Asia Cup 2025: సంజు లేదా గిల్- టీ20లలో ఎవరు మంచి ఓపెనర్? స్టాట్స్ ఏం చెబుతున్నాయి?
Sanju Samson or Shubman Gill: శుభమన్ గిల్ మళ్ళీ టీ20 జట్టులోకి వచ్చాడు. సంజు శాంసన్ ఓపెనర్గా రాణిస్తున్నాడు. ఇద్దరి రికార్డులు పరిశీలిద్దాం.

Sanju Samson or Shubman Gill: సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించారు. గిల్ చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. తిరిగి రావడంతో పాటు గిల్ ను జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా నియమించారు. అదే సమయంలో, భారత జట్టు తరఫున చాలా కాలంగా ఓపెనింగ్ చేస్తున్న సంజు శాంసన్ పేరు కూడా జట్టులో ఉంది. గిల్ తిరిగి వచ్చిన తర్వాత, శాంసన్ను ఓపెనింగ్ స్థానం తప్పించి వేరే డౌన్లో పంపిస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గణాంకాల ప్రకారం చూస్తే, టీ20 ఇంటర్నేషనల్ లో ఎవరు ఉత్తమ ఓపెనర్ గా నిలిచారో గత గణంకాలను ఓసారి చూద్దాం.
ఓపెనర్ గా శుభమన్ గిల్ రికార్డు
గిల్ ఇప్పటివరకు భారత్ తరఫున 21 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ సమయంలో గిల్ 30.42 సగటుతో 578 పరుగులు చేశాడు. గిల్ స్ట్రైక్ రేట్ టీ20లో 139.28గా ఉంది. గిల్ ఇప్పటివరకు 3 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. గిల్ అత్యధిక స్కోరు 126 పరుగులు.
ఓపెనర్ గా సంజు శాంసన్ రికార్డు
గత కొంతకాలంగా సామ్సన్ టీ20 జట్టులో భారత్ తరఫున ఓపెనింగ్ చేస్తున్నాడు. శాంసన్ ఇప్పటివరకు భారత్ తరఫున 17 టీ20 మ్యాచ్ల్లో ఓపెనింగ్ చేశాడు. ఈ సమయంలో శాంసన్ 32.63 సగటుతో 522 పరుగులు చేశాడు. శాంసన్ 178.77 స్ట్రైక్ రేట్ ను కలిగి ఉన్నాడు. అదే సమయంలో శాంసన్ మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు.
శాంసన్ స్థానానికి ప్రమాదం, అగర్కర్ సూచన
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాంసన్ ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోవచ్చని ఊహాగానాలకు తెరలేపారు. అగర్కర్ మాట్లాడుతూ, "గిల్, జైస్వాల్ అందుబాటులో లేనందున శాంసన్ ఓపెనింగ్ చేశాడు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి గిల్, శాంసన్ ఇద్దరూ మంచి ఆప్షన్లు. దుబాయ్ చేరుకున్న తర్వాత కెప్టెన్, కోచ్ నిర్ణయం తీసుకుంటారు." అని అన్నారు.
2025 ఆసియా కప్ కోసం భారత జట్టు- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకు సింగ్.
భారత జట్టు తొలి మ్యాచ్ ఈ రోజు ఆడనుంది
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న ఆడనుంది. అక్కడ యూఏఈతో తలపడనుంది.
Before You Go
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
ట్రెండింగ్ వార్తలు



















