India vs England Semifinals: వర్షం వల్ల సెమీఫైనల్ రద్దయితే టీమిండియా ఎలిమినేట్ అవుతుందా? ICC రూల్స్ ఇవే
IND vs ENG T20 World Cup 2026 Semi Final: వర్షం కారణంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ రద్దైతే, ఏ జట్టు ఫైనల్కు చేరుకుంటుంది ? ఐసీసీ రూల్స్ తెలుసుకోండి.

Ind vs Eng semifinal T20 World Cup | ముంబై: టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గురువారం (మార్చి 05)న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే కనుక టీమ్ ఇండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరినట్లు అవుతుంది. అయితే మ్యాచ్కు ముందు ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల వర్షాల కారణంగా కొన్ని మ్యాచులు రద్దయ్యాయి. ఒకవేళ మ్యాచ్ రోజున వర్షం పడితే, అప్పుడు ఫైనల్కు చేరుకునే టీం ఏది, ఫలితం ఎలా ఉంటుంది? అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ చెక్ చేస్తున్నారు.
సెమీఫైనల్ కోసం రిజర్వ్ డే
టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ల కోసం రిజర్వ్ డే కేటాయించింది ఐసీసీ. టోర్నీలో లీగ్ స్టేజీతో పాటు సూపర్ 8 దశలోనూ రిజర్వ్ డే లేదు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ గురువారం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మ్యాచ్ రోజున అంటే గురువారం వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే కనుక.. మరుసటి రోజు అంటే రిజర్వ్ డే (మార్చి 06) నాడు ఆ మ్యాచ్ నిర్వహిస్తారు.
అదేవిధంగా ఒకవేళ మార్చి 5న మ్యాచ్ ప్రారంభమై, మధ్యలో వర్షం వచ్చి మ్యాచ్ మళ్ళీ మొదలవ్వకపోతే.. అప్పుడు మ్యాచ్ మరుసటి రోజు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుండే ప్రారంభించనున్నారు. కనుక వర్షం వచ్చినా ఏం టెన్షన్ అవసరం లేదు.
All roads lead to the iconic Wankhede Stadium 🛣️🏟️
— BCCI (@BCCI) March 4, 2026
The semi-final beckons for #TeamIndia 🇮🇳#T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/lMnfegdjWg
ఒకవేళ రెండు రోజులూ వర్షం పడితే
ఒకవేళ రెండు రోజులూ వర్షం పడి మ్యాచ్లో ఒక్క బంతి కూడా పడకపోతే, అప్పుడు ఏ జట్టు ఫైనల్ చేరుతుందని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో సూపర్-8లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. కానీ ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు.
రెండు రోజులూ వర్షం పడి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్ సూపర్-8లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.
మరోవైపు భారత్ సూపర్-8లో 3 మ్యాచ్లలో రెండింటిని గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని ఇండియా టీం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ చేరుకుంది. ఈ లెక్కన మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి వస్తే ఇండియా ఫైనల్కు చేరే అవకాశం కోల్పోతుంది. కానీ రెండు రోజులు మ్యాచ్ నిర్వహించకుండా ఉండే అవకాశమే లేదని తెలుస్తోంది.





















