అన్వేషించండి

Pan Masala Ad: సచిన్‌ను చూసి నేర్చుకోండి! సన్నీ, సెహ్వాగ్‌ను బాగా తిట్టేసిన గౌతీ!

Pan Masala Ad: రోల్‌ మోడల్‌ స్థాయికి ఎదిగిన క్రికెటర్లు బాధ్యతగా ఉండాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అంటున్నాడు.

Pan Masala Ad: 

రోల్‌ మోడల్‌ స్థాయికి ఎదిగిన క్రికెటర్లు బాధ్యతగా ఉండాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అంటున్నాడు. పాన్‌ మసాలా యాడ్‌లో నటించిన వీరేంద్ర సెహ్వాగ్‌, సునిల్‌ గావస్కర్‌ను ఘాటుగా విమర్శించాడు. డబ్బుల కోసం అలాంటి స్థాయికి దిగజారొద్దని సూచించాడు. కోట్లాది మంది యువత మిమ్మల్ని గమనిస్తారని తెలియదా అని ప్రశ్నించాడు. న్యూస్‌18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ సమయంలో చాలామంది క్రికెటర్లు ప్రకటనల్లో నటిస్తుంటారు. లైమ్‌లైట్‌లో ఉండే మాజీ ఆటగాళ్లనూ నటించాల్సిందిగా యాడ్‌ ఏజెన్సీలు కోరుతుంటాయి. ఇందులో భాగంగానే రీసెంట్‌గా మాజీ బ్లాస్టింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, ఒకప్పటి దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ పాన్‌ మసాలా యాడ్‌లో నటించారు. వారిద్దరూ ఇలా చేయడం దారుణమని, చాలా నిరాశపడ్డానని గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు.

'ఇది డిస్‌గస్టింగ్‌గా అనిపించింది. చాలా నిరాశకు గురయ్యాను. అందుకే రోల్‌ మోడల్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నేను పదేపదే చెబుతుంటాను. కేవలం పేరు తెచ్చుకుంటేనే గుర్తింపు రాదు. మనం చేసే పనులను బట్టే వస్తుంది. కోట్లాది మంది పిల్లలు మనల్ని చూస్తుంటారు. పాన్‌ మసాలా ప్రకటనల్లో నటించి డబ్బులు సంపాదించడం అంత ముఖ్యమేమీ కాదు. 2018లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు రూ.3 కోట్లు వదిలేసుకున్నాను. నేను దాన్ని తీసుకోవచ్చు. కానీ వదిలేశాను. ఎందుకంటే మనకు రావాల్సిందే వస్తుందని నా నమ్మకం' అని గౌతీ అన్నాడు.

'పాన్‌ మసాల ప్రకటనలో నటించాలని సచిన్‌ తెందూల్కర్‌కు రూ.20-30 కోట్లు ఆఫర్‌ చేశారు. కానీ అలాంటి వాటిల్లో భాగస్వామి కానని ఆయన తన తండ్రికి మాటిచ్చారు. అందుకే సచిన్‌ ఆరాధ్యుడిగా మారిపోయారు. అలాంటి పెద్ద ఆఫర్‌ను కాదనాలంటే చాలా ధైర్యం కావాలి' అని గంభీర్‌ అన్నాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ఓటమి తర్వాత గౌతీ స్పందించాడు. జట్టులో స్టార్‌ కల్చర్‌కు తెరపడాలని సూచించాడు. టీమ్ఇండియా కన్నా ఎవరూ ఎక్కువ కాదని, టీమ్‌నే స్టార్‌గా మార్చాలని వెల్లడించాడు. ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడటం మంచిదన్నాడు.

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గదను సొంతం చేసుకొనేందుకు 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్‌ స్కోరర్లు. చెతేశ్వర్‌ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్‌ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget