అన్వేషించండి

Shubman Gill: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు- రిషబ్ పంత్ గాయంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక ప్రకటన

Did Rishabh Pant to Play 4th Test against England | వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంపై టీమిండియా కెప్టెన్ కీలక ప్రకటన చేశాడు. అతడ్ని మైదానంలో చూడాలని ఉందన్నాడు.

India vs England 4ht Test: లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. టెయిలెండర్లతో కలిసి రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడినా భారత్‌కు మరో ఓటమి తప్పలేదు. దాంతో సిరీస్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో రెండు టెస్టులు జరగాల్సి ఉంది. అయితే మూడో టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాంచెస్టర్‌లో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. మూడో టెస్ట్ ముగిసిన అనంతరం సోమవారం నాడు గిల్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ తరువాత టెస్ట్ ఆడేందుకు ఫిట్‌గా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కానింగ్‌లో పంత్ వేలికి పెద్ద గాయం కాలేదని తేలింది.

ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్ట్ మొదటి రోజున రెండో సెషన్‌లో రిషబ్ పంత్ ఎడమ చూపుడు వేలికి గాయం కావడంతో మైదానాన్ని వీడాడు. దీనిపై మ్యాచ్ అనంతరం గిల్ మీడియాతో మాట్లాడుతూ, "పంత్ స్కానింగ్ కోసం వెళ్లాడు. పెద్ద గాయం కాలేదని స్కానింగ్ లో తేలింది. కాస్త విశ్రాంతి తీసుకుని మాంచెస్టర్‌లో జరిగే నాల్గవ టెస్ట్‌కు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉంటాడు" అని గిల్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎడమవైపు డైవ్ చేసిన తర్వాత పంత్ నొప్పికి గురయ్యాడు. ఆ తర్వాత అతను వికెట్ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. పంత్ అయితే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంత సౌకర్యంగా కనిపించలేదు. 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా, కీలకమైన నాల్గవ టెస్ట్ జూలై 23న ప్రారంభమవుతుంది. మరోవైపు 9 రోజుల విరామం తర్వాత ప్రారంభం కానున్న తదుపరి టెస్ట్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అని అని సందేహాలు నెలకొన్నాయి. 

మూడో టెస్ట్‌లో పోరాడి ఓడిన భారత్ 

భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్‌ నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లాలనున్న పర్యాటక జట్టుకు నిరాశే ఎదురైంది. కేఎల్ రాహుల్ మినహా టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో లార్డ్స్ టెస్టులో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టెస్ట్‌లో విజయం సాధించడానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగింది. నాలుగో రోజే భారత్ టాపార్డర్ బ్యాటర్లు ఔటయ్యారు. మొదట్లో రాహుల్ శ్రమించగా.. దురదృష్టవశాత్తూ అతడు ఔట్ కావడంతో విజయంపై భారత్ ఆశలు సన్నగిల్లాయి. తక్కువ టార్గెట్ అని అంతా అనుకున్నారు. కానీ విజయం అంత ఈజీ కాదని నాలుగో రోజే తేలిపోయింది. అయితే నెంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పట్టుదలతో బ్యాటింగ్ చేయడంతో భారత్ పరువు కాపాడుకుంది. లేకపోతే స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యేది. బషీర్ బౌలింగ్ లో సిరాజ్ డిఫెన్స్ ఆడిన బంతి తిరిగి వెనక్కి వచ్చి వికెట్ కు తాకడంతో బెయిల్ కింద పడింది. ఇంగ్లాండ్ ఆటగాళ్ల సంబరాలు మొదలయ్యాయి. భారత్ 170 పరుగులకే కుప్పకూలింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget