అన్వేషించండి

Ravindra Jadeja Press Conference: జడేజా ప్రెస్ కాన్ఫరెన్స్ వివాదం - మెల్‌బోర్న్‌లో మ్యాచ్ రద్దు, షాక్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా

Ind Vs Aus Test Series: భారత క్రికెటర్ జడేజా అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఆసీస్ మీడియా అత్యుత్సాహంతో వ్యవహరించడంతో దానికి భారత టీమ్ మేనేజ్మెంట్ దీటుగా బదులిచ్చింది. 

Cricket News: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కారణంగా ఒక మ్యాచ్ రద్దైనట్లు తెలుస్తోంది. నిజానికి ఈ వివాదంతో అతనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా, అతని పేరు తీస్తున్నట్లుగా టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంటున్నారు. మెల్ బోర్న్‌లో ఇటీవల మీడియాతో జడేజా సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చాడు. అయితే ఆ తర్వాత అతను సడెన్ గా సమావేశం నుంచి వెళ్లి పోవడంతోనే గొడవ ప్రారంభమైందని పలు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా హిందీలో అతను సమాధానం ఇవ్వడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్లు తెలుస్తోంది. అయితే మీడియా సమావేశంలో ఇంగ్లీషులో మాట్లాడాలని ఆసీస్ మీడియా కోరగా, జడేజా తిరస్కరించిటనట్లుగా కంగారూ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే దీన్ని టీమిండియా మేనేజ్మెంట్ ఖండిస్తోంది. 

అసలేమైందంటే..?
మీడియా సమావేశంలో కొంతమంది భారత జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలను హిందీలో అడిగారు. దానికి సమాధానంగా జడేజా కూడా హిందీలోనే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత తనకు పని ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. అయితే తమకు తగినంత సమయం కేటాయించలేదని ఆసీస్ మీడియా ఆరోపించింది. దీనిపై కాస్త వివాదం చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. అయితే జడేజాకు మద్దతుగా టీమ్ మేనేజ్మెంట్ నిలిచింది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాటు చేసిన మీడియా మ్యాచ్ కూడా రద్దయినట్లు తెలుస్తోంది. 

ఆదివారం మ్యాచ్ రద్దు..
మెల్‌బోర్న్‌లోని మైదానంలో ఇరు జట్ల జర్నలిస్టులకు మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ఫ్రెండ్లీ టీ20 మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన భాతర ట్రావెలింగ్ జర్నలిస్టులు వైదొలగడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా షాకయ్యింది. ఇక జడేజాపై ఆరోపణలు చేసిన క్రమంలోనే ఈ మ్యాచ్ నుంచి భారత జర్నలిస్టులు వైదొలిగారని, దీని వెనకాల టీమిండియా మీడియా మేనేజర్ ఉన్నట్లు ఆసీస్ మీడియా ఆరోపిస్తోంది. ఇక భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా, తొలి టెస్టును భారత్ 295 పరుగులతో, రెండో టెస్టును ఆసీస్ 10 వికెట్లతో గెలుపొందాయి. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక సిరీస్‌లో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. నాలుగో టెస్టు ఈ నెల 26న బాక్సింగ్ డే నాడు మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభమవుతుంది. మూడో టెస్టులో జట్టులో చోటు దక్కించుకున్న జడేజా సత్తా చాటాడు. 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు ఫాలో ఆన్ తప్పించుకోవడంతో కీలక భూమిక పోషించాడు. 

Also Read: U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు

టాప్ హెడ్ లైన్స్

Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Vaibhav Sooryavanshi T20 Series Debate: ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మధ్యలోనే హఠాత్తుగా క్రికెట్‌కు గుడ్‌బై
బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మధ్యలోనే హఠాత్తుగా క్రికెట్‌కు గుడ్‌బై
Team India White Washed VS Ireland T20 Series: ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!
ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget