఓటమి తప్పలేదు. దాంతో సిరీస్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో రెండు టెస్టులు జరగాల్సి ఉంది. అయితే మూడో టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాంచెస్టర్‌లో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. మూడో టెస్ట్ ముగిసిన అనంతరం సోమవారం నాడు గిల్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ తరువాత టెస్ట్ ఆడేందుకు ఫిట్‌గా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కానింగ్‌లో పంత్ వేలికి పెద్ద గాయం కాలేదని తేలింది.

ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్ట్ మొదటి రోజున రెండో సెషన్‌లో రిషబ్ పంత్ ఎడమ చూపుడు వేలికి గాయం కావడంతో మైదానాన్ని వీడాడు. దీనిపై మ్యాచ్ అనంతరం గిల్ మీడియాతో మాట్లాడుతూ, "పంత్ స్కానింగ్ కోసం వెళ్లాడు. పెద్ద గాయం కాలేదని స్కానింగ్ లో తేలింది. కాస్త విశ్రాంతి తీసుకుని మాంచెస్టర్‌లో జరిగే నాల్గవ టెస్ట్‌కు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉంటాడు" అని గిల్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎడమవైపు డైవ్ చేసిన తర్వాత పంత్ నొప్పికి గురయ్యాడు. ఆ తర్వాత అతను వికెట్ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. పంత్ అయితే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంత సౌకర్యంగా కనిపించలేదు. 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా, కీలకమైన నాల్గవ టెస్ట్ జూలై 23న ప్రారంభమవుతుంది. మరోవైపు 9 రోజుల విరామం తర్వాత ప్రారంభం కానున్న తదుపరి టెస్ట్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అని అని సందేహాలు నెలకొన్నాయి. 

మూడో టెస్ట్‌లో పోరాడి ఓడిన భారత్ 

భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్‌ నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లాలనున్న పర్యాటక జట్టుకు నిరాశే ఎదురైంది. కేఎల్ రాహుల్ మినహా టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో లార్డ్స్ టెస్టులో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టెస్ట్‌లో విజయం సాధించడానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగింది. నాలుగో రోజే భారత్ టాపార్డర్ బ్యాటర్లు ఔటయ్యారు. మొదట్లో రాహుల్ శ్రమించగా.. దురదృష్టవశాత్తూ అతడు ఔట్ కావడంతో విజయంపై భారత్ ఆశలు సన్నగిల్లాయి. తక్కువ టార్గెట్ అని అంతా అనుకున్నారు. కానీ విజయం అంత ఈజీ కాదని నాలుగో రోజే తేలిపోయింది. అయితే నెంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పట్టుదలతో బ్యాటింగ్ చేయడంతో భారత్ పరువు కాపాడుకుంది. లేకపోతే స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యేది. బషీర్ బౌలింగ్ లో సిరాజ్ డిఫెన్స్ ఆడిన బంతి తిరిగి వెనక్కి వచ్చి వికెట్ కు తాకడంతో బెయిల్ కింద పడింది. ఇంగ్లాండ్ ఆటగాళ్ల సంబరాలు మొదలయ్యాయి. భారత్ 170 పరుగులకే కుప్పకూలింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget